హైదరాబాద్, ఆట ప్రతినిధి: సేలం(తమిళనాడు) వేదికగా జరిగిన 3వ జాతీయ స్పోర్ట్స్ ఎరోబిక్స్ ఫిట్నెస్ చాంపియన్షిప్లో తెలంగాణ టీమ్ ఓవరాల్ విజేతగా నిలిచింది. నాలుగు రోజుల పాటు జరిగిన టోర్నీలో తెలంగాణ 734 పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా, ఆతిథ్య తమిళనాడు(640) రన్నరప్ దక్కించుకుంది.
బాలికల అండర్-8 వ్యక్తిగత విభాగంలో సోనాక్షిగౌడ్, ఆద్య షణ్ముగం పసిడి పతకాలతో మెరువగా, అండర్-10 టీమ్ ఈవెంట్లో సమీక్ష, జ్ఞానవి స్వర్ణాలు సొంతం చేసుకున్నారు. అండర్-16 కేటగిరీలో ఆయేషా, క్రోద్వీర్కు రజతాలు దక్కించుకున్నారు.