హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ బలిదానానికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.10 లక్షల వెలగట్టిందని కార్మికవర్గం మండిపడుతున్నది. ఆర్టీసీ సమ్మెపై శుక్రవారం సచివాలయంలో జరిగిన చర్చల సందర్భంగా మంత్రులు కార్మికుడి చావుకు అతి తక్కువ వెలగట్టారని కుటుంబ సభ్యులు, కార్మికులు రగిలిపోతున్నారు. శంకర్గౌడ్ కుటుంబానికి రూ.10 లక్షలసాయం, ఇందిరమ్మ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని సర్కార్ ప్రకటించింది.
దీంతో కార్మికులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ హామీలను అమలు చేయకపోవడం వల్లే శంకర్గౌడ్ ప్రాణాన్ని బలి తీసుకున్నారని ఆవేదన చెందుతున్నారు. కార్మికుడు బలైతే కేవలం 10 లక్షలతోనే చేతులు దులుపుకొంటారా? అని ప్రశ్నిస్తున్నారు. రూ.2 కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.