హైదరాబాద్ : రాష్ట్రంలోని పీఈటీ, భాషా పండితులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీఈటీ, భాషా పండితుల పోస్టులను అప్గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు శనివారం విద్యాశాఖ పీఈటీ, భాషా పండితుల పోస్టులను స్కూల్ అసిస్టెంట్గా అప్గేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో రాష్ట్రంలోని 8,630 మంది భాషా పండితులు, 1,849 మంది పీఈటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి లభించనుంది. ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నూతన జిల్లాల్లో పోస్టుల భర్తీకి ఆమోదం..
నూతనంగా ఏర్పడిన ములుగు, నారాయణపేట్ జిల్లాల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రెవెన్యూశాఖలో జిల్లాకు 53 పోస్టుల చొప్పున 106 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.