హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం అప్పుల పరంపరను కొనసాగిస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ప్రారంభమైన తొలిరోజే ఏకంగా రూ.7,000 కోట్ల భారీ రుణాన్ని సమీకరించిన రేవంత్రెడ్డి సర్కార్.. రిజర్వు బ్యాంకు ప్రతి మంగళవారం నిర్వహించే ఓపెన్ మా రెట్ ఈ-వేలంలో పాల్గొని సెక్యూరిటీ బాండ్లు పెట్టి మరో రూ.3,000 కోట్లు రుణ సమీకరణ చేసింది. తాజా రుణం తో కలిపి ఈ ఒక వారంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అప్పులు అక్షరాల రూ.10 వేల కోట్లకు చేరింది. 17 ఏండ్ల కాలపరిమితితో 7.97 శాతం వార్షిక వడ్డీకి రూ.1,500 కోట్లు, 30 ఏండ్ల కాలపరిమితితో 8.07 శాతం వార్షిక వడ్డీకి మరో రూ. 1500 కోట్లు ఆర్బీఐ నుంచి సేకరించింది.
ప్రస్తుత ఆర్థిక సం వత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) ప్రభుత్వం రూ.18,900 కోట్ల అప్పు చేసింది. ఇప్పుడు జూలై-సెప్టెంబర్ (క్యూ2) త్రైమాసికానికిగానూ రూ.21,000 కోట్లు అప్పు కావాలని ఆ ర్బీఐకి ప్రతిపాదనలు పంపగా.. అందు లో మొదటి రోజే రూ.7,000 కోట్లు, మంగళవారం మరో రూ.3000 కోట్లు తీసుకున్నది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఆర్బీఐ నుంచి సేకరించిన మొత్తం అప్పుల విలువ రూ.28,900 కోట్లకు చేరింది. గత బడ్జెట్ అంచనాల్లో రుణ సమీకరణను రూ. 54,009 కోట్లలోపే ప్రతిపాదించినప్పటికీ.. ఒక ఆర్బీఐ నుంచే ఓపెన్ మారెట్ రుణాల రూపంలో ఏకంగా రూ. రూ.85,840 కోట్లు అప్పుగా తెచ్చారు. ఇది బడ్జెట్ ప్రతిపాదనల కం టే 158.93 శాతం అధికం. కాగా, ప్ర స్తుత 2026-27 ఆర్థిక సంవత్సరానికిగానూ మొత్తం రూ.80,000 కోట్ల రుణ సమీకరణ చేయాలని తాజా బడ్జెట్లో ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
