Telangana | ప్రజల ఆరోగ్య సంరక్షణ సేవల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో చర్యలకు శ్రీకారం చుట్టింది. కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకువచ్చింది. తకువ ఖర్చుతో రోగ నిర్ధారణ, సానింగ్ తదితర సేవలను ప్రారంభించింది.
ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తూ వైద్యరంగంలో మౌలిక సదుపాయాల బలోపేతం, ఆరోగ్య సంరక్షణ సేవలు, వైద్య విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. 2023-24 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం 900 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించడంతో పాటు 3,897 పోస్టుల భర్తీతో తొమ్మిది జిల్లాల్లో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించింది.
ప్రజలకు తకువ ఖర్చుతో రోగ నిర్ధారణ, సానింగ్ తదితర సేవలను అందించాలనే ఉద్దేశంతో 2018లో ‘తెలంగాణ వ్యాధి నిర్ధారణ పథకం’ హబ్-అండ్-స్పోక్ను ప్రారంభించింది. ఇది అపెక్స్ లేబొరేటరీ కేంద్రం, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా (అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్) పనిచేస్తున్నది. కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, ఏరియా దవాఖానలు మొదలైనవి దీని కింద పనిచేస్తున్నాయి. ప్రస్తుతం, 20 జిల్లా స్థాయి డయాగ్నస్టిక్ హబ్లలో 57 రకాల పరీక్షలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 104 డయాలసిస్ కేంద్రాల్లో సుమారు 6 లక్షల డయాలసిస్ సెషన్లు నిర్వహిస్తున్నారు. అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం 2018లో అతిపెద్ద కమ్యూనిటీ ఐ-స్రీన్ ప్రోగ్రామ్ కంటి వెలుగును ప్రారంభించింది. వ్యాక్సిన్లు, శస్త్ర చికిత్స సామగ్రి సహా వివిధ ఔషధాల సరఫరా నిర్వహణలోనూ రాష్ట్రం ముందుంది.
తెలంగాణ రాష్ట ఆరోగ్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ వివిధ ప్రాంతీయ/జిల్లా ఔషధ గిడ్డంగులు, జిల్లా దవాఖానలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక కేంద్రాలు, ఉప కేంద్రాలను అనుసంధానం చేసే వెబ్ ఆధారిత మందుల సరఫరా, నిర్వహణ, అప్లికేషన్, వ్యాక్సిన్ల పంపిణీ వ్యవస్థను అమలు చేస్తున్నది. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం రాజస్థాన్, బీహార్లతో దాదాపు సమానంగా దేశంలోనే మూడవ స్థానంలో నిలిచింది.