హైదరాబాద్ : గురుకులాల్లో ప్రత్యక్ష తరగతుల ప్రారంభంపై విధించిన స్టేను ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును కోరింది. గతంలో గురుకులాలు తెరువొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మధ్యంతర ఉత్తర్వులను సోమవారం ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు నడుస్తున్నాయని ఎస్జీపీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టాలని సీజే ధర్మాసనాన్ని కోరారు. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణను బుధవారం పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది.