హైదరాబాద్ : గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ గురువారం లేఖను రాశారు. గోదావరి డీఆర్పీలపై జీఆర్ఎంబీ తన పరిధికి మంచి స్క్రూటినీ పేరుతో చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ లేఖ రాసిన ఆయన.. డీపీఆర్లను సీడబ్ల్యూసీకి కంపాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టం క్లాజ్ 85(8)(డీ) లో పేర్కొన్న అధికారాలకు మించి అనేక అంశాలపై రీమార్కులు రాస్తూ కాలయాపన చేస్తున్నారన్నారు.
ఆ క్లాజ్ లో పేర్కొన్న అంశాలకు మాత్రమే పరిమితం కావాలని, మిగతా అంశాలని పరిశీలించడానికి కేంద్ర జలసంఘంలో అనేక డైరెక్టరేట్లు ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో కేఆర్ఎంబీ.. ఆంధ్రప్రదేశ్ సమర్పించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్ను తమకు వాటిని పరిశీలించే నైపుణ్యం లేదని పేర్కొంటూ డీపీఆర్లను సెంట్రల్ వాటర్ కమిషన్కు పంపిన విషయాన్ని ఈఎన్సీ గుర్తు చేశారు. తక్షణమే తెలంగాణ ప్రాజెక్టుల డీపీఆర్లను సీడబ్ల్యూసీకి పంపాలని జీఆర్ఎంబీని కోరారు.