హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ ఎగుమతుల్లో తెలంగాణ అద్భుత ప్రగతిని సాధిస్తున్నదని, రాష్ట్రాన్ని గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ హబ్గా మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలతోకూడిన ఇండస్ట్రియల్ పారులు, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు, లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిల్లింగ్ ఎకో సిస్టం, ఇన్నోవేషన్ నెట్వర్స్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని వివరించారు. శుక్రవారం నిర్వహించిన 48వ ఈఈపీసీ ఇండియా సదరన్ రీజియన్ అవార్డ్స్ ఫర్ ఎక్స్పోర్ట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2024- 25లో భారత్ నుంచి ఇంజినీరింగ్ ఎగుమతులు రికార్డు స్థాయిలో 116.67 బిలియన్ డాలర్లు దాటాయన్నారు. ఎక్స్పోర్ట్ రంగానికి అవసరమైన రెడీ టూ వర్ ఫోర్స్ను అందించే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని సంబంధిత దిగ్గజ పారిశ్రామికవేత్తలను మంత్రి ఈ సందర్భంగా ఆహ్వానించారు. హైదరాబాద్లో ఈఈపీసీ ప్రాంతీయ కార్యాలయాన్ని పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.