Telangana Decade Celebrations | ప్రగతి పథంలో సంక్షేమ రథాన్ని పరుగులెత్తించేవాడే నిజమైన పాలకుడు, నిఖార్సయిన నాయకుడు. పోరాడి సాధించుకున్న తెలంగాణను పారాడే పాపాయిలా కంటికి రెప్పలా కాపాడుకున్నారు మన ముఖ్యమంత్రి కేసీఆర్. అభివృద్ధిలో రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలబెట్టి తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపారు. సంక్షేమ పథంలో పతాకస్థాయిలో పథకాలు ప్రవేశపెట్టి బీదసాదలకు అండగా నిలిచారు. ఒకటా రెండా వందలాది పథకాలు, కార్యక్రమాలు రూపొందించి పక్కాగా అమలు చేస్తున్నారు. ముసలవ్వలకు పెద్దకొడుకు అయ్యారు. ఆడబిడ్డలను అన్నలా ఆదుకున్నారు. రూ.లక్షనూట పదహార్లు చదివించి నూతన వధువును గంపలో తెచ్చి పెండ్లిపీటలపై కూర్చోబెట్టి మేనమామ బాధ్యతను నెరవేరుస్తున్నారు. దివ్యాంగులకు కన్నతండ్రిగా, అంధులకు దార్శనికుడిగా, దళితుల దశ మార్చే నాయకుడిగా, బడుగు బలహీన వర్గాల పురోగతికి కంకణం కట్టుకున్న యోధుడిగా.. ఇలా ఒకేఒక్కడు సకల జనుల అభ్యున్నతికి అహరహం కృషి చేస్తున్నారు.
పాలకుడి ధర్మాలు ఏమిటో పురాణేతిహాసాలు ఏనాడో వెల్లడించాయి. పాలకుడి ధర్మనిష్ఠ, పరిపాలనా విధానాలు ఎలా ఉండాలో మహాభారతంలో భీష్ముడు బోధిస్తాడు. మన ముఖ్యమంత్రి అమలు చేస్తున్న పథకాల్లో, ప్రణాళికల్లో ఆ సూత్రాలు అడుగడుగునా ప్రతిబింబిస్తాయి. ‘పాలకుడు అనాథలకు అండగా నిలవాలి. అంధులకు కంటిచూపు కావాలి. నడవలేనివారికి నడిచే కాళ్లు కావాలి. సూర్యుడు భూమి నుంచి జీవరసాయనాన్ని గ్రహించి వేనవేల బాహువులతో మళ్లీ ఎలా దాన్ని సువృష్టిగా నేలమీద కురిపిస్తాడో, అలాగే పాలకుడు కూడా ప్రజల సంపదల్లో కొంత భాగాన్ని న్యాయంగా స్వీకరిస్తూ అర్హులైన పేదలకు, అన్నం పెట్టే రైతులకు మేలు చేయాలి. బడుగు ప్రజలను నిరంతరం ఆదుకోవాలనుకునే పాలకుడు ధనం, ధాన్యం, ఇతర నిత్యావసర వస్తువులకు కొరత లేకుండా చూసుకోవాలి. ప్రజల జీవనోపాధి కుంటుపడకుండా జాగ్రత్త పడాలి’ అని ధర్మరాజుకు పాలకుడి ధర్మాలను ఉద్బోధిస్తాడు భీష్ముడు. తరచి చూస్తే.. కేసీఆర్ పాలనలో ఇవన్నీ అమలవుతున్నాయన్నది సుస్పష్టం.
పథకాలు రూపొందించడం, వాటిని అమలుపరచడం చెప్పినంత తేలిక కాదు. ఉద్యమసమయంలో తెలంగాణ నలు చెరగులా తిరిగిన కేసీఆర్ రాష్ట్ర భౌగోళిక పరిస్థితులే కాదు, ప్రజల స్థితిగతులనూ ఆకళింపు చేసుకున్నారు. వారి ఆకలిని రూపుమాపాలని ఆనాడే నిశ్చయించుకున్నారు. రాష్ట్రం సాధించడంతోనే తన లక్ష్యం నెరవేరిందని సంతృప్తి చెందలేదు. ఎప్పటికప్పుడు మరో లక్ష్యాన్ని నిర్దేశించుకుంటూ తెలంగాణను కొత్త దిశలో నడిపిస్తున్నారు. వందలాది పథకాలు, లక్షలాది మంది లబ్ధిదారులు, కోట్లాది రూపాయలు.. ఇలా సంక్షేమంలో సరికొత్త విప్లవానికి నాంది పలికారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి పథకం వెనుక ఓ మేధో మథనం, ఓ సుదీర్ఘ మంతనం, ఓ విశాల దృక్పథం ఉన్నాయి. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేలా పకడ్బందీ ప్రణాళిక రూపొందించి అవసరార్థులకు అందించడంలో వంద శాతం విజయం సాధించింది తెలంగాణ ప్రభుత్వం.
తొమ్మిదేండ్ల పసి రాష్ట్రంలో జరుగుతున్న అద్భుతాలు ఇతర రాష్ర్టాలకు కనువిప్పు కలిగిస్తున్నాయి. ఇక్కడి పథకాలను ఐక్యరాజ్యసమితి సైతం అద్భుతమని పొగిడింది. సంపద సృష్టించడం ఎలాగో, దానిని పంచడం ఎలాగో యావత్ భారతానికీ బోధిస్తున్నది. తెలంగాణ ప్రజానీకానికి కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న ఆ పథకాల సమాహారం ఇది. ఏ పథకం ఎప్పుడు మొదలైందో? సాధించిన ఫలితమేమిటో? తెలిపే కరదీపిక కొత్త దశ.. ప్రగతి దిశ!
తిగుళ్ల కృష్ణమూర్తి, ఎడిటర్, నమస్తే తెలంగాణ
పథకం : కల్యాణలక్ష్మి
ప్రారంభం : 2014 అక్టోబర్ 2
లక్ష్యం : 18 ఏండ్లు దాటిన పేదింటి ఆడబిడ్డల పెండ్లికి రూ.1,00,116 ఆర్థిక సాయం.
ఫలితం : బాల్య వివాహాల రేటు 4.8 శాతం తగ్గింది. 12,69,843 మందికి సాయం అందింది.
పథకం : వితంతు పింఛన్లు
ప్రారంభం : 2014
లక్ష్యం : వితంతువుల పింఛన్ రూ.2016కు పెంపు.
ఫలితం : 15,84,063 మంది వితంతువులు ఈ సాయం పొందుతున్నారు.
పథకం : కేసీఆర్ కిట్
ప్రారంభం : 2017 జూన్ 2
లక్ష్యం : ప్రభుత్వ దవాఖానలో పురుడుపోసుకునే తల్లికి ప్రోత్సాహక నగదు బహుమతి. ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలు కానుకగా ఇవ్వడం.
ఫలితం: ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 31 నుంచి 61 శాతానికి పెరిగాయి. 13.91 లక్షల మందికి లబ్ధి చేకూరింది.
పథకం : ఆరోగ్యలక్ష్మి
ప్రారంభం : 2015 జనవరి 1
లక్ష్యం : రెండు మూడేండ్ల పిల్లలు, పాలిచ్చే తల్లులు, గర్భిణుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు అంగన్ వాడీ కేంద్రాల ద్వారా సమతుల పౌష్టిక ఆహారాన్ని అందించడం.
ఫలితం : సగటున ఏటా 5 లక్షల మందికి లబ్ధి.
పథకం : అమ్మ ఒడి
ప్రారంభం : 2018
లక్ష్యం : గర్భిణులు, బాలింతల కోసం
అంబులెన్స్ వసతి.
ఫలితం : 300 వాహనాల ద్వారా 16.43 లక్షల మంది గర్భిణులు, బాలింతలు అంబులెన్స్ సేవలు పొందారు.
పథకం : న్యూట్రిషన్ కిట్లు
ప్రారంభం : 2022 డిసెంబర్ 21
లక్ష్యం : గిరిజన ప్రాంతాల్లోని గర్భిణుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని నివారించి.. తద్వారా మాతృ మరణాలను తగ్గించడం. అందులో భాగంగా గర్భిణులకు ఐదో నెల, తొమ్మిదో నెల రూ.2,000 విలువ చేసే న్యూట్రిషన్ కిట్ అందిస్తారు.
ఫలితం : ఇప్పటికే 1.25 లక్షల మందికి లబ్ధి.
పథకం : బాలికల ఆరోగ్య రక్ష
ప్రారంభం : 2018 ఆగస్టు 24
లక్ష్యం : పాఠశాలలు, గురుకులాల్లో చదువుతున్న 7 నుంచి 12వ తరగతి విద్యార్థినులకు హైజీన్ కిట్లను అందివ్వడం.
ఫలితం : కౌమార బాలికల్లో ఆరోగ్య చైతన్యం
పథకం : గిరిపోషణ
ప్రారంభం : 2019
లక్ష్యం : గిరిజన మహిళల్లో రక్తహీనతను తగ్గించడం, పౌష్టికాహార లేమిని నివారించడం.
ఫలితం : 16,648 మంది గిరిజన మహిళలకు ప్రయోజనం
చేకూరింది.
పథకం : ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్
ప్రారంభం : 2015
లక్ష్యం : విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ఒక్కొక్కరికి గరిష్ఠంగా రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించడం. అందులో 5 శాతం ఆడపిల్లలకు
కేటాయింపు.
ఫలితం : దాదాపు 2,500 మంది నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లారు.
పథకం : బీడీ కార్మికులకు పింఛన్
ప్రారంభం : 2014 అక్టోబర్ 1
లక్ష్యం : బీడీ కార్మికులకు రూ.2,016 పింఛన్ ఇవ్వడం.
ఫలితం : 4,25,726 మందికి సాయం అందుతున్నది.
పథకం : షీ టీమ్స్
ప్రారంభం : 2014 అక్టోబర్ 24
లక్ష్యం : బహిరంగ ప్రదేశాలు, విద్యాసంస్థల్లో మహిళలను వేధింపుల నుంచి రక్షించడం.
ఫలితం : ఆకతాయిల చేష్టలు 33 శాతం వరకూ తగ్గాయి. ఈవ్ టీజర్ల బెడత తప్పింది.
పథకం : సఖి-భరోసా సెంటర్లు
ప్రారంభం : 2017 ఆగస్టు 19
లక్ష్యం : గృహ హింసకు గురవుతున్న మహిళలను అక్కున చేర్చుకుని వైద్య, న్యాయ సహాయం అందివ్వడం. బాధితులకు పునరావాసం.
ఫలితం : గృహహింస కేసులు 42.9 నుంచి
36.4 శాతానికి తగ్గాయి.
పథకం : మాతాశిశు దవాఖానాలు
ప్రారంభం : 2017
లక్ష్యం : గర్భిణులు, చిన్నారుల సంరక్షణకు ప్రత్యేక సదుపాయాలతో వైద్యశాలల ఏర్పాటు.
ఫలితం : మాతృమరణాల రేటు 92 నుంచి 56కు, నవజాత శిశు మరణాల రేటు 25 నుంచి 19కి తగ్గాయి.
పథకం : బతుకమ్మ చీరలు
ప్రారంభం : 2017
లక్ష్యం : బతుకమ్మ పండుగ సందర్భంగా పేద మహిళలకు నాణ్యమైన చీరలుకానుకగా ఇవ్వడం.
ఫలితం : ప్రతి సంవత్సరం సగటున కోటి మంది 18 ఏండ్లు నిండిన యువతులు, మహిళలకు చీరలు అందుతున్నాయి.
పథకం : షీ ట్యాక్సీ
ప్రారంభం : 2021
లక్ష్యం : హైదరాబాద్కు చెందిన నిరుపేద కుటుంబాల్లోని మహిళలకు డ్రైవింగ్లో శిక్షణ ఇవ్వడంతోపాటు సబ్సిడీపై ట్యాక్సీలను అందించడం.
ఫలితం: దాదాపు 215 మందికిపైగా మహిళలు క్యాబ్ డ్రైవర్లుగా ఉపాధి పొందుతున్నారు.
పథకం : ఒంటరి మహిళలకు పింఛన్
ప్రారంభం : 2017 జూన్ 2
లక్ష్యం : 30 ఏండ్లు పైబడిన
ఒంటరి మహిళలకు రూ.2,016 పింఛన్ అందివ్వడం.
ఫలితం: 1,43,894 మంది ఒంటరి మహిళలు సాయం పొందుతున్నారు.
పథకం : ఆరోగ్య మహిళ
ప్రారంభం : 2023 మార్చి 8
లక్ష్యం : రాష్ట్రవ్యాప్తంగా 100 కేంద్రాల్లో 57 రకాల వైద్యపరీక్షలను
ఉచితంగా నిర్వహించడం. మెరుగైన చికిత్స అందివ్వడం.
ఫలితం : లక్ష మందికిపైగా మహిళలు వైద్యపరీక్షలుచేయించుకుంటున్నారు.
పథకం : మహిళా శక్తి కేంద్రం
ప్రారంభం : 2021
నిర్దేశిత లక్ష్యం : మహిళలకు హక్కులపై అవగాహన కల్పించడం.
ఫలితం : స్త్రీలలో ఆత్మవిశ్వాసం పెరుగుతున్నది.
పథకం : స్వధార్ హోమ్లు
ప్రారంభం : 2015
లక్ష్యం : ఒంటరి మహిళలకు తాత్కాలికంగా
ఆవాసం కల్పించడం. స్వయం
ఉపాధిలో శిక్షణ ఇవ్వడం.
ఫలితం : ఎందరో కొత్త జీవితం ప్రారంభిస్తున్నారు.
పథకం :వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్
లక్ష్యం : పట్టణాల్లో ఉద్యోగినులకు సురక్షితమైన,
చవకైన హాస్టల్ వసతి అందించడం.
ఫలితం : ఉద్యోగినులకు ఇబ్బందులు తప్పాయి.
పథకం :పథకం : వీ హబ్
ప్రారంభం : 2018 మార్చి 8
లక్ష్యం : ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా నిలవడం. మేనేజ్మెంట్ సూత్రాలు తెలియజేయడంతోపాటు, అవసరమైన నిధులను సమకూర్చడం.
ఫలితం : వీ హబ్ ద్వారా ఇప్పటివరకు 2,823 మంది మహిళలకు ఉపాధి లభించింది. 5,235 మంది ఆంత్రప్రెన్యూ ర్లకు ప్రభుత్వం అండగా నిలిచింది. పలు స్టార్టప్లకు ఇన్వెస్టర్ల ద్వారా రూ.85.21 కోట్ల పెట్టుబడులు సమకూరాయి.
పథకం : స్త్రీ నిధి రుణాలు
ప్రారంభం : 2020-21
లక్ష్యం : పాడి తదితర రంగాల్లో స్వయం ఉపాధికి మహిళలకు సబ్సిడీపై రుణాలు ఇవ్వడం. మహిళా సంఘాలకు అందజేస్తున్న రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడం.
ఫలితం : 2,26,241 మందికి లబ్ధి.
పథకం : ఉజ్వల హోమ్లు
ప్రారంభం : 2016
లక్ష్యం : అక్రమ రవాణాకు గురైన మహిళలను రక్షించి పునరావాసం కల్పించడం.
ఫలితం : ఎంతోమందికి కొత్త జీవితం
పథకం : డీఎంఎస్వీకే (దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం)
లక్ష్యం : మహిళలకు వివిధ స్వయం ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ.
ఫలితం : వేలాది మంది నిరుపేద మహిళలు శిక్షణ తీసుకుని స్వయం ఉపాధి పొందుతున్నారు.
పథకం :తరుణి బ్రాండ్
ప్రారంభం : 2019
లక్ష్యం : మహిళా వ్యాపారవేత్తలు స్వయం ఉపాధి ద్వారా తయారుచేసిన ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం తరుణి బ్రాండ్ పేరుతో ఎగ్జిబిషన్ల ఏర్పాటు.
ఫలితం : అనేక మంది మహిళలు ఈ ఎగ్జిబిషన్లలో స్టాళ్లను ఏర్పాటుచేసి లాభం పొందుతున్నారు.
పథకం : మహిళా ఆర్గనైజర్స్
ప్రారంభం : 2017 జూన్ 5
లక్ష్యం : మహిళా సంక్షేమ పథకాల అమలుకు రెండు జిల్లాలకు ఒకరు చొప్పున మహిళా ఆర్గనైజర్ల నియామకం.
ఫలితం : పారదర్శకత పెరిగింది.
పథకం :ప్రత్యేక రిజర్వేషన్లు
లక్ష్యం : విద్య, ఉపాధి, రాజకీయాలు, వ్యాపార రంగాల్లో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేయడం.
ఫలితం : బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ రుణాల్లో 25-35 శాతం మహిళలు పొందుతున్నారు. బాలికల గురుకులాల్లోని పోస్టులన్నీ
మహిళలకే దక్కాయి. స్థానిక సంస్థల్లో 65 వేల మందికిపైగా ప్రాతినిధ్యం దక్కింది.
పథకం :రెక్కల వాహనం
ప్రారంభం : 2017
లక్ష్యం : మాతాశిశు సంరక్షణలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి సేవలు అందించేందుకు నర్సులకు ప్రత్యేక వాహనాలు సమకూర్చడం.
ఫలితం : తల్లీబిడ్డలకు తక్షణ వైద్యం అందుతున్నది.
పథకం : తెలంగాణ టీకా వాహనాలు
ప్రారంభం : 2017 మే 6
లక్ష్యం : మిషన్ ఇంద్రధనుష్లో భాగంగా ఇంటింటికీ వెళ్లి చిన్నారులకు టీకాలు వేసే ఆశా వర్కర్లకు వాహనాలు.
ఫలితం : వ్యాక్సినేషన్ విజయానికి దోహదం.
పథకం : దీపం
ప్రారంభం : 2014
లక్ష్యం : పేదమహిళలకు గ్యాస్ కనెక్షన్లు అందివ్వడం.
ఫలితం : 6,34,776 మంది నిరుపేద మహిళలకు గ్యాస్ కనెక్షన్లు అందాయి.
పథకం :మొబైల్ ఫిష్ ఔట్లెట్స్
ప్రారంభం : 2018
లక్ష్యం : పట్టణాల్లో చేపలను విక్రయించే మహిళలకు మొబైల్ వాహనాలు.
ఫలితం : ఉపాధి అవకాశాలు పెరిగాయి.
పథకం : షీ క్యాబ్స్
ప్రారంభం : 2015 సెప్టెంబర్ 5
లక్ష్యం : మహిళా డ్రైవర్లకు 5 శాతం సబ్సిడీపై వాహన రుణాలు అందించడం.
ఫలితం : మహిళలకు సురక్షిత ప్రయాణం
పథకం : కస్టమ్ హైరింగ్ సెంటర్స్
ప్రారంభం : 2020
లక్ష్యం : కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ఏర్పాటుచేసి మహిళా రైతులకు వ్యవసాయ పరికరాల అందజేత.
ఫలితం : ఆధునిక సేద్యానికి ఆలంబన
పథకం : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ
ప్రారంభం : 2017 నుంచి విడతల వారీగా
లక్ష్యం : బాలబాలికలకు వేర్వేరుగా, మొత్తంగా ఎస్సీల కోసం 268 గురుకులాల ఏర్పాటు. కేజీ నుంచి డిగ్రీ వరకు ఉచితంగా నాణ్యమైన విద్య అందించడం.
ఫలితం : ఏటా 1.30 లక్షల మందికి ప్రయోజనం.
పథకం :పాకెట్ మనీ
ప్రారంభం : 2017
లక్ష్యం : సంక్షేమ హాస్టల్ విద్యార్థుల నెలకు రూ.500 చొప్పున సాయం.
ఫలితం : విద్యార్థులకు చిన్నచిన్న ఆర్థిక ఇబ్బందులు తప్పాయి.
పథకం :సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్
ప్రారంభం : 2018
లక్ష్యం : నిరుపేద దళిత విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్ తదితర జాతీయ పోటీ పరీక్షల కోసం తర్ఫీదునివ్వడం.
ఫలితం : ఇప్పటివరకు 645 మంది మెడికల్, 298 మంది నీట్ సీట్లు సాధించారు.
పథకం : అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్
ప్రారంభం : 2015
లక్ష్యం : విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఎస్సీ విద్యార్థులకు గరిష్ఠంగా రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయాన్ని అందివ్వడం.
ఫలితం : ఇప్పటివరకు 1031 మందికి లబ్ధి.
పథకం :స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఆంత్రప్రెన్యూర్స్ (టీఎస్ ప్రైడ్)
ప్రారంభం : 2014
లక్ష్యం : దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం. పరిశ్రమ స్థాపనకు 35 శాతం సబ్సిడీ (గరిష్ఠంగా రూ.75 లక్షలు) అందివ్వడం. ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు 45 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. సేల్స్ టాక్స్ మినహాయింపును 50 నుంచి 100 శాతానికి పెంచారు.
ఫలితం : 1,60, 914 మంది ఔత్సాహిక దళితులు రాయితీలు పొందుతూ వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు.
పథకం : స్కిల్ డెవలప్మెంట్
ప్రారంభం : 2015
లక్ష్యం : జాతీయస్థాయి సంస్థల ఆధ్వర్యంలో దళిత యువతకు డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీతోపాటు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ, నర్సింగ్ తదితర డిమాండ్ ఉన్న రంగాల్లో ఉచిత నైపుణ్య శిక్షణను అందించడం.
ఫలితం : ఇప్పటివరకు 21,653 మంది ఉపాధి శిక్షణ పొందారు. వీరిలో వందలాది మంది ఉద్యోగ అవకాశాలు పొందారు.
పథకం : ఉచిత విద్యుత్
ప్రారంభం : 2015
లక్ష్యం : ఎస్సీ నివాస గృహాలకు 101
యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా.
ఫలితం : 22.23 లక్షల దళిత కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి.
పథకం : గ్రూప్స్ ఫౌండేషన్ కోర్సు
ప్రారంభం : 2014
లక్ష్యం : రాష్ట్ర వ్యాప్తంగా 33 స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసి సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం. పలు పోటీ పరీక్షలకు 45-60 రోజుల స్వల్పకాలిక శిక్షణ ఇవ్వడం.
ఫలితం : 11 వేల మందికి శిక్షణ ఇవ్వగా,1314 మంది ఉద్యోగాలు సాధించారు.
పథకం : అంబేద్కర్ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం
లక్ష్యం : ఎస్సీ కాలనీలు, మండల కేంద్రాలు, మున్సిపాలిటీ, రెవెన్యూ డివిజన్, జిల్లాస్థాయిలో అంబేద్కర్ విగ్రహాలు నెలకొల్పడం. కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం. బంజారాహిల్స్లో బాబూ జగ్జీవన్ రామ్ భవనాన్నీ నిర్మించారు.
ఫలితం : ఇప్పటికే 910 భవనాలు పూర్తయ్యాయి.
పథకం : మినీ డెయిరీ ప్రాజెక్టు
ప్రారంభం : 2020
లక్ష్యం : సబ్సిడీపై డెయిరీ యూనిట్ల మంజూరు.
ఫలితం : దాదాపు 3,000 కుటుంబాలు డెయిరీ యూనిట్లు ఏర్పాటు చేసి లబ్ధి పొందాయి.
పథకం : ప్రత్యేక సంక్షేమ నిధి
ప్రారంభం : 2019
లక్ష్యం : విద్యతోపాటు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో ప్రతిభ చూపే ఎస్సీలకు ఆర్థిక సాయం అందివ్వడం. ఉన్నత విద్యా ప్రవేశాలు పొందిన వారికి రూ.50 వేల నగదు, ల్యాప్ టాప్.
ఫలితం : ప్రతిభావంతులైన నిరుపేద ఎస్సీలకు ఆర్థిక భరోసా లభిస్తున్నది.
పథకం : ప్రత్యేక రిజర్వేషన్లు..
లక్ష్యం : పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే దళితులకు ప్రోత్సాహకాన్ని అందిస్తూ, రాయితీలతోపాటు ప్రత్యేక రిజర్వేషన్లను కల్పించడం.
ఫలితం : ఇండస్ట్రియల్ పార్కుల్లో ఎస్సీలకు 15.44 శాతం కేటాయించడం వల్ల చాలామంది వ్యాపారులుగా ఎదుగుతున్నారు.
పథకం : వెజిటబుల్ పండల్ స్కీమ్
ప్రారంభం : 2018
లక్ష్యం : దళితులను కూరగాయల సాగుకు ప్రోత్సహించడం.
ఫలితం : ఆధునిక సేద్యం దిశగా అడుగులు.
పథకం : దళితబంధు
ప్రారంభం : 2021 ఆగస్టు 4
లక్ష్యం : తరాలుగా నిరుపేదలుగా మిగిలిపోయిన దళితుల దశ మార్చే పథకం ఇది. దళితులు తమకు నచ్చిన వ్యాపారం చేసుకునేలా ఒక్కో కుటుంబానికి ఎలాంటి షరతులు లేకుండా రూ.10 లక్షలు అందివ్వడం. ఆ మొత్తంతో వ్యాపారంలో స్థిరపడేలా ప్రోత్సహించడం.
ఫలితం : కూలీలుగా జీవిస్తున్న 38,323 మంది దళితులు నేడు యజమానులుగా, వ్యాపారవేత్తలుగా మారారు.
పథకం : వ్యవసాయ భూమి అభివృద్ధి
ప్రారంభం : 2018
లక్ష్యం : దళితుల వ్యవసాయ భూములకు సాగునీరు, విద్యుత్ సౌకర్యం.
ఫలితం : సేద్యంలో కష్టాలు తప్పాయి.
పథకం : వివాహ ప్రోత్సాహకం
ప్రారంభం : 2018
లక్ష్యం : కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు రూ.2.50 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందించడం.
ఫలితం : ఆదర్శ వివాహాలు చేసుకున్న 6,317 జంటలకు ఆర్థిక భరోసా లభిస్తున్నది.
పథకం : ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి
ప్రారంభం : 2017
లక్ష్యం : దళితులకు జనాభా దామాషా ప్రకారం రాష్ట్ర బడ్జెట్లో నిధులను కేటాయించి, వారి అభివృద్ధికి ఖర్చు చేయడం.
ఫలితం : ఎస్సీల సంక్షేమానికి భారీగా నిధులు వెచ్చిస్తున్నది. దాదాపు 70వేల కోట్లతో ఎస్సీ కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నది.
పథకం : ప్రీ మెట్రిక్, పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్లు
ప్రారంభం : 2014
లక్ష్యం : దళిత విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఉన్నత విద్య కోర్సుల్లో చేరిన వారికి ఫీజు రీయింబర్స్మెంట్.
ఫలితం : దళిత విద్యార్థుల విద్యా వికాసానికి తోడ్పడుతున్నది.
పథకం : దళిత్ స్టడీ సెంటర్
ప్రారంభం : 2023
లక్ష్యం : దళిత సంస్కృతి, సాహిత్యంపై పరిశోధన చేసే దళిత విద్యార్థులకు శిక్షణ.
ఫలితం : తమదైన సంస్కృతిపై అవగాహన.
పథకం : భూమి కొనుగోలు పథకం
ప్రారంభం : 2014 ఆగస్టు 15
లక్ష్యం : ఎస్సీ కుటుంబాలకు మూడు ఎకరాల భూమి పంపిణీ చేయడం.
ఫలితం : సుమారు రూ.768.94 కోట్లు వెచ్చించి 17,096.31 ఎకరాలను కొనుగోలు చేసి.. 6,995 దళిత కుటుంబాలకు మూడు ఎకరాల చొప్పున పంపిణీ చేసింది.
పథకం : గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా
ప్రారంభం : 2020
లక్ష్యం : గీత కార్మికులు ప్రమాదవశాత్తు మరణించి నప్పుడు అందించే పరిహారాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. పాక్షిక వైకల్యం పొందితే రూ.2 లక్షలు, పూర్తి వైకల్యం పొందితే రూ.5 లక్షల పరిహారం. గీత వృత్తి నిర్వహిస్తూ ప్రమాద వశాత్తు మృతిచెందితే దహన సంస్కారాలకు రూ.25వేలు, గాయపడితే రూ.15వేల తక్షణ సాయాన్ని అందిస్తున్నది.
ఫలితం : 5,526 కుటుంబాలకు లబ్ధి.
పథకం : ఆత్మగౌరవ భవనాల నిర్మాణం
ప్రారంభం : 2018
లక్ష్యం : మొత్తం 44 కులాలకు హైదరాబాద్లో సకల హంగులతో ఆత్మగౌరవ భవనాల నిర్మాణం చేపట్టింది. ఇందులో ఆయా కులాల వారికి వసతి, యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ, సంఘ సమావేశాల నిర్వహణకు వీలు కలుగుతున్నది.
ఫలితం : ఆయా సామాజిక వర్గాలకు వేదికలుగా నిలుస్తున్నాయి.
పథకం : మహాత్మా జ్యోతిబా ఫూలే
వెనకబడిన తరగతుల గురుకుల విద్యాలయ సంస్థ
ప్రారంభం : 2017
లక్ష్యం : బీసీ విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య.
ఫలితం : 1,81,000 మందికి విద్యాఫలాలు
పథకం : న్యాయవాదుల వృత్తి శిక్షణ
ప్రారంభం : 2014
లక్ష్యం : న్యాయవాద వృత్తిలో శిక్షణ పొందుతున్న బీసీ న్యాయవాదులకు నెలకు రూ.వెయ్యి చొప్పున మూడేండ్ల పాటు ఆర్థిక సాయం అందివ్వడం.
ఫలితం : కొత్త తరానికి ఆసరా.
పథకం : ఎకనామిక్ సపోర్ట్ స్కీం
ప్రారంభం : 2015
లక్ష్యం : చిరువ్యాపారులు, నిరుద్యోగ యువతకు
సబ్సిడీ రుణాలు అందివ్వడం.
ఫలితం : దాదాపు 38,356 మందికి సబ్సిడీ
రుణాలు అందాయి.
పథకం : జ్యోతిబా ఫూలే విదేశీ విద్యానిధి పథకం
ప్రారంభం : 2015
లక్ష్యం : నిరుపేద బీసీ విద్యార్థులకు విదేశాల్లో
ఉన్నత చదువుకు రూ.20 లక్షల
ఆర్థిక సాయం అందజేయడం.
ఫలితం : 1985 మందికి సాయం అందింది.
పథకం : గొర్రెల పంపిణీ
ప్రారంభం : 2017 జూన్ 20
లక్ష్యం : గొల్ల, కుర్మలకు ఉపాధి
కోసం గొర్రెలను పంపిణీ చేయడం.
ఫలితం : మొదటి విడతలో 4 లక్షల మంది గొల్ల, కుర్మలకు 82.64 లక్షల
గొర్రెలు అందాయి.
పథకం : చేపల పంపిణీ
ప్రారంభం : 2016 అక్టోబర్ 3
లక్ష్యం : మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడం. ఉపాధిని చూపడం. పెట్టుబడి సమస్య లేకుండా ఆదుకోవడం.
ఫలితం : నాలుగు లక్షలమందికి ఉపాధితోపాటు
ఆదాయమూ పెరిగింది.
పథకం : బీసీ స్టడీ సర్కిళ్లు/ ఎక్సలెన్స్ సెంటర్లు
ప్రారంభం : 2015
లక్ష్యం : వెనకబడిన తరగతులకు చెందిన యువతకు సివిల్స్, గ్రూప్స్, తదితర పోటీ పరీక్షలకు ఉచితంగా
డిజిటల్ తరగతులతో శిక్షణ ఇవ్వడం.
ఫలితం : 52,247 మంది యువత శిక్షణ పొందారు. వీరిలో 22శాతం మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
పథకం : కులాంతర వివాహ ప్రోత్సాహం
ప్రారంభం : 2014
లక్ష్యం : కులాంతర వివాహం చేసుకున్న బీసీలకు రూ.50వేల నగదు ప్రోత్సాహకాన్ని అందివ్వడం.
ఫలితం : వ్యవస్థలో మార్పునకు, కులతత్వ నిర్మూలనకు ఎంతగానో ఉపయోగపడుతున్నది.
పథకం : బీసీ ఫెడరేషన్లు
ప్రారంభం : 2015
లక్ష్యం : ప్రభుత్వం మొత్తంగా 12 బీసీ ఫెడరేషన్లను ఏర్పాటు చేసింది. ఆయా కులాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నది.
ఫలితం : వెనుకబడిన కులాలకు ఇదో వరం.
పథకం : ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు
ప్రారంభం : 2014
లక్ష్యం : హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు.
ఫలితం : 12,700 మందికి ప్రీ మెట్రిక్, 30వేల మందికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు అందాయి. ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఇప్పటివరకూ 3.5 లక్షల మందికి లబ్ధి.
పథకం :నేత కార్మికులకు సాయం
ప్రారంభం : 2017
లక్ష్యం : పవర్లూమ్, చేనేత రంగానికి మరింత ప్రోత్సాహాన్ని అందివ్వడం.
ఫలితం : చేనేత రంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రారంభించిన ఈ పథకం నేతన్నలకు ఓ వరంగా మారింది. ఉపాధి అవకాశాలనిచ్చింది.
పథకం : చేనేత మిత్ర
ప్రారంభం : 2017
లక్ష్యం : నేత కార్మికులకు నూలు, రంగులు, రసాయనాల కొనుగోలుపై 20 శాతం సబ్సిడీ ఇవ్వడం.
ఫలితం : 20, 501 మందికిపైగా లబ్ధి.
పథకం : తెలంగాణ స్టేట్ బ్యాక్వర్డ్ క్లాసెస్
ఎంప్లాయబిలిటీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్
ప్రారంభం : 2014
లక్ష్యం : నిరుద్యోగ బీసీ యువతకు స్వయం ఉపాధి రంగాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వడం.
ఫలితం : 1110 మంది శిక్షణ పొందారు.
పథకం : మెకనైజ్డ్ లాండ్రీ యూనిట్లు
ప్రారంభం : 2018
లక్ష్యం : కాలానికి తగ్గట్టుగా ఆధునిక ధోబీ ఘాట్లను నిర్మించి రజకుల ఆదాయాన్ని పెంపొందించడం.
ఫలితం : ఇప్పటివరకూ 6240 మంది ప్రయోజనం పొందారు.
పథకం : ప్రత్యేక రిజర్వేషన్లు
ప్రారంభం : 2019
లక్ష్యం : గౌడ కులస్తులకు మద్యం దుకాణాల్లో 15 శాతం రిజర్వేషన్లను కల్పించింది. చెరువుల్లో మత్స్యకారులకే హక్కులను ఇచ్చింది. ఎంబీసీలకు గురుకుల ప్రవేశాల్లో 5 శాతం ప్రత్యేక రిజర్వేషన్ అందించింది.
ఫలితం : తరాల వృత్తిని నమ్ముకున్నవారికి వరం.
పథకం : ఉచిత విద్యుత్
ప్రారంభం : 2021, ఏప్రిల్ 1
లక్ష్యం : రాష్ట్రవ్యాప్తంగా నాయీబ్రాహ్మణుల సెలూన్లకు, రజకుల ధోబీఘాట్లకు నెలకు 250 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా అందివ్వడం.
ఫలితం : 1,07,000 మందికి లబ్ధ్ది చేకూరింది.
పథకం : మాడ్రన్ పాటరీ కిట్ల పంపిణీ
ప్రారంభం : 2019
లక్ష్యం : కుమ్మరి/శాలివాహన వృత్తిదారులకు ప్రభుత్వం నవీన నైపుణ్యాలు నేర్పిస్తున్నది. 4వేల కుమ్మరి వృత్తిదారులకు మట్టి గణపతులు, దివ్వెలు, మట్టిగ్లాసులు, జగ్గులు, నీళ్ల బాటిల్స్ తయారీలో శిక్షణ ఇవ్వడంతోపాటు మాడ్రన్ పాటరీ కిట్లను 80 శాతం సబ్సిడీపై అందించడం.
ఫలితం : మట్టిని నమ్ముకున్నవారికి గట్టి మద్దతు లభించింది.
పథకం : బ్యుటీషియన్,
హెయిర్స్టయిలింగ్లో శిక్షణ
ప్రారంభం : 2018
లక్ష్యం : నాయీబ్రాహ్మణ యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ
ఫలితం : 2వేల మంది యువకులు శిక్షణ పొందారు.
పథకం : ఆభరణాల తయారీ శిక్షణ
ప్రారంభం : 2019
లక్ష్యం : విశ్వబ్రాహ్మణ కళాకారులకు నూతన సాంకేతికతను పరిచయం చేస్తూ.. స్టోనింగ్, డై మేకింగ్, వాక్సింగ్ తదితర అంశాల్లో ఆధునిక యంత్రాలపై శిక్షణనివ్వడం. సబ్సిడీపై ఆధునిక యంత్ర పరికరాలను పంపిణీ చేయడం.
ఫలితం : వెయ్యి మందికిపైగా శిక్షణ. యంత్ర పరికరాలూ అందాయి.
పథకం : వర్కర్ టూ ఓనర్ (గ్రూప్ వర్క్ షెడ్)
ప్రారంభం : 2017 అక్టోబర్ 11
లక్ష్యం : ప్రభుత్వమే వర్క్షెడ్లను ఉచితంగా నిర్మించడం. తర్వాత చేనేత కార్మికులకు సబ్సిడీపై ఆధునిక పవర్ లూమ్స్ను అందించడం.
ఫలితం : ఎంతోమంది నేతన్నలు యజమానులు అయ్యారు.
పథకం : వెదురుతో గృహాలంకరణ శిక్షణ
ప్రారంభం : 2019
లక్ష్యం : మేదరి వృత్తిదారులకు వెదురుతో గృహా లంకరణ వస్తువుల తయారీపై శిక్షణ ఇప్పించడం. మొత్తంగా 150 రకాల వస్తువుల తయారీని నేర్పించి వారి నైపుణ్యాలను పెంపొందించడం.
ఫలితం : చారిత్రక నిర్మాణాలు, కార్లు, బస్సుల నమూనాలు, ఫ్లవర్వాజ్లు అలవోకగా తయారు చేస్తున్నారు.
పథకం :నేతన్నకు చేయూత
ప్రారంభం : 2017 జూన్ 24
లక్ష్యం : చేనేత కార్మికులు నెలసరి ఆదాయంలో 8 శాతం వాటా చెల్లిస్తే, ప్రభుత్వం మరో 8 శాతం వాటాను కలిపి బ్యాంకులో జమచేస్తుంది. ఈ మొత్తాన్ని వడ్డీతో చెల్లిస్తుంది.
ఫలితం : 20,537 మంది నేతన్నలకు భరోసా
పథకం : చేనేత బీమా
ప్రారంభం : 2022
లక్ష్యం : రైతు బీమా తరహాలోనే.. మరణించిన చేనేత కార్మికుల కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందివ్వడం.
ఫలితం : 79 కుటుంబాలకు కొండంత అండ లభించింది.
పథకం :: చేనేత కార్మికుల రుణ మాఫీ
ప్రారంభం : 2018 మార్చి 23
లక్ష్యం : చేనేత కార్మికులు సహకార
బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.లక్ష వరకు అప్పును మాఫీ చేసి రుణ విముక్తులను చేయడం.
ఫలితం : 523 సొసైటీల పరిధిలో 38వేల మంది అప్పుల నుంచి బయటపడ్డారు.
పథకం : ఈ- ఆటోరిక్షా
ప్రారంభం : 2021
లక్ష్యం : ఎంబీసీల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 60 శాతం సబ్సిడీతో ఎలక్ట్రిక్ ఆటోలను అందిస్తున్నది.
ఫలితం : మొదటి విడతలో 30మందికి ఎలక్ట్రిక్ ఆటోలను అందించింది.
పథకం : : గురుకుల ఎక్సలెన్స్ సెంటర్లు
ప్రారంభం : 2020
లక్ష్యం : నీట్, జేఈఈ, ఎంసెట్ తదితర పోటీ పరీక్షలు రాసే బీసీ విద్యార్థులకు ఉచిత శిక్షణ అందివ్వడం.
ఫలితం : బీసీ విద్యార్థులు ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ప్రవేశించగలిగారు.
పథకం : తెలంగాణ కళారాధన, జానపద కళల్లో శిక్షణ
ప్రారంభం: 2015 – 2016
లక్ష్యం : తెలంగాణ జానపద కళల ప్రదర్శన, ప్రాచుర్యం.
ఫలితం : మొదటిసారిగా 125 రోజులపాటు వరుసగా తెలంగాణ జానపద కళారూపాలైన చిందు, యక్షగానం, బుర్రకథ, ఒగ్గుకథ తదితర కళారూపాల ప్రదర్శన. జానపద కళారూపాలు, వాయిద్య పరికరాల విషయంలో యువతకు శిక్షణ ఇచ్చి ఆ కళలను పరిరక్షించడం. ఇప్పటివరకు ఒగ్గుడోలు, పేరిణి, కిన్నెర, కోలాం, గుస్సాడి తదితర జానపద కళారూపాలపై యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
పథకం :మ్యూజిక్ వర్క్షాప్
ప్రారంభం : 2018
లక్ష్యం : నాయీబ్రాహ్మణ యువతకు మృదంగం, సన్నాయి తదితర వాద్యాల వాదనలో శిక్షణ ఇవ్వడం.
ఫలితం : ఇప్పటివరకు 60మంది నాయీ బ్రాహ్మణ యువకులు శిక్షణ పొందారు. వాళ్లంతా చక్కని ఉపాధి పొందుతున్నారు.
పథకం :గొర్రెల పెంపకందారులకు బీమా
ప్రారంభం : 2018
పథకం : ప్రమాదవశాత్తు గొర్రెల పెంపకందారులు మృతి చెందితే, వారి కుటుంబానికి రూ.6 లక్షల బీమా చెల్లింపు.
ఫలితం : 58 కుటుంబాలకు రూ.6 లక్షల బీమా అందింది. సంక్షోభ సమయాలలో ఆయా కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటున్నది.
పథకం :గొర్రెల అభివృద్ధి పథకం
ప్రారంభం : 2019 మే 21
లక్ష్యం : సబ్సిడీపై అందజేసిన గొర్రెలకు యూనిట్కు 4 బస్తాలు, మిగతా గొర్రెలకు 75 శాతం తగ్గింపుపై దాణాను అందివ్వడం.
ఫలితం : సగటున 4 లక్షల మందికిపైగా లబ్ధి పొందారు. తరాలుగా అదే వృత్తిని నమ్ముకున్నవారికి ఇదో ఆధారం.
పథకం : సమగ్ర మత్స్య అభివృద్ధి పథకం
ప్రారంభం : 2018 సెప్టెంబర్ 5
నిర్దేశిత లక్ష్యం : మత్స్యకారులకు 75 శాతం సబ్సిడీపై ఉపకరణాలను, వాహనాలను పంపిణీ చేయడం. అధికోత్పత్తి కోసం జలాశ యాల్లో చేపల పెంపకం చేపట్టడం.
ఫలితం : చేపల పెంపకం ఒక లాభదాయకమైన వ్యాపకంగా పేరు తెచ్చుకున్నది.
పథకం :తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు
ప్రారంభం : 2017
లక్ష్యం : 14 కేటగిరీల్లో విశేష సేవలు అందిస్తున్న మహిళలను గుర్తించి అవార్డులు, నగదు పురస్కారాలతో సత్కారం.
ఫలితం : భిన్న రంగాలలోని మహిళలకు గుర్తింపు లభించడమే కాకుండా, ఎందరికో స్ఫూర్తి నింపుతున్నది.
పథకం : సండే సినిమా
ప్రారంభం : 2016
లక్ష్యం : యువ సినీ దర్శకులు, కళాకారులకు ప్రపంచ సినిమాలను పరిచయం చేసి ప్రపంచస్థాయి నిర్మాణ విలువలు, నైపుణ్యాలపై అవగాహన కల్పించడం.
ఫలితం : ఈ కార్యక్రమం ద్వారా ప్రేరణ పొంది ఇప్పటికే ఎంతోమంది యువ దర్శకులు సినీ పరిశ్రమలో తమ సత్తా చాటుతున్నారు.
పథకం : రంజాన్ తోఫా (దావత్ ఎ ఇఫ్తార్)
ప్రారంభం : 2017
లక్ష్యం : రంజాన్ను పురస్కరించుకుని నిరుపేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేయడం.
ఫలితం : ఏటా సగటున 4 లక్షల మందికిపైగా రంజాన్ కానుక అందుతున్నది. మైనారిటీ సోదరులకు ఆత్మీయ కానుక ఇది.
పథకం : ఎకనామిక్ సపోర్ట్ స్కీం
ప్రారంభం : 2015
లక్ష్యం : స్వయం ఉపాధి కోసం మైనారిటీలకు రూ.80వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలను అందివ్వడం.
ఫలితం : ఎంతోమందిలో బతకగలమనే ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది.
పథకం : సీఎం ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీం
ప్రారంభం : 2016
లక్ష్యం : విదేశాల్లో ఉన్నతవిద్యను అభ్యసించాలనుకునే మైనారిటీ యువతకు రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని అందివ్వడం. ఇప్పటివరకు 2,227 మంది మైనారిటీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించారు. వీరిలో చాలామంది పేరెన్నికగన్న సంస్థల్లో ఉద్యోగాలు సాధించారు.
ఫలితం : 2,973 మందికిపైగా ఆర్థిక సహాయం అందింది.
పథకం : గిరిజన మ్యూజియంలు
ప్రారంభం: 2015
లక్ష్యం : గిరిజన తెగల సంస్కృతి పరిరక్షణకు ప్రత్యేకంగా మ్యూజియంల నిర్మాణం.
ఫలితం : అరడజనుకుపైగా గిరిజన మ్యూజియంల ఏర్పాటు.
పథకం : గురుకులాలు
ప్రారంభం : 2016
లక్ష్యం : మైనారిటీల విద్యాభివృద్ధి. ఇప్పటివరకు 204 గురుకులాలను ఏర్పాటు చేయడం.
ఫలితం : 1.31 లక్షల మందికిపైగా మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన, సకల వసతులతో కూడిన విద్య అందుబాటులోకి వచ్చింది.
పథకం : స్టడీ సర్కిళ్లు
ప్రారంభం : 2015
లక్ష్యం : నిరుద్యోగ మైనారిటీ యువతకు వివిధ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.
ఫలితం : వెయ్యి మందికిపైగా మైనారిటీ యువతకు పోటీ పరీక్షల కోసం శిక్షణ అందుతున్నది. ఎంతోమంది ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఆత్మవిశ్వాసంతో తమ కాళ్ల మీద తాము నిలబడుతున్నారు.
పథకం :కుట్టుమిషిన్ల పంపిణీ
ప్రారంభం : 2017
లక్ష్యం : నిరాదరణకు గురైన, విడాకులు పొందిన మహిళలకు, వితంతువులకు, నిరుపేద నారిటీ మహిళలకు స్వయం ఉపాధి కల్పన.
ఫలితం : మొదటివిడతలో వెయ్యి మందికిపైగా కుట్టు మిషిన్ల అందజేత.
పథకం : ఓన్ యువర్ ఆటో స్కీం
ప్రారంభం : 2015
లక్ష్యం : జీహెచ్ఎంసీ పరిధిలో జీవిస్తున్న ముస్లిం ఆటో డ్రైవర్లకు గ్యాస్తో నడిచే ఆటో రిక్షాలను 50శాతం సబ్సిడీపై అందివ్వడం.
ఫలితం : 1741 మంది ఆటో డ్రైవర్లు లబ్ధి పొందారు. యజమానులుగా మారారు.
పథకం : షాదీఖానా
ప్రారంభం : 2018
లక్ష్యం : పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో నిరుపేద ముస్లింల కోసం కమ్యూనిటీ హాళ్లను నిర్మించడం.
ఫలితం : రాష్ట్ర వ్యాప్తంగా 52 చోట్ల ప్రభుత్వం కొత్తగా షాదీఖానాలను నిర్మించింది.
పథకం : షాదీ ముబారక్
ప్రారంభం : 2014 అక్టోబర్ 2
లక్ష్యం : నిరుపేద ముస్లిం యువతుల వివాహానికి రూ.1,00,116 ఆర్థిక సాయం అందించడం.
ఫలితం : 2,55,518 మందికి సాయం అందింది.
పథకం : స్కిల్ డెవలప్మెంట్
ప్రారంభం : 2018
లక్ష్యం : ఉబర్, సెట్విన్ తదితర సంస్థలతో కలిసి మైనారిటీ యువతకు డ్రైవింగ్ శిక్షణతో పాటు సబ్సిడీపై కార్లను అందివ్వడం.
ఫలితం : రాష్ట్ర వ్యాప్తంగా 7వేల మందికి శిక్షణతోపాటు సబ్సిడీపై కార్లను అందించింది. వాళ్లంతా ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో బతుకుతున్నారు.
పథకం : ఫకీర్ కమ్యూనిటీ సభ్యుల పునరావాసం
ప్రారంభం : 2020
లక్ష్యం : గ్రామాలు తిరుగుతూ అగర్బత్తీలు, పూలు విక్రయించే కుటుంబాలకు రవాణా, జీవనోపాధి కోసం మోపెడ్లను అందించడం.
ఫలితం : 100 మంది లబ్ధి పొందారు. పరోక్షంగా ఎంతోమందికి జీవన మార్గం లభిస్తున్నది.
పథకం : ఇమామ్, మౌజంలకు గౌరవ వేతనం
ప్రారంభం : 2015
లక్ష్యం : ఇమామ్లకు రూ.10 వేలు, మౌజంలకు రూ.5 వేలు అందివ్వడం.
ఫలితం : 10 వేల మంది ఇమామ్లు, మౌజంలకు గౌరవ వేతనాలు అందుతున్నాయి. దీనివల్ల ఆర్థిక సమస్యలను అధిగమించి సమాజంలో హుందాగా జీవించగలిగే అవకాశం లభిస్తున్నది.
పథకం : టీఎస్కాప్
ప్రారంభం : 2017
లక్ష్యం : పౌరులకు మెరుగైన సేవలను అందించేందుకు 56 రకాల సర్వీసులతో రాష్ట్రస్థాయిలో టీఎస్కాప్ యాప్ను రూపొందించడం.
ఫలితం : ఎక్కడినుంచైనా సేవలు పొందడంతోపాటు, ఫిర్యాదులు చేసే వెసులుబాటు.
పథకం : డ్రైవర్ ఎంపవర్మెంట్ స్కీం
ప్రారంభం : 2018
లక్ష్యం : ఉబర్, సెట్విన్ తదితర సంస్థలతో కలిసి క్రైస్తవ మైనారిటీ యువతకు డ్రైవింగ్ శిక్షణతోపాటు సబ్సిడీపై కార్లను అందివ్వడం.
ఫలితం : 941 మంది క్రైస్తవ మైనారిటీ యువతకు డ్రైవింగ్ శిక్షణతోపాటు సబ్సిడీపై కార్లను అందించింది.
పథకం : ఇస్త్రీ పెట్టెల పంపిణీ
ప్రారంభం : 2020
లక్ష్యం : మైనారిటీ వర్గాల్లోని ధోబీలకు మెరుగైన జీవనోపాధి కోసం ఇస్త్రీ పెట్టెలు పంపిణీ చేయడం.
ఫలితం : 100 మంది మైనారిటీ ధోబీలకు ఇస్త్రీ పెట్టెలు పంపిణీ చేసింది.
పథకం : క్రిస్మస్ గిఫ్ట్ప్యాక్లు
ప్రారంభం : 2015
లక్ష్యం : క్రిస్మన్ సందర్భంగా నిరుపేద క్రైస్తవులకు దుస్తులను, గిఫ్ట్ ప్యాక్లను అందివ్వడం.
ఫలితం : ప్రతి క్రిస్మస్కు 2.18 లక్షల మందికిపైగా క్రైస్తవులకు దుస్తులు, గిఫ్ట్ ప్యాక్లను ప్రభుత్వం అందిస్తున్నది.
పథకం : జెరూసలేం యాత్రకు ఆర్థిక సాయం
ప్రారంభం : 2017
లక్ష్యం : క్రీస్తు జన్మస్థలం పవిత్ర జెరూసలేం యాత్రకు రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందివ్వడం.
ఫలితం : నిరుపేద క్రైస్తవుల కల నెరవేరుతున్నది.
పథకం : మైనారిటీ లా గ్రాడ్యుయేట్లకు ఆర్థిక సాయం
ప్రారంభం : 2017
లక్ష్యం : న్యాయవిద్య పూర్తిచేసి ప్రాక్టీస్లో ఉన్న మైనారిటీ యువతకు ఏటా రూ.20 వేల చొప్పున మూడేండ్ల పాటు రూ.60వేల నగదు ప్రోత్సాహకం.
ఫలితం : న్యాయవాద వృత్తిలో స్థిరపడే అవకాశం.
పథకం : అవార్డుల ప్రదానం
ప్రారంభం : 2017
లక్ష్యం : వివిధ సామాజిక సేవా రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న క్రైస్తవులు, మిషనరీలను గుర్తించి పురస్కారాలు ఇచ్చి ప్రోత్సహించడం.
ఫలితం : సేవా తత్పరులకు బాసట.
పథకం : వికలాంగులకు స్వతంత్ర శాఖ
ప్రారంభం : 2022 డిసెంబర్ 3
లక్ష్యం : మహిళా, శిశు సంక్షేమ శాఖ నుంచి దివ్యాంగుల సంక్షేమ శాఖను వేరుచేసి దివ్యాంగుల కోసం ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ.
ఫలితం : వివిధ పథకాలపై ప్రత్యేక శ్రద్ధ
పథకం : అత్యాధునిక ఉపకరణాల పంపిణీ
ప్రారంభం : 2016
లక్ష్యం : దివ్యాంగులకు చేతికర్రలు, మూడుచక్రాల సైకిళ్లు, బ్యాటరీ ట్రైసైకిళ్లు, బ్యాటరీ వీల్చైర్లు, వినికిడి యంత్రాలు, విద్యార్థులకు ఎన్వీడీఏ జాస్ వంటి ప్రత్యేక సాఫ్ట్వేర్లతో కూడిన ల్యాప్టాప్లు, 4జీ స్మార్ట్ఫోన్లు ఉచితంగా అందివ్వడం.
ఫలితం : 42,417 వేల మందికి లబ్ధి.
పథకం : ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్
ఉపకార వేతనాలు
లక్ష్యం : చట్టాన్ని అనుసరించి దివ్యాంగ విద్యార్థులకు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలను.. సాధారణ విద్యార్థులతో పోల్చితే 25 శాతం అదనంగా అందజేయడం.
ఫలితం : 8752 మందికి ప్రీ మెట్రిక్, 1704 మందికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు అందాయి.
పథకం : ఆసరా పింఛన్లు
ప్రారంభం : 2014 నవంబర్ 8
లక్ష్యం : దివ్యాంగులకు రూ.3,016 పింఛన్.
ఫలితం : 5,16,727 మందికి పింఛన్లు అందుతున్నాయి.
పథకం : ఆర్థిక పునరావాస పథకం
లక్ష్యం : వికలాంగులకు స్వయం ఉపాధి కోసం రుణాలు అందివ్వడం. గతంలో రుణ పరిమితి గరిష్ఠంగా రూ.50 వేలు ఉండేది. తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల వరకు సబ్సిడీ రుణాలను అందజేస్తున్నది.
ఫలితం : 4,394 మందికి రుణాలు అందాయి.
పథకం : వివాహ ప్రోత్సాహక బహుమతి
ప్రారంభం : 2018
లక్ష్యం : దివ్యాంగులను పెండ్లి చేసుకున్నట్లయితే రూ.లక్ష ప్రోత్సాహక బహుమతిని అందించి ఆర్థిక భరోసాను కల్పించడం.
ఫలితం : 5598 దివ్యాంగ జంటలకు ప్రోత్సాహకం.
పథకం : నైపుణ్యాల పెంపు
ప్రారంభం : 2016
లక్ష్యం : దివ్యాంగ నిరుద్యోగ యువతకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా కంప్యూటర్ వినియోగంపై ఉచిత శిక్షణ ఇవ్వడం, ఉపాధి కల్పించడం.
ఫలితం : పరిమితులను అధిగమించి తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు.
పథకం : ప్రత్యేక రిజర్వేషన్లు
ప్రారంభం : 2016
లక్ష్యం : దివ్యాంగులకు ఆర్థిక, అభివృద్ధి సంక్షేమ పథకాల్లో ఉన్న రిజర్వేషన్ను 3 నుంచి 5 శాతానికి పెంచింది. కల్యాణలక్ష్మి/ షాదీముబారక్ పథకం కింద అందించే మొత్తానికి 25 శాతం అధికం.
ఫలితం : ఈ రిజర్వేషన్లు మనోబలాన్ని పెంచాయి
పథకం : ఉచిత హాస్టల్ వసతి
ప్రారంభం : 2014
లక్ష్యం : బధిరులు, అంధులు, దివ్యాంగులైన విద్యార్థులకు ఉచిత హాస్టల్ వసతితో విద్యను అందివ్వడం.
ఫలితం : సగటున ప్రతి సంవత్సరం 800 మందికిపైగా హాస్టల్ వసతితోపాటు విద్యను అందిస్తున్నది.
పథకం : కార్పస్ ఫండ్ ఏర్పాటు
ప్రారంభం : 2019
లక్ష్యం : రాష్ట్ర ప్రభుత్వ పథకాల పరిధిలోకి రాని కార్యక్రమాలకు ఆర్థిక సాయం కోసం ప్రత్యేక గ్రాంటును కేటాయించడం.
ఫలితం : అనేక మందికి ధైర్యాన్నిచ్చింది.
పథకం : పోటీ పరీక్షలకు శిక్షణ
ప్రారంభం : 2022
లక్ష్యం : పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న దివ్యాంగులకు ఉచిత శిక్షణ ఇవ్వడం. అభ్యర్థులకు ట్యూషన్ ఫీజ్ కింద రూ.7వేల నుంచి రూ.20 వేల వరకు ఇస్తున్నది. దీంతోపాటు స్టడీ మెటీరియల్ కోసం రూ.1,000, ఇతర ఖర్చులకు రూ.2,000 చొప్పున మూడునెలల పాటు ఆర్థిక సాయం అందిస్తున్నది.
ఫలితం : 500 మందికి లబ్ధి.
పథకం : హెల్ప్లైన్ 155326
ప్రారంభం : 2020
లక్ష్యం : దివ్యాంగులకు ఆరోగ్యం, విద్య, న్యాయ సాయం, పెన్షన్, జీవనోపాధితోపాటు అన్నిరకాలుగా సాయం అందివ్వడం.
ఫలితం : ఇప్పటి వరకూ లక్ష ఫోన్కాల్స్ వచ్చాయి. అధికారులు అంతే సత్వరంగా స్పందించారు.
పథకం : దివ్యాంగుల వెబ్సైట్
ప్రారంభం : 2022
నిర్దేశిత : ఇంటినుంచే దివ్యాంగులు ఫిర్యాదులు చేయడం, సేవలను పొందడం కోసం www.wdsc.telangana.gov.in వెబ్సైట్ ఏర్పాటుచేశారు. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఫలితం : దివ్యాంగులు సత్వర సేవలు పొందుతున్నారు.
పథకం : చేయూత వాహనాలు
ప్రారంభం : 2022 డిసెంబర్ 3
నిర్దేశిత లక్ష్యం : దివ్యాంగులకు మరింత వేగవంతమైన సేవలను ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ పరిధిలో తొలిదఫాగా 8 చేయూత వాహనాల ఏర్పాటు.
ఫలితం : దివ్యాంగులకు తక్షణ భరోసా అందుతున్నది.
పథకం : ట్రైనింగ్ కమ్ ప్రొడక్షన్ సెంటర్లు (టీసీపీసీ)
లక్ష్యం : ఆధునిక కాలానికి అనుగుణంగా టీసీపీసీలను తీర్చేదిద్దడం. దివ్యాంగులకు కావాల్సిన వీల్చైర్లు, ట్రై సైకిళ్లు, చేతికర్రలు, ట్రేడ్ ట్రైసైకిళ్లు, కృత్రిమ అవయవాల ఉత్పత్తి చేయించడం.
ఫలితం : ఆత్మవిశ్వాసం పెంపొందుతున్నది.
పథకం : బ్రెయిలీ లిపిలో స్టడీ మెటీరియల్
ప్రారంభం : 2019
లక్ష్యం : బ్రెయిలీలో విద్యార్థులకు అకాడమీ పుస్తకాలు, పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ అందివ్వడం. దీనికోసం రూ.80 లక్షలతో ప్రింటింగ్ మెషినరీ.
ఫలితం : సాధారణ విద్యార్థులతో పోటీపడే ఆత్మవిశ్వాసం ఏర్పడుతున్నది.
పథకం : దివ్యాంగులకు ప్రత్యేక రిజర్వేషన్
ప్రారంభం : 2015
లక్ష్యం : వివిధ ప్రభుత్వ పథకాల్లో దివ్యాంగులకు 5శాతం రిజర్వేషన్ కల్పించడం. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో 4శాతం రిజర్వేషన్ కల్పించడం.
ఫలితం : ఒక దళిత బంధు ద్వారానే 371మందికి పైగా దివ్యంగులు లబ్ధి పొందారు. డబుల్ బెడ్రూం ఇండ్లలోనూ రిజర్వేషన్ అమలు చేస్తున్నారు.
పథకం : క్రాప్ కాలనీలు
ప్రారంభం : 2018
లక్ష్యం : రాష్ట్ర ప్రజలకు అవసరమైన కూరగాయలు అందించడం.
ఫలితం : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రయోగాత్మకంగా క్రాప్ కాలనీ ఏర్పాటు. 2,780 మంది రైతులకు, తద్వారా 38 గ్రామాల ప్రజలకు లబ్ధి.
పథకం : దివ్యాంగుల మెడికల్ బోర్డుల ఏర్పాటు
ప్రారంభం : 2018
లక్ష్యం : 21 రకాల వైకల్యాలను ధ్రువీకరించి, పత్రాలను అందజేసేందుకు వేర్వేరుగా రాష్ట్రస్థాయిలో మెడికల్ బోర్డులను ఏర్పాటు చేయడం.
ఫలితం : దివ్యాంగులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తప్పింది.
పథకం : దివ్యాంగులకు రవాణా భత్యం
ప్రారంభం : 2021
లక్ష్యం : దివ్యాంగ ఉద్యోగులకు మూలవేతనంపై అదనంగా 10 శాతాన్ని రవాణా భత్యంగా (గరిష్ఠంగా రూ.2,000) చెల్లించడం.
ఫలితం : దివ్యాంగులకు ఆర్థిక చేయూత
పథకం : మరుగుజ్జులకు బస్పాస్
ప్రారంభం : 2019 ఫిబ్రవరి 4
లక్ష్యం : మరుగుజ్జులకు పల్లెవెలుగు, డీలక్స్, హైదరాబాద్ లోకల్ బస్సుల్లో 50 శాతం సబ్సిడీపై ప్రయాణ అవకాశం.
ఫలితం : మరుగుజ్జులు జన జీవనంలో భాగం అవుతున్నారు.
పథకం : ఆసరా పెన్షన్
ప్రారంభం : 2014 నవంబర్ 8
లక్ష్యం : 57 ఏండ్లు, అంతకు పైబడిన వృద్ధులకు నెలకు రూ.2016 పింఛన్ అందించడం.
ఫలితం : 16,38,089 మందికి పింఛన్లు అందుతున్నాయి.
పథకం : హెల్ప్లైన్ 14567
ప్రారంభం : 2019
లక్ష్యం : వయోవృద్ధుల కోసం ఆరోగ్యం, విద్య, న్యాయ సాయం, పింఛన్, జీవనోపాధితోపాటు అన్నివిధాలుగా సహకారం అందివ్వడం.
ఫలితం : సగటున రోజుకు వంద మందికిపైగా సేవలు అందుతున్నాయి. ఇప్పటివరకూ 1.5 లక్షల ఫోన్ కాల్స్ వచ్చాయి.
పథకం : వయోధికులకు వెబ్సైట్
ప్రారంభం : 2022
లక్ష్యం : వయోవృద్ధుల సేవల కోసం www.tsseniorcitizens.cgg.gov.in వెబ్సైట్ ఏర్పాటు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో అందుబాటులో ఉంది.
ఫలితం : వయోధికులకు సత్వర సేవలు లభిస్తున్నాయి.
పథకం : చేయూత వాహనాలు
ప్రారంభం : 2022
లక్ష్యం : నిరాదరణకు గురవుతున్న వయోవృద్ధులను చేరదీసి ఆశ్రమాలకు, వైద్యశాలకు తరలించేందుకు వీలుగా ప్రత్యేకంగా చేయూత వాహనాల ఏర్పాటు.
ఫలితం : వయోవృద్ధులకు ప్రభుత్వం నుంచి ఎంతో ఆసరా లభిస్తున్నది.
పథకం : వృద్ధులకు మొబైల్ మెడికల్ సర్వీసెస్, వృద్ధాశ్రమాల ఏర్పాటు.
ప్రారంభం : 2023
లక్ష్యం : వృద్ధుల కోసం మొబైల్ మెడికల్ వాహన సేవలను అందుబాటులోకి తేవడం. జిల్లాకు ఒకటి చొప్పున ఉచిత వసతి కల్పిస్తూ వృద్ధాశ్రమం ఏర్పాటు చేయడం.
ఫలితం : మొబైల్ మెడికల్ వాహన సేవలో భాగంగా ఇప్పటికే 8 వాహనాలను సిద్ధం చేసింది.
పథకం : ట్రాన్స్జెండర్స్ వెల్ఫేర్ బోర్డు
ప్రారంభం : 2022
లక్ష్యం : లింగమార్పిడి వ్యక్తుల సంక్షేమం కోసం కార్యక్రమాల రూపకల్పన, అమలు.
ఫలితం : ట్రాన్స్జెండర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.2 కోట్ల నిధులు కేటాయించింది.
పథకం : గుర్తింపు కార్డులు
ప్రారంభం : 2020
లక్ష్యం : లింగమార్పిడి వ్యక్తులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయడం.
ఫలితం : ప్రతి జిల్లాలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తూ.. ఇప్పటివరకూ వెయ్యి మందికిపైగా గుర్తింపు కార్డులు జారీ చేసింది.
పథకం : ఎకనామిక్ సపోర్ట్ స్కీం
ప్రారంభం : 2020
లక్ష్యం : స్వయం ఉపాధి కోసం లింగమార్పిడి వ్యక్తులకు రుణాలు ఇవ్వడం.
ఫలితం : సామాజిక హోదా లభిస్తున్నది.
పథకం : జ్యూట్ బ్యాగుల తయారీ శిక్షణ కేంద్రం
ప్రారంభం : 2022
లక్ష్యం : లింగమార్పిడి వ్యక్తులకు జ్యూట్ బ్యాగుల తయారీలో ఉచిత శిక్షణతోపాటు ఏడాదిపాటు కనీస వేతనంతో ఉపాధి కల్పించడం.
ఫలితం : ఇప్పటివరకూ 45 మందికి శిక్షణ అందింది.
పథకం : ట్రాన్స్ ఉత్సవ్
ప్రారంభం : 2023
లక్ష్యం : లింగమార్పిడి వ్యక్తుల హక్కులు, చట్టాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం. అంతర్జాతీయ లింగమార్పిడి వ్యక్తుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏటా మార్చి31న వేడుకలను నిర్వహించడం.
ఫలితం : ఆత్మవిశ్వాసం పెంపొందుతున్నది.
పథకం : మన ఊరు మన పాడి ప్రణాళిక
ప్రారంభం : 2014
లక్ష్యం : పాడి సహకార సంఘాలకు రుణాలు ఇవ్వడం. పాడి పరిశ్రమను పెంచడం.
ఫలితం : 38 వేల మందికి రుణాలు అందించింది.
పథకం : రైతులకు వడ్డీలేని రుణాలు
ప్రారంభం : 2015
లక్ష్యం : రైతులకు వడ్డీ లేకుండా రుణాలు అందజేయడం.
ఫలితం : ఇప్పటివరకు ప్రభుత్వం రూ.87,591 కోట్ల రుణాలను రైతులకు అందించింది. 27.82 లక్షల మంది ప్రయోజనాన్ని పొందారు.
పథకం : పంట రుణమాఫీ
ప్రారంభం : 2014
లక్ష్యం : లక్ష వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేయడం.
ఫలితం : తొలి విడత 35.32 లక్షల మంది రైతులు రుణ విముక్తులయ్యారు. రెండో విడతలో ఇప్పటి వరకూ 2.96 లక్షల మంది ప్రయోజనాన్ని పొందారు.
పథకం : ఫామ్ మెకనైజేషన్
ప్రారంభం : 2015
లక్ష్యం : కూలీల కొరతను నివారించేందుకు వ్యవసాయం యాంత్రీకరణను ప్రోత్సహించడం.
ఫలితం : ఇప్పటి వరకు ప్రభుత్వం 6.71 లక్షల ట్రాక్టర్లు, కోత యంత్రాలు, ఇతర పరికరాలను పంపిణీ చేసింది.
పథకం : మైక్రో ఇరిగేషన్
ప్రారంభం : 2014
లక్ష్యం : సమగ్ర సాగునీటి యాజమాన్య పద్ధతులు అమలు చేయడం.
ఫలితం : 20.32 లక్షల ఎకరాలకు సాగునీరు అందింది.
పథకం : రైతు బంధు సమితి
ప్రారంభం : 2018
లక్ష్యం : రైతులను సంఘటిత పరచడం.
ఫలితం : రాష్ట్రంలోని పదివేల ఏడువందల అరవై తొమ్మిది గ్రామాలలో ఏర్పాటైన రైతు బంధు సమితులలో లక్ష అరవై ఒక్కవేల తొమ్మిది వందల తొంభై అయిదు మంది సభ్యులుగా కొనసాగుతున్నారు.
పథకం : తెలంగాణ ఆయిల్ పామ్ స్కీం
ప్రారంభం : 2020
లక్ష్యం : నూనె పంటల సాగు విస్తీర్ణం పెంచడం.
ఫలితం : నూనె పంటల విస్తీర్ణం అదనంగా 26,376 ఎకరాలు పెరిగింది. మొత్తంగా 68,440 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు కొనసాగుతున్నది.
పథకం : గోదాముల నిర్మాణం
ప్రారంభం : 2017
లక్ష్యం : రైతులు తమ పంట ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు వీలుగా గోదాముల నిర్మాణం.
ఫలితం : గోదాముల్లో నిల్వ సామర్థ్యం 9.9 లక్షల టన్నుల నుంచి 31.9 లక్షల టన్నులకు పెరిగింది.
పథకం : పాడి రైతులకు ప్రోత్సాహం
ప్రారంభం : 2014
లక్ష్యం : లీటర్ పాలకు ఇచ్చే ప్రోత్సాహకం రూ.4 పెంచడం.
ఫలితం : 29.78 లక్షల మంది పాడిరైతులకు లబ్ధి.
పథకం : పంటల కొనుగోలు
ప్రారంభం : 2014
లక్ష్యం : రైతులు నష్టపోకుండా ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, మద్దతు ధరకు పంటలను కొనుగోలు చేయడం.
ఫలితం : రాష్ట్రవ్యాప్తంగా 1479 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు. గతేడాది ఏకంగా రూ. 4,132.23 కోట్ల విలువైన 20.19 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం విశేషం.
పథకం : సంచార వైద్యశాలలు
ప్రారంభం : 2017
లక్ష్యం : గ్రామగ్రామానికి వెళ్లి పశువులకు వైద్యసేవలను అందించడం.
ఫలితం : 29 లక్షల పశువులకు వైద్యం అందింది.
పథకం : ధరణి పోర్టల్
ప్రారంభం : 2020
లక్ష్యం : ఇష్టారాజ్యంగా భూ రికార్డులు మార్చే సంస్కృతికి చెక్ పెట్టడం.
ఫలితం : ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత
కేవలం అరగంటలోనే రిజిస్ట్రేషన్, నిమిషాల వ్యవధిలోనే మ్యుటేషన్
పూర్తవుతున్నది.
పథకం : ఇంకుడుగుంతల నిర్మాణం
ప్రారంభం : 2014
లక్ష్యం : వర్షపు నీటి సంరక్షణ.
ఫలితం : 11,73,496 వ్యక్తిగత, 34వేల సామాజిక ఇంకుడుగుంతల నిర్మాణం పూర్తయ్యింది.
పథకం : మత్స్యకారులకు బీమా
ప్రారంభం : 2016-17
లక్ష్యం : రూ.6 లక్షల బీమాతో మత్స్యకారులకు ధీమా కల్పించడం.
ఫలితం : 840 మంది మత్స్యకార కుటుంబాలకు బీమా ధీమా దక్కింది.
పథకం : రైతుబీమా
ప్రారంభం : 2018
లక్ష్యం : రైతు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడ కుండా ఉండేందుకు రూ.5లక్షల బీమా అందివ్వడం.
ఫలితం : 1,00,372 కుటుంబాలకు లబ్ధి.
పథకం : రైతుబంధు
ప్రారంభం : 2018
లక్ష్యం : పంట పెట్టుబడి కింద ఏటా ఎకరానికి రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందివ్వడం.
ఫలితం : ఏటా 65లక్షల మందికిపైగా
రైతులకు లబ్ధి. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో ఏకంగా రూ.65 వేల కోట్లు జమ.
పథకం : చేనేత సంఘాలకు
పావలా వడ్డీకి రుణాలు
ప్రారంభం : 2014
లక్ష్యం : చేనేత కార్మికులు అధిక వడ్డీ అప్పుల్లో కూరుకుపోకుండా పావలావడ్డీకి రుణాలు ఇవ్వడం.
ఫలితం : 928 సంఘాలకు లబ్ధి.
పథకం : బోదకాలు పింఛన్లు
ప్రారంభం : 2016
లక్ష్యం : బోదకాలు బాధితులకు రూ.2,016 ఆర్థిక సాయం అందించడం.
ఫలితం : రాష్ట్రవ్యాప్తంగా సుమారు
18,633 మందికి పింఛన్ మంజూరు.
పథకం :24 గంటల ఉచిత విద్యుత్
ప్రారంభం : 2018 జనవరి 1
లక్ష్యం : వ్యవసాయానికి 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ ఉచితంగా అందివ్వడం.
ఫలితం : రాష్ట్రవ్యాప్తంగా 26.22 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ అందుతున్నది.
పథకం :నేత కార్మికులకు పింఛన్లు
ప్రారంభం : 2014
లక్ష్యం : చేనేత కార్మికులకు ఆర్థికంగా ఆసరాగా నిలవడం.
ఫలితం : 38,219 మంది నేత కార్మికులు ప్రతి నెలా రూ.2,016 పింఛన్ అందుకుంటున్నారు.
పథకం : గీత కార్మికులకు పింఛన్లు
ప్రారంభం : 2014
లక్ష్యం : కులవృత్తిని నమ్ముకున్న గీత కార్మికులకు సహకారం అందివ్వడం.
ఫలితం : 67,034 మంది గీత కార్మికులు నెలనెలా రూ.2,016 ఆసరా పింఛన్ అందుకుంటున్నారు.
పథకం : డయాలసిస్ బాధితులకు పింఛన్లు
ప్రారంభం : 2014
లక్ష్యం : మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు ఆర్థిక భరోసా కల్పించడం.
ఫలితం : కిడ్నీ వ్యాధిగ్రస్తులు 4,657 మందికి ప్రతి నెలా రూ. 2,016 పెన్షన్ అందుతున్నది.
పథకం : ఎయిడ్స్ బాధితులకు పింఛన్లు
ప్రారంభం : 2014
లక్ష్యం : ఎయిడ్స్ బాధితులకు ఆర్థిక దన్ను.
ఫలితం : 37,645 మంది ఎయిడ్స్ పేషెంట్లు రూ.2,016 పెన్షన్ అందుకుంటున్నారు.
పథకం : వృద్ధ కళాకారులకు పింఛన్లు
ప్రారంభం : 2014
లక్ష్యం : వృద్ధ కళాకారులకు చేయూత.
ఫలితం : 1,967 మంది కళాకారులు ప్రతి నెలా రూ.2,016 పింఛన్ అందుకుంటున్నారు.
పథకం : ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్
ప్రారంభం : 2017
లక్ష్యం : ఆర్థిక సమస్యలలో చిక్కుకున్న సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు సహకారం అందించి, ఉత్పత్తి సేవలను విస్తరించేలా చేయడం.
ఫలితం : సుమారు 334 చిన్న తరహా పరిశ్రమల పునరుద్ధరణ జరిగింది.
పథకం : టీఎస్ గ్లోబలింకర్ (ఆన్లైన్ మాల్.. మేడిన్ తెలంగాణ)
ప్రారంభం : 2019
లక్ష్యం : రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులతో అనుసంధానించే డిజిటల్ ప్లాట్ఫాం.
ఫలితం : 7 వేలకుపైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు లబ్ధి.
పథకం : టీఎస్ఐపాస్
ప్రారంభం : 2014
లక్ష్యం : పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేయడం.
ఫలితం : తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్తగా 22,110 పరిశ్రమలు స్థాపించారు. తద్వారా రూ.2.53 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 17.26 లక్షల మందికి ఉపాధి లభించింది.
పథకం : తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్
ప్రారంభం : 2014
లక్ష్యం : తెలంగాణ పారిశ్రామిక ఉత్పత్తుల ప్రచారం, ప్రదర్శనకు జాతీయ, అంతర్జాతీయ ఎగ్జిబిషన్లను నిర్వహించడం.
ఫలితం : తెలంగాణ ఉత్పత్తులకు గుర్తింపు
పథకం :టాస్క్ (తెలంగాణ అకాడమీ
ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్)
ప్రారంభం : 2014
లక్ష్యం : యువతకు పారిశ్రామిక నైపుణ్య శిక్షణ.
ఫలితం : సుమారు 7.10 లక్షల మంది యువతకు లబ్ధి.
పథకం : టీ హబ్, టీహబ్ 2.0
ప్రారంభం : 2015
లక్ష్యం : వినూత్న ఆవిష్కరణలకు వేదిక, ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు నిధుల సమీకరణ.
ఫలితం : రూ.1,860 కోట్ల నిధులను సమకూర్చడంతోపాటు, 240 స్టార్టప్లకు నిధులు కేటాయించింది. సుమారు 12 వేల ఉద్యోగాల సృష్టి.
పథకం : గోల్కొండ హ్యాండిక్రాఫ్ట్స్
ప్రారంభం : 2015
లక్ష్యం : తెలంగాణ చేతివృత్తులకు మార్కెటింగ్ సౌకర్యంతోపాటు ప్రచారం కల్పించడం.
ఫలితం : ఇప్పటివరకు 3,520 లక్షల కళారూపాల అమ్మకాలను కొనసాగించింది.
పథకం : తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్
సెల్ (టీఎస్ఐసీ)
ప్రారంభం : 2017
లక్ష్యం : పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లో సాంకేతిక సృజనాత్మకతను పెంపొందించడం.
ఫలితం : సరికొత్త సాంకేతికత ఆధారంగా వివిధ సమస్యలకు పరిష్కారాలను చూపే 100 స్టార్టప్ల ప్రారంభం.
పథకం : స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
ప్రారంభం : 2017
లక్ష్యం : హైదరాబాద్ మినహా తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల(టీఎస్ఎఫ్పీ జెడ్)ను ఏర్పాటు చేస్తున్నది. అందు కోసం జిల్లాలవారీగా 10వేల ఎకరా ల పైచిలుకు స్థలాలు గుర్తించారు.
ఫలితం : 2140 పరిశ్రమల స్థాపన జరిగింది. తద్వారా 29,841 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి.
పథకం :తొలిమెట్టు
ప్రారంభం : 2022
లక్ష్యం : 1-5 తరగతి విద్యార్థులకు
గణితంలో శిక్షణ.
ఫలితం : విద్యార్థుల ప్రతిభ మెరుగుపడింది.
పథకం : సన్నబియ్యం భోజనం
ప్రారంభం : 2015
లక్ష్యం : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాల విద్యార్థులకు సన్నబియ్యంతో కడుపునిండా భోజనం.
ఫలితం : పాఠశాలల్లో సగటున ఏటా 28లక్షల మంది, హాస్టళ్లలో 7 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి.
పథకం : పుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీ
ప్రారంభం : 2016
లక్ష్యం : ఇంటర్ వరకు చదువుతున్న గురుకుల విద్యార్థులకు ఉచితంగా దుస్తులు, పాఠ్యపుస్తకాల పంపిణీ .
ఫలితం : 26వేలకుపైగా ప్రభుత్వ పాఠశాలలు, వెయ్యికిపైగా గురుకులాల్లో చదివే ప్రతి విద్యార్థికీ లబ్ధి చేకూరుతున్నది.
పథకం :మన ఊరు -మన బడి
ప్రారంభం : 2022
లక్ష్యం : 26,065 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, ప్రమాణాల పెంపు, సుందరీకరణ
ఫలితం : మొదటి విడతలో ఇప్పటికే 9,123 స్కూళ్లలో పనులు ప్రారంభం.
పథకం :రామానుజ ఫీజు రీయింబర్స్మెంట్, వేదహిత
ప్రారంభం : 2018
లక్ష్యం : నిరుపేద బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్. వేదహిత పథకంలో భాగంగా వేద పాఠశాలలకు రూ.2 లక్షల ఆర్థికసాయం
ఫలితం : నిరుపేద బ్రాహ్మణలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నది.
పథకం : సబ్సిడీపై వ్యవసాయ పరికరాల పంపిణీ
ప్రారంభం : 2014
లక్ష్యం : రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులను పరిచయం చేయడం.
ఫలితం : వీటి సాయంతో ఎంతోమంది రైతులు దిగుబడి పెంచుకుంటున్నారు.
పథకం : వేద విద్యార్థులకు ప్రోత్సాహకం
ప్రారంభం : 2018
లక్ష్యం : వేదవిద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు నెలకు రూ.250 ఉపకార వేతనం, స్మార్తం పూర్తి చేస్తే 3 లక్షలు, ఆగమం పూర్తి చేస్తే రూ.5 లక్షల ఆర్థిక సాయం.
ఫలితం : వేదవిద్యను అభ్యసించేవారికి ఉత్సాహాన్ని కలిగించే నిర్ణయం.
పథకం : వేద పండితులకు గౌరవ భృతి
ప్రారంభం : 2018
లక్ష్యం : 75ఏళ్లు పైబడిన వేద పండితులకు 2,500 గౌరవ భృతి
ఫలితం : వేద పండితులు సమాజంలో గౌరవంగా బతకడానికి అవసరమైన ఆర్థిక వనరు అందుతున్నది.
పథకం : వివేకానంద ఓవర్సీస్ స్కాలర్షిప్
ప్రారంభం : 2018
లక్ష్యం : విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే నిరుపేద బ్రాహ్మణ విద్యార్థులకు రూ.20 లక్షల ఆర్థిక సాయం.
ఫలితం : 780 మంది బ్రాహ్మణ విద్యార్థులకు లబ్ధి.
పథకం : బెస్ట్ (బ్రాహ్మణ్ ఆంత్రపెన్యూర్షిప్ స్కీమ్ ఆఫ్ తెలంగాణ)
ప్రారంభం : 2018
లక్ష్యం : ఔత్సాహిక బ్రాహ్మణ పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ రుణాలు.
ఫలితం : 3,567 మందికి లబ్ధి.
పథకం : ఉద్యోగార్థులకు శిక్షణకు ఆర్థిక సాయం
ప్రారంభం : 2022
లక్ష్యం : బ్రాహ్మణ నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 50 సెంటర్లలో కోచింగ్ తీసుకునేందుకు ఆర్థిక సాయం.
ఫలితం : నిరుద్యోగులకు ఆసరా
పథకం : స్ట్రీట్ వెండింగ్ జోన్లు
ప్రారంభం : 2018
నిర్దేశిత లక్ష్యం : వీధి వ్యాపారాల నిర్వహణకు ప్రత్యేకంగా జోన్లు ఏర్పాటుచేయడం.
ఫలితం : రాష్ట్రవ్యాప్తంగా 618 జోన్లు ఏర్పాటు
పథకం : సీఎంఆర్ఎఫ్ (సీఎం రిలీఫ్ ఫండ్)
ప్రారంభం : 2014
లక్ష్యం : ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేదల వైద్యానికి, ఇతర అవసరాలకు ఆర్థిక సాయం అందించడం.
ఫలితం : లక్షలాది నిరుపేదలకు వైద్య చికిత్సల కోసం లబ్ధి చేకూరుతున్నది.
పథకం : పరమపద వాహనాలు
ప్రారంభం : 2020
లక్ష్యం : పేదలకు ఆర్థిక భారం లేకుండా చూడటం.
ఫలితం : ఆరువేలకు పైగా మృతదేహాల తరలింపు.
పథకం : సద్దిమూట
ప్రారంభం : 2014
లక్ష్యం : వ్యవసాయ మార్కెట్లకు పంట
ఉత్పత్తులను విక్రయించేందుకు వచ్చే రైతులకు తక్కువ ఖర్చుతో భోజన వసతి కల్పించడం.
ఫలితం : మార్కెట్ యార్డ్లకు వచ్చే వేలాది అన్నదాతల ఆకలి తీరుస్తున్నది.
పథకం : డబుల్ బెడ్రూం ఇండ్లు.
ప్రారంభం : 2014
లక్ష్యం : పేదలకు ప్రభుత్వమే రెండు పడక గదుల ఇళ్లను నిర్మించి ఇవ్వడం.
ఫలితం : మొదటి విడతలో 2.91 లక్షల లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల మంజూరు.
పథకం : 6 కిలోల బియ్యం పంపిణీ
ప్రారంభం : 2014
లక్ష్యం : కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోల చొప్పున రేషన్ బియ్యం పంపిణీ.
ఫలితం : రాష్ట్రవ్యాప్తంగా 9,05,748 కార్డుదారులకు లబ్ధి.
పథకం : రవాణా పన్ను రద్దు
ప్రారంభం : 2018
లక్ష్యం : సామాన్యులకు భారం కాకుండా.. ఆటోలు, ట్రాలీలు, ట్రాక్టర్లకు రోడ్డు రవాణా పన్ను రద్దు.
ఫలితం : దాదాపు 2 లక్షల మందికి లబ్ధి.
పథకం : రైతుబజార్లు
ప్రారంభం : 2014
లక్ష్యం : పండించిన కూరగాయలను రైతులే స్వయంగా విక్రయించుకునేందుకు మార్కెట్లను ఏర్పాటుచేయడం.
ఫలితం : రాష్ట్ర ఏర్పాటు తర్వాత 29 రైతుబజార్లు ఏర్పాటయ్యాయి.
పథకం : పాలీహౌజ్, గ్రీన్హౌజ్ సబ్సిడీ
ప్రారంభం : 2014
లక్ష్యం : ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించేందుకు సబ్సిడీ.
ఫలితం : 1190 మంది రైతులకు పాలీహౌజ్, 3945 మంది రైతులకు గ్రీన్హౌజ్ ఏర్పాటు కోసం సబ్సిడీ అందింది.
పథకం : రైతులకు కాల్ సెంటర్ (1800-599-4199)
ప్రారంభం : 2020
లక్ష్యం : పంటల అమ్మకాలు, ఇతరత్రా సమస్యలను రైతుల
విన్నవించుకునేందుకు వీలు.
ఫలితం : సేవలలో పారదర్శకత సాధ్యమైంది. దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట పడింది. రైతు సంతోషంగా ఉన్నాడు.
పథకం : గ్రామీణ విత్తనోత్పత్తి పథకం
ప్రారంభం : 2020
లక్ష్యం : తెలంగాణను సీడ్బౌల్గా తీర్చిదిద్దడం.
ఫలితం : ఒక్కో యూనిట్కు 25 మంది రైతుల చొప్పున.. 31,891 యూనిట్లు మంజూరయ్యాయి.
పథకం : పౌల్ట్రీ ఫారాలకు సబ్సిడీపై విద్యుత్
ప్రారంభం : 2015
లక్ష్యం : పౌల్ట్రీ రంగాన్ని ప్రోత్సహించేందుకు యూనిట్కు రూ.2 సబ్సిడీతో
విద్యుత్ను ఇవ్వడం.
ఫలితం : ఇప్పటికే 5,467 పౌల్ట్రీ
యూనిట్లకు లబ్ధి.
పథకం : ఆపద్బంధు పథకం
ప్రారంభం : 2017
లక్ష్యం : పిడుగుపాటు, వరదలు, భారీ వర్షాలు, వడదెబ్బ తదితర వైపరీత్యాల వల్ల మృతి చెందితే బాధిత కుటుంబాలకు రూ.50వేల నుంచి రూ.6 లక్షల వరకూ ఎక్స్గ్రేషియా చెల్లించడం.
ఫలితం : ఆపదల సమయంలో అండదండలు
పథకం : ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్(టీడీఆర్)
ప్రారంభం : 2020
లక్ష్యం : అభివృద్ధి కార్యక్రమాల్లో భూసేకరణ సందర్భంగా భూమిని ఇచ్చినవారు నష్టపోకుండా వారికివాటాలను కేటాయించడం.
ఫలితం : అభివృద్ధికి సోపానం, భూ యజమానికి మేలైన పరిహారం
పథకం : ఆదాయ పరిమితి పెంపు
ప్రారంభం : 2014
లక్ష్యం : గ్రామీణుల వార్షిక ఆదాయాన్ని రూ.65,000 నుంచి
రూ.1.50 లక్షలకు, పట్టణవాసుల వార్షిక ఆదాయాన్ని రూ.75,000 నుంచి రూ.2 లక్షలకు పెంచడం. విదేశీ విద్యా పథకాలను
రూ.5 లక్షల వరకు వర్తింపజేయడం.
ఫలితం : మరింత మంది సంక్షేమ పరిధిలోకి.
పథకం : పవర్లూమ్లకు విద్యుత్ సబ్సిడీ
ప్రారంభం : 2015
లక్ష్యం : చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు పవర్లూమ్లకు యూనిట్కు రూ.2 సబ్సిడీపై విద్యుత్ అందించడం.
ఫలితం : 6,097 యూనిట్లకు లబ్ధి.
పథకం :జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ (జేహెచ్ఎస్)
ప్రారంభం : 2016
లక్ష్యం : జర్నలిస్టులకు హెల్త్కార్డులు తద్వారా ఉచిత వైద్యసేవలు.
ఫలితం : ఇప్పటివరకు 3.57 లక్షల మంది జర్నలిస్టులకు లబ్ధి. 22,326 మందికి సర్జరీలు.
పథకం :న్యాయవాదుల సంక్షేమం
ప్రారంభం : 2018
లక్ష్యం : రూ.100 కోట్లతో న్యాయవాదుల సంక్షేమ నిధి ఏర్పాటు.
ఫలితం : న్యాయవాదుల సంక్షేమానికి పెద్దపీట.
పథకం :జర్నలిస్టులకు లక్ష ఎక్స్గ్రేషియా
ప్రారంభం : 2018
లక్ష్యం : ఏ కారణం చేతనైనా జర్నలిస్ట్ మృతి చెందినా, ప్రమాదాల బారినపడినా బాధిత కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించడం.
ఫలితం : రాష్ట్రవ్యాప్తంగా 516 కుటుంబాలకు లబ్ధి.
పథకం :జర్నలిస్టు కుటుంబాలకు పింఛన్
ప్రారంభం : 2017
లక్ష్యం : మృతిచెందిన జర్నలిస్టు కుటుంబానికి రూ.3 వేల చొప్పున 5 ఏండ్లపాటు పింఛన్.
ఫలితం : 392 జర్నలిస్టు కుటుంబాలకు లబ్ధి.
పథకం :: జర్నలిస్టు పిల్లలకు ప్రోత్సాహం
ప్రారంభం : 2017
లక్ష్యం : జర్నలిస్టు పిల్లలు జర్నలిజం చదివితే రూ.లక్ష సాయం, అదే విదేశాల్లో చదివితే రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేయడం.
ఫలితం : అక్షరాన్ని నమ్ముకున్నవారికి ప్రోత్సాహం.
పథకం : ట్రాఫిక్ పోలీసులకు రిస్క్ అలవెన్స్
ప్రారంభం : 2017
లక్ష్యం : కాలుష్య వాతావరణంలో పనిచేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు మూలవేతనంపై 30 శాతం అదనంగా రిస్క్ అలవెన్స్ చెల్లించడం.
ఫలితం : పోలీసన్నల కష్టానికి గుర్తింపు
పథకం :హైదరాబాద్లో ఉచిత నీటి సరఫరా
ప్రారంభం : 2021
లక్ష్యం : హైదరాబాద్ నగరంలో 20వేల లీటర్ల నీటిని ఉచితంగా అందివ్వడం.
ఫలితం : నగర పరిధిలోని 10,17,939 కుటుంబాలకు లబ్ధి.
పథకం :అన్నపూర్ణ క్యాంటీన్
ప్రారంభం : 2016
లక్ష్యం : రూ.5లకే మధ్యాహ్న భోజనం అందించడం.
ఫలితం : ప్రతి రోజూ రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 45,000 మంది పేదల కడుపు నిండుతున్నది. ఇప్పటి వరకూ 1.83 కోట్ల మందికి భోజనం.
పథకం : మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్
ప్రారంభం : 2018
లక్ష్యం : పట్టణాల్లో నిరుపేదల సౌకర్యార్థం మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ను నిర్మించడం.
ఫలితం : అన్ని రకాలుగా ఉపయోగకరం.
పథకం :టీ వర్క్స్
ప్రారంభం : 2023
లక్ష్యం : సాంకేతిక పరికరాల తయారీ, నిర్మాణ రంగంలో అభివృద్ధి దిశగా ఔత్సాహికులకు అవకాశాలు కల్పించడం.
ఫలితం : ఇప్పటివరకు 300 మంది వినియోగదారులకు 1000కిపైగా డివైజ్లను సరఫరా చేసింది.
పథకం :టూరిజం సర్క్యూట్
ప్రారంభం : 2017
లక్ష్యం : అటవీ, జల, ఆలయాల అనుసంధానం
ఫలితం : యాత్రికులకు అనిర్వచనీయ అనుభూతి
పథకం : తెలంగాణ సోలార్ పవర్ పాలసీ
ప్రారంభం : 2014
లక్ష్యం : సోలార్ పవర్ ఉత్పత్తిని ప్రోత్సహించడం.
ఫలితం : 74 మెగావాట్ల నుంచి 4432 మెగావాట్లకు సౌరవిద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచడం.
పథకం :ఎస్ఆర్డీపీ (స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్)
ప్రారంభం : 2016
లక్ష్యం : హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ రహితంగా తీర్చిదిద్దడం.
ఫలితం : 19 ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు, తీగల వంతెన, ఉక్కువంతెనలు, 38 మిస్సింగ్ లింకురోడ్ల నిర్మాణం.
పథకం : టీ ఫైబర్ గ్రిడ్
ప్రారంభం : 2015
లక్ష్యం : గ్రామాల్లో ఇంటింటికీ, ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలన్నింటికీ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం.
ఫలితం : ఇంటర్నెట్తో సామాన్యులకు అనుసంధానం.
పథకం :స్వచ్ఛ తెలంగాణ
ప్రారంభం : 2015
లక్ష్యం : రాష్ట్రంలో పరిశుభ్రత పెంపొందిం చడం, బహిరంగ మలమూత్ర విసర్జన నివారించడం. ఇంటింటికీ మరుగుదొడ్లు నిర్మించడం.
ఫలితం : 2019లోనే బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపును పొందింది.
పథకం : కంటివెలుగు
ప్రారంభం : 2018
లక్ష్యం : అంధత్వ రహిత తెలంగాణను సాధించడం.
ఫలితం : మొదటివిడతలో 1.48 కోట్ల మందికి లబ్ధి. ఇటీవల నిర్వహించిన రెండో విడతలో 1.50 కోట్ల మందికిపైగా లబ్ధి.
పథకం : బస్తీ దవాఖానాలు
ప్రారంభం : 2020
లక్ష్యం : పట్టణాల్లోని బస్తీల్లో నివసించే వారికి మెరుగైన వైద్యసేవలను అందించేందుకు ప్రత్యేకంగా వైద్యశాలలు ఏర్పాటుచేయడం.
ఫలితం : ఇప్పటివరకు 2,11,23,408 మందికి లబ్ధి.
పథకం : టీ డయాగ్నోస్టిక్ హబ్
ప్రారంభం : 2018
లక్ష్యం : నిరుపేదలకు ఉచితంగా 58 రకాల పరీక్షలు నిర్వహించేందుకు ప్రతి జిల్లా దవాఖానలో డయాగ్నోస్టిక్ హబ్లను నెలకొల్పుతున్నది.
ఫలితం : 25,95,958 మందికి 1,00,39,068 పరీక్షలు ఉచితంగా చేశారు.
పథకం : సంచార వైద్యశాలలు – 104
ప్రారంభం : 2014
లక్ష్యం : గ్రామీణ ప్రాంతాలకే వెళ్లి వైద్యసేవలను అందించేందుకు వాహనాలను ఏర్పాటుచేయడం.
ఫలితం : సంవత్సరానికి సగటున 17లక్షల మందికిపైగా గ్రామీణులకు వైద్యసేవలు అందుతున్నాయి.
పథకం : డయాలసిస్ సెంటర్లు
ప్రారంభం : 2014
లక్ష్యం : కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 104 డయాలసిస్ సెంటర్ల ద్వారా ఉచితంగా వైద్యసేవలను అందించడం.
ఫలితం : ప్రతి సంవత్సరం సగటున 8,500మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు లబ్ధి పొందుతున్నారు.
పథకం : తెలంగాణ ఆరోగ్యశ్రీ
ప్రారంభం : 2014
లక్ష్యం : తెలుపు రేషన్ కార్డు ఉన్న పేదలకు ఉచిత వైద్యం అందించడం. వైద్య ఖర్చుల పరిమితి రూ.2లక్షల నుంచి రూ.5లక్షలకు పెంపు.
ఫలితం : 1,61,922 మందికి లబ్ధి.
పథకం :పల్లె దవాఖాన
ప్రారంభం : ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కావచ్చు
లక్ష్యం : గ్రామీణ ప్రాంతాల్లోనే 14రకాల పరీక్షలతో గ్రామీణ ఆరోగ్య ఉపకేంద్రాలను నెలకొల్పడం.
ఫలితం : సామాన్యుల కార్పొరేట్ దవాఖానాలు.
పథకం :జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ
ప్రారంభం : 2014
లక్ష్యం : మారుమూల ప్రజలకు సైతం సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు చేరువ చేసేందుకు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుచేయడం.
ఫలితం : తెలంగాణలోని మొత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 17కు చేరనున్నది. తద్వారా రాష్ట్రంలో 2,915 ఎంబీబీఎస్ సీట్లు, 1,208 పీజీసీట్లు, 152 సూపర్ స్పెషాలిటీ సీట్లు
అందుబాటులోకి వచ్చాయి.
పథకం : టెలి మెంటల్ కాల్సెంటర్
ప్రారంభం : 2017
లక్ష్యం : మానసిక వ్యాధిగ్రస్తులకు హెల్ప్లైన్ సేవలు.
ఫలితం : 25,547 మందికి వైద్యసేవలు అందించారు.
పథకం : మిషన్ ఇంద్రధనుష్
ప్రారంభం : 2015
లక్ష్యం : చిన్నారులకు టీకాలు వేయిడం.
ఫలితం : టీకాలు సంపూర్ణంగా వేసుకుంటున్న చిన్నారుల సంఖ్య 79 శాతం నుంచి 87.4 శాతానికి పెరిగింది.
పథకం :స్టార్టప్ విలేజ్ ఆంత్రప్రెన్యూర్షిప్ ప్రాజెక్ట్
ప్రారంభం : 2021
లక్ష్యం : ఎంపికచేసిన 10 జిల్లాల్లో పరిశ్రమల స్థాపనను పెంపొందించడం.
ఫలితం : 11,171 పరిశ్రమల ఏర్పాటు.
పథకం :సమీకృత మార్కెట్లు
ప్రారంభం : 2021
లక్ష్యం : మున్సిపాల్టీల్లో పరిశుభ్రమైన వాతావరణంలో కూరగాయల విక్రయాలకు ఒకేచోట మార్కెట్లు నిర్మించడం.
ఫలితం : ఇప్పటికే 8 నిర్మించగా, 129 చోట్ల పనులు ప్రారంభించనున్నారు.
పథకం : మిషన్ కాకతీయ
ప్రారంభం : 2015, మార్చి18
లక్ష్యం : చెరువులను పునరుద్ధరించి నిల్వ సామర్థ్యం పెంచడం. తద్వారా గ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయడం.
ఫలితం : రాష్ట్రవ్యాప్తంగా 8టీఎంసీల నిల్వసామర్థ్యం పెరిగింది. భూగర్భజలాల మట్టం 4.34 మీటర్లకు పెరిగింది.
పథకం :వాగుల పునరుజ్జీవ పథకం
ప్రారంభం : 2016
లక్ష్యం : ప్రతీ వర్షపుబొట్టును ఒడిసిపట్టడమే గాకుండా, ప్రాజెక్టుల్లోకి పూడిక చేరకుండా నిరోధించాలనే సంకల్పంతో రాష్ట్రంలోని అన్ని వాగులపై చెక్డ్యామ్లను నిర్మించడం.
ఫలితం : భూగర్భజలాల పెరుగుదలతోపాటు, ఆయకట్టు స్థిరీకరణ.
పథకం :మిషన్ భగీరథ
ప్రారంభం : 2015
లక్ష్యం : ప్రతి ఇంటికీ నల్లా ద్వారా శుద్ధిచేసిన తాగునీటిని అందించడం.
ఫలితం : రాష్ట్రంలో 100 శాతం ఇళ్లకు నల్లా నీరు అందుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 3.18 కోట్ల మందికి లబ్ధి.
పథకం :పల్లె ప్రగతి
ప్రారంభం : 2019
లక్ష్యం : గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తద్వారా జీవన ప్రమాణాల పెంపు.
ఫలితం : 12,679 గ్రామాల్లో డంప్యార్డులు, వైకుంఠధామాల నిర్మాణం.
పథకం :న్యూట్రిగార్డెన్స్
ప్రారంభం : 2018
లక్ష్యం : స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో కూరగాయల సాగును ప్రోత్సహిం చడం.
ఫలితం : 1022 న్యూట్రిగార్డెన్స్ ఏర్పాటుతో పాటు, 3,78,940 గృహాల్లో పెరటి సాగు ప్రారంభమైంది.
పథకం :కమ్యూనిటీ మేనేజ్డ్ రిహాబిలిటేషన్ సర్వీసెస్
ప్రారంభం : 2014
లక్ష్యం : దివ్యాంగులు, వారి కుటుంబాలకు పునరావాసం కల్పించడం. ఫలితం : దాదాపు 2,500 దివ్యాంగుల కుటుంబాలు లబ్ధి పొందుతున్నారు.
పథకం : పల్లె ప్రకృతివనాలు
ప్రారంభం : 2019
లక్ష్యం : గ్రామాల్లో, మండలాల్లో లంగ్ స్పేస్ల ఏర్పాటు.
ఫలితం : రాష్ట్రంలోని 19,472 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటయ్యాయి.
పథకం : పట్టణ ప్రగతి
ప్రారంభం : 2020
లక్ష్యం : పట్టణాల్లో పరిశుభ్రత, మౌలిక వసతుల కల్పన. ఫలితం : ఇంటింటికీ చెత్త సేకరణ నిరాటంకంగాకొనసాగుతున్నది.
పథకం :ఓపెన్ జిమ్లు
ప్రారంభం : 2020
లక్ష్యం : నగరవాసుల వ్యాయామం కోసం బహి రంగ ప్రదేశాల్లో జిమ్లను ఏర్పాటుచేయడం.
ఫలితం : నగరాలు, మున్సిపాలిటీల్లో 95 ఓపెన్ జిమ్లు ఏర్పాటయ్యాయి.
పథకం :హరితహారం
ప్రారంభం : 2015
లక్ష్యం : అటవీ విస్తీర్ణాన్ని 24 శాతం నుంచి 33 శాతానికి పెంచడం.
ఫలితం : రాష్ట్రవ్యాప్తంగా 82కోట్ల మొక్కలు నాటారు. గడచిన 9 ఏళ్లలో తెలంగాణ గ్రీన్ కవర్ 7.7 శాతానికిపైగా పెరిగింది.
పథకం :ఎస్ఎన్డీపీ (స్ట్రాటజిక్ నాలా డెవలప్ మెంట్ ప్లాన్)
ప్రారంభం : 2019
లక్ష్యం : ఆక్రమణలకు గురైన నాలాలను పునరుద్ధరించడం.
ఫలితం : తొలిదశలో 58 నాలాల పనుల పూర్తి.
పథకం : టీ ఐడియా (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఆంత్రప్రెన్యూర్ అడ్వాన్స్మెంట్)
ప్రారంభం : 2015
లక్ష్యం : ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకుపరిశ్రమలను స్థాపించేందుకు స్టాంప్డ్యూటీ మాఫీ, సబ్సిడీలు ఇవ్వడం.
ఫలితం : 24,470 మందికి 3457.91 కోట్లుఅందజేత.
పథకం : ఆస్తిపన్ను రాయితీ
లక్ష్యం : జీహెచ్ఎంసీతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆస్తి పన్నులో 50 శాతం రాయితీ ఇచ్చింది.
ఫలితం : సామాన్య ప్రజలకు ఎంతో ఊరటనిచ్చే నిర్ణయం. దీనివల్ల సాధారణ ప్రజానీకం లబ్ధి పొందింది.
పథకం : వాటర్బోర్డులో వన్టైమ్ సెటిల్మెంట్
లక్ష్యం : నీటి పన్ను బకాయిలపై విధించిన వడ్డీ మాఫీ చేస్తూ ఏకమొత్తంలో చెల్లింపునకు అవకాశం.
ఫలితం : గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు 26వేల మందికిపైగా లబ్ధి.
పథకం : టీఎస్ బీపాస్ (తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ పర్మిషన్ అప్లికేషన్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్)
ప్రారంభం : 2019
లక్ష్యం : పట్టణాలు, నగరాల్లో ఇళ్ల నిర్మాణ అనుమతులను సులభతరం చేయడం. 75 గజాల్లో ఏడు మీటర్ల ఎత్తు వరకు చేపట్టే నిర్మాణాలకు అనుమతులు అవసరం లేదు. 600 గజాల వరకు ఇన్స్టంట్విధానంలో అనుమతులు జారీ చేయడం.
ఫలితం : 1,39,609 అనుమతులు మంజూరయ్యాయి. 5,70,631 ఇన్స్టంట్ మ్యుటేషన్లు పూర్తయ్యాయి.
పథకం :ఎఫ్ఎస్టీపీ
ప్రారంభం : 2018
లక్ష్యం : మురుగు నీటి శుద్ధి కోసం జీహెచ్ఎంసీతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం.
ఫలితం : 95 చోట్ల ఎఫ్ఎస్టీపీలు మంజూరయ్యాయి.
పథకం :ప్రజా మరుగుదొడ్లు
ప్రారంభం : 2015
లక్ష్యం : ప్రతి వేయి మందికి ఒక ప్రజా మరుగుదొడ్డి ఉండాలనే లక్ష్యం.
ఫలితం : కొత్తగా 4,087 ప్రజా మరుగుదొడ్లు అందుబాటులోకి వచ్చాయి.
పథకం :అనాథలను బీసీలుగా గుర్తింపు, గురుకులాల్లో ప్రత్యేక రిజర్వేషన్.
లక్ష్యం : అనాథ బాలలకు బీసీ సర్టిఫికెట్లను జారీ చేసి వారికి ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడం. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ, జనరల్ గురుకులాల్లో ప్రత్యేకంగా 2 శాతం రిజర్వేషన్.
ఫలితం : దీనివల్ల ఎంతోమంది అనాథలకు కొత్త జీవితం లభించింది.
పథకం : టీ శాట్
ప్రారంభం : 2016
లక్ష్యం : శాటిలైట్ చానళ్ల ద్వారా విద్యార్థులకు, ఉద్యోగార్థులకు పాఠ్యాంశాల బోధన.
ఫలితం : లక్షలాది మంది నిరుపేద విద్యార్థులకు, ముఖ్యంగా దివ్యాంగులకు, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు ఎంతగానో ఉపయోగపడుతున్నది.
పథకం :రూపాయికే నల్లా కనెక్షన్
ప్రారంభం : 2014
లక్ష్యం : రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, మున్సిపాలిటీల్లో పేదలకు రూపాయికే నల్లా కనెక్షన్ ఇవ్వడం.
ఫలితం : 48,142 మందికి లబ్ధి.
పథకం : టీఎస్ ప్రైమ్
ప్రారంభం : 2015
లక్ష్యం : మైనారిటీ వర్గాల్లోని పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిం చేందుకు ఏర్పాటుచేసింది. ప్రత్యేక రాయితీలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నది.
ఫలితం : మైనారిటీలలోని ఆంత్రప్రెన్యూర్షిప్ స్కిల్స్కు ప్రోత్సాహం.
పథకం : మైనారిటీ కమిషన్
ప్రారంభం : 2018
లక్ష్యం : మైనారిటీల హక్కుల రక్షణ.
ఫలితం : వ్యవస్థ పట్ల గౌరవం పెరుగుతున్నది.
పథకం :ఓన్ యువర్ క్యాబ్
ప్రారంభం : 2018, సెప్టెంబర్ 4
లక్ష్యం : మైనారిటీ యువతకు క్యాబ్ వాహనా లను అందివ్వడం.
ఫలితం : 341 మంది మైనారిటీ యువతకు వాహనాలు అందాయి.
పథకం :అవార్డుల ప్రదానం
ప్రారంభం : 2014
లక్ష్యం : సాహిత్యం, కళలతోపాటు వివిధ వృత్తి రంగాల్లో విశేషసేవలు అందిస్తున్న వారికి అవార్డుల ప్రదానం.
ఫలితం : దాశరథి, కాళోజి, సినారె పేరిట అవార్డులను ఇవ్వడంతోపాటు, వివిధ విభాగాల ఉద్యోగులకు ఉత్తమ సేవలకుగాను అవార్డులను ప్రకటిస్తూ, ఘనంగా సత్కరిస్తున్నది. నగదు ప్రోత్సాహకాలూ అందిస్తున్నది.
పథకం : టీ ఫైబర్ గ్రిడ్
ప్రారంభం : 2015
లక్ష్యం : గ్రామాల్లో ఇంటింటికీ, కార్యాలయాలు, సంస్థలకు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ .
ఫలితం : సామాన్యులకు చేరువలో డేటా
పథకం : తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ
ప్రారంభం : 2016
లక్ష్యం : ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో రాయితీ ఇస్తున్నది. కాలుష్య నివారణ
ఫలితం : కాలుష్య నివారణలో తోడ్పాటు.
పథకం : ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ చట్టం తెచ్చిన మొదటి రాష్ట్రం
ప్రారంభం : 2017
లక్ష్యం : జనాభాకు అనుగుణంగా ఎస్టీల అభివృద్ధికి నిధుల కేటాయింపు
ఫలితం : 9 ఏండ్లలో ఎస్టీల అభ్యున్నతికి ప్రభుత్వం కేటాయించిన నిధులు రూ.40 వేల కోట్లు.
పథకం : తండాలు, గూడేలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తింపు
ప్రారంభం : 2018
లక్ష్యం : 500 జనాభా కలిగిన తండాలు, ఆదివాసీ గూడేలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటుచేయడం.
ఫలితం : 3,146 గ్రామాల్లో ఆదివాసీలు, గిరిజనులకే రాజ్యాధికారం. ఎస్టీ పంచాయతీల్లో 3,146 సర్పంచులు, 24,682 మంది వార్డ్ మెంబర్లు పరిపాలనలో భాగస్వాములయ్యారు. 9 ఏండ్లలో రూ. 1,837.08 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది.
పథకం :ఎస్టీ గురుకులాలు
ప్రారంభం : 2016
లక్ష్యం : గిరిజన విద్యార్థులకు 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఉచితంగా విద్యను అందించడం.
ఫలితం : 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు 183 గురుకులాల ఏర్పాటు. వాటిలో 22 డిగ్రీ కాలేజీలను ఏర్పాటుచేసింది. గురుకులాల్లోభవనాల నిర్మాణానికి రూ. 292 కోట్లు వెచ్చించింది.
పథకం :సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
ప్రారంభం : 2018
లక్ష్యం : నిరుపేద గిరిజన విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్ తదితర జాతీయ పోటీ పరీక్షలకు తర్ఫీదునివ్వడం.
ఫలితం : గురుకులాల్లో మెరుగైన శిక్షణ పొందిన 918 మంది ఎస్టీ విద్యార్థినీ విద్యార్థులు ఎంబీబీఎస్, ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, ప్రతిష్ఠాత్మకమైన విద్యా సంస్థల్లో వృత్తికోర్సుల్లో ప్రవేశాలు సాధించారు.
పథకం :అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్
ప్రారంభం : 2015
లక్ష్యం : విదేశాల్లో ఉన్నతవిద్యను అభ్యసించాలనుకునే గిరిజన విద్యార్థులకు రూ.20లక్షల ఆర్థిక సాయాన్ని అందివ్వడం.
ఫలితం : ఇప్పటివరకు ఈ స్కీమ్ కింద 353మంది ఎస్టీలకు రూ.55 కోట్ల ఆర్థికసాయం అందజేసింది.
పథకం :ఉచిత విద్యుత్
ప్రారంభం : 2015
లక్ష్యం : ఎస్టీ నివాస గృహాలకు 101 యూనిట్లమేరకు ఉచిత విద్యుత్ సరఫరా.
ఫలితం : లక్ష ఎస్టీ కుటుంబాలకు లబ్ధి.
పథకం : గిరివికాసం
ప్రారంభం : 2018
లక్ష్యం : గిరిజనుల వ్యవసాయ భూములకు విద్యుత్, సాగునీరు తదితర మౌలిక వసతుల కల్పన.
ఫలితం : 3,467 గిరిజన ఆవాసాలకు రూ.324 కోట్లు ఖర్చు చేసి త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించారు. మొత్తంగా 2.4 లక్షల ఎకరాలకు కొత్తగా విద్యుత్ సౌకర్యం ఏర్పడింది. ఈ ఏడాది 56 వేల 613 ఎకారాల భూమికి రూ.98కోట్ల 23 లక్షలు వెచ్చించగా, తద్వారా 19వేల 698 మంది గిరిజన రైతులు లబ్ధిపొందారు.
పథకం : ఎస్టీ స్టడీ సర్కిల్
ప్రారంభం : 2018
లక్ష్యం : ఎస్టీ విద్యార్థుల కోసం ప్రత్యేక స్టడీ సర్కిళ్ల ఏర్పాటు
ఫలితం : రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొత్తగా 9 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకూ దాదాపు 7వేల మందికిపైగా గిరిజన విద్యార్థులకు లబ్ధి.
పథకం : ప్రత్యేక రిజర్వేషన్లు..
లక్ష్యం : ఎస్టీ రిజర్వేషన్ను 10 శాతానికి పెంచి విద్య, ఉద్యోగాల్లో అవకాశా లను కల్పిస్తున్నది. పారిశ్రామికవేత్త లుగా ఎదగాలనే ఉద్దేశంతో అవసర మైన ప్రోత్సాహాన్ని అందిస్తూ, రాయి తీలతో రిజర్వేషన్లు కల్పించడం.
ఫలితం : ఇండస్ట్రియల్ పార్కుల్లో ఎస్టీలకు 9.34 శాతం స్థలాలను కేటాయించారు. మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్ కల్పించారు. 1929 మందికి లబ్ధి.
పథకం :బాలరక్షక్ వాహనాలు
ప్రారంభం : 2022
లక్ష్యం : ఆపదలో ఉన్న బాలలను సమాచారం అందిన వెంటనే ఆదుకునేందుకు బాలరక్షక్ వాహనాల ఏర్పాటు.
ఫలితం : సీఎస్ఆర్ నిధులతో 1098 బాలరక్షక్ పేరిట 33 వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
పథకం : ప్రత్యేక సంక్షేమ నిధి
ప్రారంభం : 2016
లక్ష్యం : విద్య, జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో ప్రతిభ చూపే ఎస్సీలకు ఆర్థిక సాయం అందివ్వడం.
ఫలితం : నిరుపేద ఎస్టీలకు ఉన్నత విద్యా ప్రవేశాలు పొందినవారికి రూ.50వేల నగదు, ల్యాప్టాప్, క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందిస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తున్నది. 1200 మంది గిరిజన విద్యార్థులకు లబ్ధి.
పథకం :ప్రీ మెట్రిక్, పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్లు
లక్ష్యం : గిరిజన విద్యార్థులకు ఉపకారవేతనాలను, ఫీజు రీయింబర్స్మెంట్ అందించడం.
ఫలితం : పేద విద్యార్థుల జీవితాలలో వెలుగులు.
పథకం :గిరిపోషణ
ప్రారంభం : 2019
లక్ష్యం : ఆదివాసీ గిరిజనులలో పౌష్టికాహార లోపం నివారించడం.
ఫలితం : అంగన్వాడీ కేంద్రాల ద్వారా 821 ఆవాసాలలో ఈ పథకం ద్వారా గిరిజనులకు పౌష్టికాహారం అందుతున్నది.
పథకం :డ్రైవర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం -రూరల్ ట్రాన్స్పోర్ట్ పథకం
ప్రారంభం : 2015
లక్ష్యం : గిరిజన యువకులకు రవాణా వాహనాలను సమకూర్చి స్వయం ఉపాధి కల్పించడం.
ఫలితం : సుమారు రూ. 101.50 కోట్లు వెచ్చించి 1424 మంది లబ్ధి.
పథకం : బెస్ట్ అవైలబుల్ స్కీమ్
ప్రారంభం : 2014
లక్ష్యం : కార్పొరేట్ స్కూళ్లలో గిరిజన విద్యార్థులకు అవకాశం. అందుకయ్యే ఫీజును చెల్లిం చడం. గతంలో రూ.30 వేల ఫీజు పరిమితి ఉండగా, దానిని తెలంగాణ ప్రభుత్వం రూ.42 వేలకు పెంచింది.
ఫలితం : ప్రతి ఏటా దాదాపు 647 మంది విద్యార్థులకు సుమారుగా 27.03 కోట్లను ఖర్చు చేస్తున్నది.
పథకం :ఆదివాసీ, గిరిజన భవనాల నిర్మాణం
ప్రారంభం : 2022
లక్ష్యం : ఆదివాసీ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు దర్పణం
ఫలితం : హైదరాబాద్లో ఆదివాసీ బంజారాల ఆత్మగౌరవం ప్రతిబింబించేలా బంజారా హిల్స్లో సుమారు రూ.50 కోట్లు ఖర్చుచేసి కుమ్రం భీమ్ ఆదివాసీ భవన్, సేవాలాల్ బంజారా భవనాలను నిర్మించింది. అదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే రూ.71 కోట్ల 95 లక్షల వ్యయంతో 32 ఆదివాసీ, బంజారా భవన్లను ప్రభుత్వం నిర్మించింది. తాజాగా ఈ ఏడాది 47 కోట్లతో 35 నియోజకవర్గాల్లో సంత్ సేవాలాల్ బంజారా భవన్, కుమ్రం భీమ్ ఆదివాసీ భవన్లను నిర్మించనుంది.
పథకం : పరిశ్రమల స్థాపన
ప్రారంభం : 2016
లక్ష్యం : గిరిజనులను పారిశ్రామిక రంగం వైపు మళ్లించడం.
ఫలితం : తేనె, ఇప్పపువ్వు లడ్డు, గ్లిజరిన్ సబ్బుల తయారీ ఇలా మొత్తంగా 14 రకాల పరిశ్రమలను ఏర్పాటుచేసింది. 22 పెట్రోల్ బంకుల ఏర్పాటు. ఒక్కో యూనిట్ ద్వారా స్థానికంగా ఉండే 10-15మంది గిరిజనులకు ఉపాధి లభిస్తున్నది.
పథకం :పోడు పట్టాల పంపిణీ
ప్రారంభం : 2023
లక్ష్యం : పోడు సాగుతో జీవిస్తున్న గిరిజనులకు ఆ భూములపై హక్కు పత్రాలను అందజేసి ప్రభుత్వ పథకాలను వర్తింపజేయడం.
ఫలితం : గిరిజనుల జీవితాలలో గొప్ప మార్పు తెచ్చే కార్యక్రమం.
పథకం : రైతులకు సబ్సిడీపై విత్తనాలు
ప్రారంభం : 2014
లక్ష్యం : రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందజేయడం.
ఫలితం : గతేడాది 1.66 లక్షల క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేయగా, 3.33 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది.
పథకం : రైతులకు పావలా వడ్డీ రుణాలు
ప్రారంభం : 2014
లక్ష్యం : లక్ష నుంచి మూడు లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకొని, సకాలంలో చెల్లించిన రైతులకు పావలా వడ్డీ వర్తింపజేయడం.
ఫలితం : ఇప్పటివరకూ రాష్ట్రంలోని 21.36 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది.
పథకం :స్మారక మ్యూజియంల ఏర్పాటు
ప్రారంభం : 2015
లక్ష్యం : గిరిజన తెగల సంస్కృతి పరిరక్షణ
ఫలితం : ఆదివాసీ హకుల కోసం పోరాడిన కుమ్రం భీం స్మారక కేంద్రాన్ని జోడె ఘాట్లో గోండుల సంసృతిని తెలి పేలా నెలకొల్పింది. మేడారం దగ్గర సమ్మక సారలమ్మ మ్యూజియం ఏర్పాటుచేసి కోయ తెగ సంసృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందిస్తున్నది.
పథకం :గృహలక్ష్మి
ప్రారంభం : 2023
లక్ష్యం : ఇంటి నిర్మాణానికి పేదలకు రూ.3 లక్షల ఆర్థిక సాయం.
ఫలితం : గృహిణుల సొంతింటి కలలు సాకారం.
పథకం : గిరిజన ఆంత్రప్రెన్యూర్షిప్
అండ్ ఇన్నొవేషన్ (సీఎం ఎస్టీఈఐ)
ప్రారంభం : 2015
లక్ష్యం : గిరిపుత్రులను యువపారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం. దేశంలోనే మొట్టమొదటిది. గిరిజన యువతకు ఇండియన్ బిజినెస్ సూల్ (ఐఎస్బీ)లో వ్యాపార నిర్వహ ణలో ఉచితంగా ప్రత్యేక శిక్షణను అందివ్వడంతోపాటు విద్యుత్, ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీలను అందివ్వడం. సేల్స్ టాక్స్ మినహాయింపు వర్తింపు.
ఫలితం : 162 మంది ఎస్టీ పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూరింది. గతేడాది 100 మందికి అవకాశం ఇవ్వగా ఈ ఏడాది 200 మందికిగాను సుమారుగా రూ.103 కోట్లను అందివ్వగా వివిధ
రకాల యూనిట్లు ప్రారంభమయ్యాయి.
పథకం : హజ్ కమిటీ
ప్రారంభం : 2017
లక్ష్యం : హజ్ యాత్రికుల ప్రయాణానికి అన్ని రకాల ఏర్పాట్లు, ప్రత్యేక సదుపాయాలు
ఫలితం : ప్రతి సంవత్సరం సగటున 5 వేల మంది హజ్యాత్రకు మార్గం సుగమం.
పథకం :డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు
ప్రారంభం : 2020
నిర్దేశితలక్ష్యం : ప్రకృతి వైపరీత్యాలు, వరదలు సంభవించిన సమయాల్లో బాధితులకు అండగా ఉండి సత్వర సేవలను అందించడం.
సాధించిన ఫలితం: హైదరాబాద్ నగరంలో అకాల వర్షాల సమయంలో డీఆర్ఎఫ్ సిబ్బంది సత్వర సేవలు అందిస్తున్నారు.
పథకం :స్ట్రీట్ వెండింగ్ జోన్స్
ప్రారంభం : 2017
లక్ష్యం : వీధి వ్యాపారుల కోసం రాష్ట్రవ్యాప్తంగా స్ట్రీట్ వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేస్తున్నది.వీధి వ్యాపారుల కోసం రాష్ట్రవ్యాప్తంగా స్ట్రీట్ వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేస్తున్నది.
ఫలితం : ట్రాఫిక్ నియంత్రణ, వీధి వ్యాపారులకు నీడ
పథకం : సీసీ కెమెరాల ఏర్పాటు
ప్రారంభం : 2015
లక్ష్యం : నిఘా వ్యవస్థను పటిష్ఠపరచడం
ఫలితం : రాష్ట్రవ్యాప్తంగా నగరాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 8.8లక్షల కెమెరాల ఏర్పాటు. కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం. అనేక కేసుల ఛేదనలో కీలకపాత్ర పోషిస్తున్న సీసీ కెమెరాలు.
పథకం : తెలంగాణ రాష్ట్ర మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రై జెస్ ఫెసిలిటేషన్ కౌన్సిల్ (టీఎస్ఎంఎస్ఈఎఫ్సీ)
ప్రారంభం : 2018
లక్ష్యం : బకాయిల చెల్లింపులో ఆలస్యానికి సంబంధించి కేసుల పరిష్కారం.
ఫలితం : 4 కౌన్సిళ్ల ద్వారా ఇప్పటివరకు 835పైగా కేసుల పరిష్కారం.
పథకం : సిటిజన్ ఫ్రెండ్లీ సర్వీస్ ఆన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్
ప్రారంభం : 2016 ఆగస్టు 02
లక్ష్యం : డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్, ఆర్టీసీ టికెట్ తదితర సేవలను పూర్తిగా ఆన్లైన్లో అందించడం.
ఫలితం : పారదర్శకత పెరగడంతోపాటు ఎక్కడినుంచి అయినా సేవలను పొందే అవకాశం లభించింది.
పథకం : జంతు సంరక్షణ కేంద్రాల ఏర్పాటు
ప్రారంభం : 2019
లక్ష్యం : మూగజీవాలకు ఆదరువు, జంతువుల సంరక్షణ
ఫలితం : ఇప్పటివరకు 18 జిల్లా కేంద్రాల్లో జంతు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మరో 13 చోట్ల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది.
పథకం :గ్రాంట్ ఇన్ ఎయిడ్
ప్రారంభం : 2014
లక్ష్యం : చర్చిల నిర్వహణ, క్రైస్తవ మత సంస్థల ద్వారా నిర్వహిస్తున్నకార్యక్రమాలకు ఆర్థిక సాయం.
ఫలితం : నాలుగువందల పైచిలుకు సంస్థలకు ఆర్థిక సాయం. తద్వారా సామాజిక సేవా కార్యక్రమాలకూ ఊతం.
పథకం : రోజీ యోజన స్కీం మైక్రోలోన్స్
ప్రారంభం : 2018
లక్ష్యం : నగరంలోని చిరు వ్యాపారులకు రూ. 10 వేల నుంచి రూ. లక్ష లోపు రుణాలు ఇవ్వడం.
ఫలితం : ఎంతోమంది చిరువ్యాపారులకు లబ్ధి చేకూరింది. ప్రైవేట్ అప్పుల నుంచి విముక్తి లభించింది.
పథకం : తెలంగాణ హరిత నిధి
ప్రారంభం : 2021
లక్ష్యం : ఐఏఎస్, ఐపీఎస్తోపాటు రాష్ట్రంలోని గెజిటెడ్, నాన్-గెజిటెడ్ ఉద్యోగులు, కార్పొరేషన్ల చైర్మన్ల వేతనం నుంచి హరితహారం కార్యక్రమానికి నిధులు సమీకరించడం.
ఫలితం : ఇప్పటివరకు దాదాపు రూ. 64.79 లక్షలను సమీకరించి హరితహారానికి వినియోగించారు.
పథకం : ఆటోలాక్
ప్రారంభం : 2020
లక్ష్యం : వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ
ఫలితం : అత్యంత విలువైన వక్ఫ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట పడింది.
పథకం : బాలామృతం
ప్రారంభం : 2019
లక్ష్యం : మూడేండ్ల లోపు చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడం.
ఫలితం : బాలామృతం బాల్యాన్ని శక్తిమంతం చేస్తున్నది. చిన్నారులు వయసుకు తగిన బరువు, ఎత్తుతో ఎదుగుతున్నారు.
పథకం : నీరా కేఫ్
ప్రారంభం : మే 3, 2023
లక్ష్యం : తాటికల్లును పారిశ్రామిక ఉత్పత్తి స్థాయికి తీసుకెళ్లడం.
ఫలితం : 321 మంది గీత కార్మికులకు కొత్తగా ఉపాధి లభించింది. నగరవాసులకు నీరా పానీయం అందుబాటులోకి వచ్చింది.
పథకం : పుణ్యక్షేత్రాల అభివృద్ధి- పునర్నిర్మాణం
ప్రారంభం : 2018
లక్ష్యం : రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడంతోపాటు, భక్తుల రద్దీకి అనుగుణంగా వసతులు సమకూర్చడం.
ఫలితం : యాదాద్రితోపాటు అనేక ఆలయాలు ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
పథకం : రైతుల భూ ప్రక్షాళన
ప్రారంభం : 2017
లక్ష్యం : భూముల రికార్డులను ఆన్లైన్కు ఎక్కించడం ద్వారా ఆక్రమణలను నివారించడం.
ఫలితం : 61.43 లక్షల పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ.
పథకం : ఇంటి రుణానికి వడ్డీ రాయితీ
ప్రారంభం : 2016
లక్ష్యం : ఇంటి నిర్మాణం కోసం రుణం తీసుకునే సింగరేణి కార్మికులకు రూ.10 లక్షల వరకూ వడ్డీలో రాయితీ కల్పించడం.
ఫలితం : సాధారణ కార్మికులు సొంతింటి కలను నిజం చేసుకునేందుకు ఎంతగానో దోహదపడుతున్నది.
పథకం : సింగరేణి కార్మికుల పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్
ప్రారంభం : 2016
లక్ష్యం : ఐఐటీ, ఐఐఎంలలో చదివే సింగరేణి కార్మికుల పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం.
ఫలితం : పేద పిల్లలు సైతం ప్రతిష్ఠాత్మక క్యాంపస్లలో అడుగుపెడుతున్నారు.
పథకం : సింగరేణి మ్యాచింగ్ గ్రాంట్
ప్రారంభం : 2016
లక్ష్యం : ప్రమాదవశాత్తు మరణించే సింగరేణి కార్మికులకు మ్యాచింగ్ గ్రాంట్ కింద రూ.10 లక్షలు అందివ్వడం.
ఫలితం : గతంలో ఈ మొత్తం 5 లక్షలు మాత్రమే ఉండేది. ఆ మొత్తం రెట్టింపు కావడంతో.. ఈ ఆర్థిక చేయూత బాధిత కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నది.
పథకం : గుడుంబా తయారీదారులకు పునరావాసం
ప్రారంభం : 2015
లక్ష్యం : గుడుంబాను నిషేధించడం. తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం కోసం రూ.2 లక్షల ఆర్థిక సాయం.
ఫలితం : 6,323 మందికి ప్రయోజనం
పథకం : ఎస్టీలకు విద్యుత్ బకాయిల మాఫీ
ప్రారంభం : 2017 నవంబర్
లక్ష్యం : బకాయిలను మాఫీ చేయడమే కాదు, ప్రతి ఆవాసానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం.
ఫలితం : ఇప్పటివరకూ రూ.800కోట్లు విద్యుత్ బకాయిలను మాఫీ చేయడంతోపాటు దాదాపు 3 వేల మందికి అక్రమ విద్యుత్ కేసుల నుంచి విముక్తి కల్పించింది.
పథకం : క్రీడాకారులకు ప్రత్యేక రిజర్వేషన్
ప్రారంభం : 2018
లక్ష్యం : క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా విద్య, ఉద్యోగాల్లో 2 శాతం రిజర్వేషన్ అమలు.
ఫలితం : అనేకమంది జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు ప్రయోజనం చేకూరుతున్నది.
పథకం : తెలంగాణ సాంస్కృతిక సారథి
ప్రారంభం : 2014
లక్ష్యం : గౌరవవేతనంపై కళాకారుల నియామకం. తెలంగాణ సర్కారు సంక్షేమ పథకాలపై ప్రచారం.
ఫలితం : 550 మందికిపైగా కళాకారులకు ఉపాధి లభిస్తున్నది. ప్రభుత్వ పథకాల పట్ల గ్రామీణులకు అవగాహన కల్పించేందుకు ఎంతగానో దోహదపడుతున్నది.
పథకం : విప్రహిత భవనం (బ్రాహ్మణ సదనం)
ప్రారంభం : 2023, మే 31న ప్రారంభం.
లక్ష్యం : హైదరాబాద్ నగరంలోని బ్రాహ్మణులు సమావేశాలు నిర్వహించుకునేందుకు, బ్రాహ్మణ విద్యార్థుల వసతికి, శిక్షణకు మూలకేంద్రం.
ఫలితం : బ్రాహ్మణులకు రాష్ట్ర రాజధాని కేంద్రంలో శాశ్వత భవనం అందుబాటులోకి వచ్చింది.
పథకం : సినీవారం
ప్రారంభం : 2016
లక్ష్యం : ఔత్సాహిక దర్శకులను ప్రోత్సహించడం.
ఫలితం : రవీంద్రభారతిలో నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమం ఎంతోమంది ఔత్సాహిక యువకులు సినీ రంగంలో దర్శకులుగా రాణించేందుకు దోహదపడుతున్నది.
పథకం : నగదు ప్రోత్సాహకం
ప్రారంభం : 2016
లక్ష్యం : అంతర్జాతీయ, జాతీయస్థాయిలో
రాణిస్తున్న క్రీడాకారులతోపాటు కోచ్లకు నగదు ప్రోత్సాహకాలు అందించడం.
ఫలితం : క్రీడాకారులు మరింత ఉత్సాహంగా పతకాల వేట సాగించేందుకు ఈ పథకం దోహదపడుతున్నది.
పథకం : క్రీడా మైదానాలు
ప్రారంభం : 2018
లక్ష్యం : క్రీడలను ప్రోత్సహించడం, క్రీడాకారులకు వసతులను కల్పించడం.
ఫలితం : ప్రతి నియోజకవర్గంలోనూ క్రీడా మైదానాల నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటివరకు 136 స్టేడియంల నిర్మాణానికి అనుమతులు మంజూరు. ఇప్పటికే 56 పూర్తయ్యాయి. మొత్తంగా దాదాపు 680 క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి వచ్చాయి.
పథకం : ధూపదీప నైవేద్యం
ప్రారంభం : 2017
లక్ష్యం : ఆలయాల్లో నిత్యపూజలకు నిధులు సమకూర్చడం.
ఫలితం : రాష్ట్రవ్యాప్తంగా 3645 ఆలయాలకు కొత్త కళ వచ్చింది.
పథకం : అధునాతన గ్రంథాలయాల నిర్మాణం
ప్రారంభం: 2017
లక్ష్యం : జిల్లా నుంచి మండల కేంద్రం వరకూ అత్యాధునిక వసతులతో బహుళ అంతస్తుల గ్రంథాలయాల నిర్మాణం.
ఫలితం : ఈ విజ్ఞాన కేంద్రాలు గ్రామీణ విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఎంతగానో దోహదపడుతున్నాయి.
పథకం : డయాలసిస్ రోగులకు ఉచిత బస్పాస్ సౌకర్యం
ప్రారంభం : 2017
లక్ష్యం : కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ప్రయాణ ఖర్చుల భారాన్ని తగ్గించడం.
ఫలితం : దాదాపు 4 వేల మందికిపైగా డయాలసిస్ పేషెంట్లకు ఎంతగానో ఉపయోగపడుతున్నది.
పథకం : టిమ్స్ (తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్)
ప్రారంభం : 2020
లక్ష్యం : పేదలకు కార్పొరేట్ వైద్యసేవలను అందించడం; హైదరాబాద్ నగరం నలువైపులా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మించడం.
ఫలితం : ఇప్పటికే గచ్చిబౌలిలో టిమ్స్ అందుబాటులోకి వచ్చింది. అత్యున్నత ప్రమాణాలతో వైద్యసేవలను అందిస్తున్నది. గాంధీ, ఉస్మానియా దవాఖానలపై భారం తగ్గుతున్నది.
పథకం : ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ
ప్రారంభం : 2018
లక్ష్యం : ప్రభుత్వ స్థలాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న పేదలకు, ఆ జాగాపై హక్కులను కల్పించడం.
ఫలితం : జీవో నం. 58 కింద ఇప్పటివరకు 1.25లక్షల మంది పేదలకు లబ్ధి చేకూరింది.
పథకం : ఆర్టీసీ కార్గో
ప్రారంభం : 2020 జూన్ 19
లక్ష్యం : ఆర్టీసీ ఆదాయాన్ని పెంచి, సంస్థను లాభాల బాట పట్టించడం.
ఫలితం : ఇప్పటికే ఆర్టీసీ రాబడి గాడిన పడింది. నెలకు రూ.కోటికిపైగా అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నది.
పథకం : ఇండ్ల క్రమబద్ధీకరణ
ప్రారంభం : 2018
లక్ష్యం : ప్రభుత్వ స్థలాల్లో ఇప్పటికే పేదలు నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరించడం.
ఫలితం : జీవో 59 రెగ్యులరైజేషన్ ద్వారా ఇప్పటికే 17,829 మందికి ప్రయోజనం చేకూరింది.
పథకం : మొబైల్ బయో టాయిలెట్లు
ప్రారంభం : 2019 డిసెంబర్ 27
లక్ష్యం : కాలకృత్యాలు తీర్చుకోవడానికి రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు.
ఫలితం : జాతరలు, సమావేశాలు, బహిరంగ సభల సమయంలో ఇబ్బందులను దూరం చేస్తున్నాయి.
పథకం : నీటి తీరువా రద్దు
ప్రారంభం : 2014
లక్ష్యం : వ్యవసాయానికి ఉచితంగా నీటిని సరఫరా చేయడం.
ఫలితం : రాష్ట్రంలో దాదాపు 80లక్షలకు మందికిపైగా రైతులకు ఉపయోగం చేకూరుతున్నది.
పథకం : రేషన్లో ఈ పాస్
ప్రారంభం : 2019
లక్ష్యం : రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా అడ్డుకట్ట వేయడం.
ఫలితం : రేషన్ బియ్యం కార్డుదారులకు పక్కాగా పంపిణీ జరుగుతున్నది.
పథకం : రేషన్ పోర్టబిలిటి
ప్రారంభం : 2022
లక్ష్యం : రాష్ట్రంలో ఎక్కడినుంచి అయినా రేషన్ బియ్యం పొందే అవకాశం.
ఫలితం : సొంత గ్రామాలను విడిచి దూర ప్రాంతాలకు వలస వచ్చిన పేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్నది.
పథకం : ఉద్యోగుల క్రమబద్ధీకరణ
ప్రారంభం : 2018
లక్ష్యం : దశాబ్దాలుగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం.
ఫలితం : సింగరేణిలో 9,444, విద్యుత్శాఖలో 23,667, ఆర్టీసీలో 4,001 మందితోపాటు వివిధ విభాగాల్లో
పథకం : రైతువేదిక
ప్రారంభం : 2018
లక్ష్యం : రైతుల సమావేశాల నిర్వహణకు శాశ్వత వేదికల ఏర్పాటు.
ఫలితం : ఇప్పటివరకు 1,06,501కు పైగా సమావేశాలు జరిగాయి.
పథకం : పోలీస్ శిక్షణ
ప్రారంభం : 2018
లక్ష్యం : యూనిఫాం సర్వీస్లో చేరాలనుకునే అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ.
ఫలితం : ఇప్పటివరకు 3,095 మందికిపైగా శిక్షణ అందుకున్నారు. ఎంతోమంది కానిస్టేబుల్స్గా, ఎస్సైలుగా ఎంపికయ్యారు.
పథకం : టీ స్వాన్ (తెలంగాణ స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్)
ప్రారంభం : 2015
లక్ష్యం : రాష్ట్రంలో ఏ మూలనుంచైనా హెచ్డీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణకు ఏర్పాటు.
ఫలితం : ప్రకృతి వైపరీత్యాల సమయంలో సమాచార సత్వర మార్పిడికి దోహదం.
పథకం : సాదాబైనామా ఉచిత రిజిస్ట్రేషన్
ప్రారంభం : 2017
లక్ష్యం : సాదాబైనామా (తెల్ల కాగితాలపై) భూముల క్రయ విక్రయాలు రాసుకున్న రైతులకు ఉచితంగా రిజిస్ట్రేషన్ వెసులుబాటు కల్పించింది.
ఫలితం : వివిధ సర్వే నంబర్ల పరిశీలన. సమస్యలు లేవని నిర్ధారించిన భూములకు పట్టాల పంపిణీ. 58.87 లక్షల రైతు ఖాతాలు డిజిటలైజేషన్.
పథకం : బ్రెడ్ విన్నర్ పథకం
ప్రారంభం : 2014
లక్ష్యం : ఆర్టీసీలోని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు కల్పించడం.
ఫలితం : దాదాపు 964 మందికి ఉపాధి.
పథకం : అంగన్వాడీ హెల్ప్లైన్ 155209
ప్రారంభం : 2018
లక్ష్యం : అంగన్వాడీల సమస్యల పరిష్కారం.
ఫలితం : అంగన్వాడీ కేంద్రాల్లో పారదర్శక సేవలకు ఎంతగానో దోహదపడుతున్నది.
పథకం : మహువా లడ్డూ పంపిణీ
ప్రారంభం : 2020
లక్ష్యం : గిరిజన ఆవాసాల్లోని గర్భిణులకు
పంపిణీ చేయడం ద్వారా రక్తహీనత తగ్గించడం.
ఫలితం : లడ్డూల పంపిణీ తరువాత గిరిజన మహిళల్లో రక్తహీనత తగ్గుముఖం పట్టినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
పథకం : పరమపద వాహనాలు
ప్రారంభం : 2016 నవంబర్ 18
లక్ష్యం : ప్రభుత్వ దవాఖానాల్లో పోస్టుమార్టం చేసిన మృతదేహాలను ఇళ్లకు ఉచితంగా చేర్చడం.
ఫలితం : నిరుపేదలకు ఎంతో అండగా ఉంటున్నది. 50 వాహనాల ద్వారా సగటున ప్రతి సంవత్సరం 6 వేల మందికిపైగా సేవలను పొందుతున్నారు. ఇప్పటివరకు 50వేలకు మందికి ఆసరాగా నిలిచింది.
పథకం : : ఉద్యోగ విరమణ వయసు 61కి పెంపు
ప్రారంభం : 2021
లక్ష్యం : ఉద్యోగుల విరమణ వయసును 58 నుంచి 61కి పెంచడం.
ఫలితం : రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 29,829 మందికి లబ్ధి చేకూరింది.
పథకం : ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఓపీఎంఎస్)
ప్రారంభం : 2019
లక్ష్యం : పంట కొనుగోళ్లు, డబ్బుల చెల్లింపు.. ఇలా సమస్త సమాచారం రైతుల ఫోన్లకే అందివ్వడం.
ఫలితం : ఎక్కడా జాప్యం లేకుండా, రైతులకు అసౌకర్యం కలగకుండా మార్కెటింగ్ సేవలు లభిస్తున్నాయి.
పథకం : రైతుబంధు సమితి
ప్రారంభం : 2017, సెప్టెంబర్ 15
లక్ష్యం : రైతులను సంఘటితపరచి పంటల సాగుపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడం. అన్ని దశల్లో రైతులకు అండగా నిలబడటం.
ఫలితం : గ్రామస్థాయిలో 15, మండల, జిల్లా స్థాయిలో 24 మందితో సమితుల ఏర్పాటు. రైతులకు అన్ని విధాలుగా ఆసరా.
పథకం : దళిత జర్నలిస్టులకు శిక్షణ
ప్రారంభం : 2022
లక్ష్యం : పాత్రికేయ రంగంలో ఉన్న దళితులకు ప్రత్యేకంగా వృత్తి నైపుణ్యాలపై శిక్షణ.
ఫలితం : 2,000 మంది శిక్షణ పొందారు.
పథకం :ప్రత్యేక ఉపాధి పథకం
ప్రారంభం : 2019
లక్ష్యం : సమ్మె కాలంలో మరణించిన కార్మికుల కుటుంబీకులకు ఉపాధి.
ఫలితం : అనేక కుటుంబాలకు ఆధారం.
పథకం : సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు
ప్రారంభం : 2016
లక్ష్యం : ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించడం
ఫలితం : జీడిమెట్ల, ములుగులో ఉద్యానవన
పరిశోధన కేంద్రాల ఏర్పాటు. అప్పారావుపేట, అశ్వారావుపేటలో ఆయిల్పామ్ ప్లాంట్లు.
పథకం : గొర్రెల్లో నట్టల నివారణ
ప్రారంభం : 2016
లక్ష్యం : గొర్రెలు, మేకలకు మూడు విడుతలుగా
నట్టల నివారణ మందులు.
ఫలితం : గొర్రెలలో వ్యాధి నిరోదక శక్తి పెరిగి, అదనపు లాభం చేకూరుతున్నది. ఫలితంగా 2లక్షల మంది గొర్రెల పెంపకందారులకు లబ్ధి చేకూరుతున్నది.
పథకం : జీవన్దాన్
ప్రారంభం : 2015
లక్ష్యం : ప్రభుత్వ దవాఖానాల్లో అవయవదానం ప్రోత్సహించడం. అవయవ మార్పిడి శస్త్రచికిత్సకు రూ.15 లక్షల ఆర్థిక సాయం
అందించడం. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అవయవ మార్పిడికి వెసులుబాటు.
ఫలితం : ప్రభుత్వ సాయంతో వేలాది మంది అవయవ మార్పిడి చికిత్సలు చేయించుకుని పునర్జన్మ పొందారు.
పథకం : ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్లు
ప్రారంభం : 2018
లక్ష్యం : ఒకేచోట వేర్వేరుగా పరిశుభ్రమైన వాతావరణంలో వెజ్, నాన్వెజ్ మార్కెట్ల ఏర్పాట్లు
ఫలితం : 15,40,274మందికి లబ్ధి చేకూరుతున్నది.
పథకం : గ్రామీణ జర్నలిస్టులకు శిక్షణ
ప్రారంభం : 2016
లక్ష్యం : గ్రామీణ పాత్రికేయులకు వృత్తి నైపుణ్యాలపై శిక్షణ.
ఫలితం : ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 6 వేల మంది జర్నలిస్టులు శిక్షణ పొందారు. నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు.
పథకం : ఆన్లైన్ విత్తన ధ్రువీకరణ
ప్రారంభం : 2016
లక్ష్యం : నకిలీ విత్తనాలను అరికట్టడం. బ్లాక్ మార్కెట్ను నిరోధించడం.
ఫలితం : క్యూఆర్, బార్కోడింగ్ ద్వారా విత్తన లాట్లను గుర్తించడం వల్ల రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్ దందాకు పూర్తిగా అడ్డుకట్ట పడింది.
పథకం : సాయిల్ హెల్త్ కార్డులు
ప్రారంభం : 2016
లక్ష్యం : భూముల సారాన్ని నిర్ధారించడం.
ఫలితం : రైతులు నేల స్వభావాన్ని బట్టి పంటలు పండించుకునే అవకాశం.
పథకం :వన్టైం సెటిల్మెంట్ స్కీం
ప్రారంభం : 2019
లక్ష్యం : నీటి బకాయిలపై వడ్డీ మాఫీ వర్తింపు
ఫలితం : 3,61,825 మందికి లబ్ధి.
పథకం : వైకుంఠధామాలు
ప్రారంభం : 2019
లక్ష్యం : ప్రతి గ్రామంలో వైకుంఠధామం నిర్మాణం.
ఫలితం : రాష్ట్రవ్యాప్తంగా 12,796 గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం పూర్తి. పట్టణ ప్రాంతాల్లో ఊపందుకున్న నిర్మాణాలు.
పథకం : ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్
ప్రారంభం : 2016
లక్ష్యం : నెలలు నిండకుండా జన్మించిన నవజాత శిశుల సంరక్షణకు ప్రభుత్వ దవాఖానల్లో ప్రత్యేక కేంద్రాలు.
ఫలితం : ఇప్పటివరకు దాదాపు 50లక్షల మందికిపైగా చిన్నారులకు సేవలు.
పథకం : 108 అత్యవసర రవాణా సేవలు
ప్రారంభం : 2014
లక్ష్యం : గతంలో లక్ష జనాభాకు ఒకటి ఉండేది. ప్రస్తుతం 75 వేల మందికి ఒకటి చొప్పున విస్తరించారు.
ఫలితం : మొత్తం 424 వాహనాలు ఏర్పాటుచేయగా, ఫోన్ చేసిన 15 నిమిషాల్లోనే సేవలను పొందే అవకాశం ఏర్పడింది.
పథకం :సైకో సోషల్ కేర్ సర్వీస్
ప్రారంభం : 2019
లక్ష్యం : జువెనైల్ హోమ్లలోని చిన్నారులకు క్రీడలతోపాటు ఇతర అంశాల్లో శిక్షణ ఇవ్వడం.
ఫలితం : చిన్నారుల మానసిక పరివర్తనలో సానుకూల మార్పునకు ఉపయోగపడుతున్నది.
పథకం : బైక్ అంబులెన్స్లు
ప్రారంభం : 2017 జనవరి17
లక్ష్యం : గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవలను అందించడానికి 50 వాహనాలను ఏర్పాటుచేశారు.
ఫలితం : గిరిజన ఆవాసాలకు సకాలంలో చేరుకుని వైద్యసేవలు అందించే వెసులుబాటు కలిగింది.
పథకం : ఫుడ్ సేఫ్టీ వాహనాలు
ప్రారంభం : 2018
లక్ష్యం : ఆహార పదార్థాల కల్తీపై ప్రజలకు అవగాహన కలిగించడం.
ఫలితం : ఆహార పదార్థాల నాణ్యతను ఎలా తెలుసుకోవాలి, కల్తీని ఎలా గుర్తించాలి, ఎవరికి ఫిర్యాదు చేయాలి.. తదితర అంశాలపై వినియోగదారుల్లో అవగాహన పెరగడం.
పథకం : హెల్త్ ప్రొఫైల్
ప్రారంభం : 2016 ఆగస్టు 5
లక్ష్యం : ప్రజలందరికీ వైద్యపరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్ను రూపొందించడం.
ఫలితం : సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో మొదలు కాగా, ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా కొనసాగుతున్నది.
పథకం : మహిళా సంఘాలకు పాడిగేదెల పంపిణీ
ప్రారంభం : 2018
లక్ష్యం : పాడి ద్వారా ఉపాధి కల్పన
ఫలితం : 48,371 మందికి లబ్ధి
పథకం : వైటీసీ (యూత్ ట్రైనింగ్ సెంటర్స్)
ప్రారంభం : 2014
లక్ష్యం : గిరిజన యువతకు నిర్మాణ, పర్యాటకం తదితర రంగాల్లో ఉపాధి కల్పన శిక్షణ అందివ్వడం.
ఫలితం : ఇప్పటివరకు దాదాపు 31,896 మందికిపైగా యువత శిక్షణ పొంది ఉపాధి అవకాశాలను సొంతం చేసుకున్నది.
పథకం : ఆయిల్పామ్ సబ్సిడీ స్కీం
ప్రారంభం : 2016
లక్ష్యం : ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించేందుకు రాయితీ.
ఫలితం : 13,391 మందికి లబ్ధి. రాష్ట్రంలో గతేడాది రికార్డు స్థాయిలో 52,890 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగయ్యింది.
పథకం : రైతు కల్లాలు
ప్రారంభం : 2020
లక్ష్యం : రైతులు పంట ఉత్పత్తులను ఆరబెట్టుకోవడానికి కల్లాలను నిర్మించడం.
ఫలితం : రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 93,328 కల్లాలను నిర్మించారు. ఫలితంగా ఆయా రైతులకు వరికోతల సమయంలో ఎంతో లబ్ధి చేకూరుతున్నది.
పథకం : మిడ్ వైఫ్ కోర్సు
ప్రారంభం : 2019
లక్ష్యం : గర్భిణులకు సహాయం అందించేందుకు ఏడాదిపాటు నర్సులకు, వైద్యులకు ప్రత్యేక శిక్షణ.
ఫలితం : సురక్షిత ప్రసవాలు పెరిగాయి. మాతాశిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది.
పథకం : పశుమిత్ర
ప్రారంభం : 2018
లక్ష్యం : పశువైద్యంలో మహిళలకు శిక్షణ ఇవ్వడం.
ఫలితం : 2,491 మంది శిక్షణ పొందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 26,51,090 పశువులకు వైద్యసేవలు అందాయి.
పథకం : ఫామ్ ఫుడ్ ప్రాసెసింగ్
ప్రారంభం : 2017
లక్ష్యం : మహిళా సంఘాలతో వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు.
ఫలితం : 7,177 యూనిట్లను ఏర్పాటు చేయగా, 1,13,129 మందికి లబ్ధి
పథకం : ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమ బోర్డు
ప్రారంభం : 2019
లక్ష్యం : ఉద్యోగుల మేలు కోసం డిపోలవారీగా సంక్షేమ కమిటీలు ఏర్పాటు చేసి, వివిధ కార్యక్రమాలను అమలు చేయడం.
ఫలితం : సత్వర నిర్ణయాలు, కార్మికుల ప్రయోజనాలకు పెద్దపీట.
పథకం : కల్లు దుకాణాల పునరుద్ధరణ
ప్రారంభం : 2014
లక్ష్యం : స్వచ్ఛమైన కల్లును అందుబాటులో ఉంచడం. గీత కార్మికులకు ఉపాధి కల్పన.
ఫలితం : ప్రభుత్వ నిర్ణయంతో 50 వేల మంది గౌడ కులస్తులకు లబ్ధి.
పథకం : చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్
ప్రారంభం : 2016
లక్ష్యం : చేనేత కార్మికులకు ప్రయోజనం చేకూర్చడం.
ఫలితం : రాష్ట్రవ్యాప్తంగా 21,750 చేనేత మగ్గాలు, 43,162 పవర్లూమ్లకు జియో ట్యాగింగ్ చేశారు. దీంతో నిజమైన కార్మికులకు లాభం చేకూరుతున్నది.
పథకం : టీ టాప్
ప్రారంభం : 2016
లక్ష్యం : చేనేత మగ్గాలపై పనిచేసే కార్మికులకు అత్యాధునిక మరమగ్గాలపై శిక్షణ ఇవ్వడం.
ఫలితం : అనేక మంది నేత కార్మికులు శిక్షణ పొంది నైపుణ్యాన్ని పెంచుకున్నారు.
పథకం : తెలంగాణలో కంచికామకోటి పీఠం సంప్రదాయ పాఠశాల
ప్రారంభం : 2018
లక్ష్యం : బ్రాహ్మణ విద్యార్థులకు సంప్రదాయ విద్యతోపాటు, సాధారణ విద్యను అందించడం. బ్రాహ్మణ బాలికలకు లలితకళలలు, నృత్యం, సంగీతం తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వడం. పాఠశాల నిర్వహణకు ప్రభుత్వం ఏటా రూ. 3 లక్షల చొప్పున కంచి కామకోటి మఠాధిపతి ఆధ్వర్యంలోని చారిటబుల్ ట్రస్ట్కు మంజూరు చేసింది.
ఫలితం : ఇప్పటివరకు దాదాపు 100 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది.
పథకం : డోనర్ స్కీం
ప్రారంభం : 2015
లక్ష్యం : ఆలయాల అభివృద్ధి పనులకు దాతల నుంచి నిధుల సమీకరణ.
ఫలితం : ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 13.13 కోట్లను సేకరించి వివిధ ఆలయాలకు సంబంధించి 153 అభివృద్ధి పనులకు వెచ్చించింది.
పథకం : రైతులకు ఇన్పుట్ సబ్సిడీ/పంట నష్టపరిహారం
ప్రారంభం : 2014
లక్ష్యం : ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతులను ఆదుకోవడం.
ఫలితం : తెలంగాణ ఏర్పాటు అనంతరం ప్రభుత్వం పాత బకాయిలను తక్షణం చెల్లించింది. ఇప్పటివరకు 37.62 లక్షల మంది రైతులకు రూ.1325 కోట్లు అందజేసి అండగా నిలబడింది.
పథకం : కల్తీ విత్తనాలపై పీడీ యాక్టు
ప్రారంభం : 2017
లక్ష్యం : కల్తీ విత్తనాలను నిరోధించి రైతులు నష్టపోకుండా చూడటం.
ఫలితం : ప్రభుత్వం ఇప్పటివరకు కల్తీ విత్తన దందాకు పాల్పడుతున్న 1027 మందిని అరెస్టు చేసి పీడీ యాక్ట్ ప్రయోగించింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో కల్తీ విత్తనాలకు అడ్డుకట్టపడింది. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి వస్తున్నాయి.
పథకం : ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లిషు మీడియం
ప్రారంభం : 2016
లక్ష్యం : నిరుపేద విద్యార్థులకు ఆంగ్లమాధ్యమంలో ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడం.
ఫలితం : ప్రభుత్వం చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా గత ఒక్క ఏడాదే ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య లక్షకుపైగా పెరిగింది.
పథకం : ఆర్టీసీ ఎఫ్ఏఎంఈ
ప్రారంభం : 2019
లక్ష్యం : ఆర్టీసీలో వాయు కాలుష్యాన్ని తగ్గించి హైదరాబాద్ను గ్రీన్ సిటీగా మార్చడం.
ఫలితం : ఇప్పటికే ప్రభుత్వం తొలివిడతగా సిటీలో 40 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది.
పథకం : ఇంధన ఔట్లెట్లు
ప్రారంభం : 2018
లక్ష్యం : ఖాళీ స్థలాలను వాణిజ్యానికి వినియోగించుకోవడం. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచడం.
ఫలితం : మొత్తంగా 110చోట్ల ఇంధన ఔట్లెట్లు, (పెట్రోల్ బంకులు) ఏర్పాటుకు చర్యలు. ఇప్పటికే పలు చోట్ల అందుబాటులోకి. గతేడాదికి ఏకంగా ఆర్టీసీ 9.93కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
పథకం : జర్నలిస్టులకు ఫీజు రాయితీ
ప్రారంభం : 2017
లక్ష్యం : ఎంఏ జర్నలిజం, ఎంసీజే కోర్సులు చదివే జర్నలిస్టులకు తెలంగాణ మీడియా అకాడమీ ద్వారా ఫీజు రాయితీ కల్పించడం.
ఫలితం : అనేక మంది పాత్రికేయులు వృత్తిపరమైన అర్హతలను పొందుతున్నారు. మెరుగైన ఉపాధి అవకాశాలకు బాటలు వేసుకుంటున్నారు.
పథకం : న్యాయవాదులకు బీమా
ప్రారంభం : 2018
లక్ష్యం : ప్రమాద, ఆరోగ్య బీమా కల్పించి నిరుపేద న్యాయవాదులకు అండగా నిలవడం.
ఫలితం : ఇప్పటివరకు 8053 మంది న్యాయవాదులు, వారి కుటుంబీకులకు ఈ పథకం అండగా నిలిచింది.
పథకం : హోం గార్డులకు బీమా
ప్రారంభం : 2016
లక్ష్యం : హోం గార్డులకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పన.
ఫలితం : హోం గార్డులకు జీవన భద్రత లభించడమేగాక, వారి కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తున్నది.
పథకం : సీఆర్ఎంపీ (సమగ్ర రోడ్ల నిర్వహణ పథకం)
ప్రారంభం : 2018
లక్ష్యం : జంట నగరాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న రోడ్లను అభివృద్ధి చేయడం.
ఫలితం : ప్రభుత్వం ఇప్పటివరకు జీహెచ్ఎంసీ పరిధిలో 812కి.మీ పొడవైన రోడ్లను 1829కోట్లతో అభివృద్ధి చేస్తున్నది.
పథకం : లేబర్ ఆర్బిట్రేషన్ సెంటర్
ప్రారంభం : 2015
లక్ష్యం : కార్మికులు, యజమానుల మధ్య సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వ కేంద్రం ఏర్పాటు.
ఫలితం : దీనిద్వారా ఇప్పటివరకు 11,303 క్లెయిమ్లు పరిష్కారం కాగా, 406.8 కోట్ల లబ్ధి చేకూరింది.