Congress | శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నట్టే.. తుమ్మాలన్నా, దగ్గాలన్నా కాంగ్రెస్ నాయకులకు ఢిల్లీ అనుమతి కావాల్సిందే. ఢిల్లీ చాలా దూరమైందని అనుకున్నారో ఏమో! ఈసారి తెలంగాణ కాంగ్రెస్ నేతలు రూటు మార్చారు. ఈసారి కర్ణాటక రాజధాని బెంగళూరు బాట పట్టారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే వారినే ఆదర్శంగా తీసుకున్న ఇక్కడి తెలంగాణ కాంగ్రెస్ నేతలు శిష్యరికం పూర్తికాక ముందే గురువును మించిపోయారు.
కర్ణాటకలో ఇద్దరి మధ్యే సీఎం కుర్చీలాట జరగగా.. ఈ విషయంలో రెండాకులు ఎక్కువే చదివిన తెలంగాణ నేతలు తమకు తామే సీఎంలుగా ప్రకటించుకుంటున్నారు. కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క, జగ్గారెడ్డి, మొన్నటికిమొన్న పార్టీ తీర్థం పుచ్చుకున్న పొంగులేటి వరకు ప్రతిఒక్కరూ కాబోయే సీఎంలేనట. మరోవైపు తనకెదురైన ట్రబుల్ ‘సిద్ధరామయ్య’నే ఎదుర్కొలేక చతికిలపడ్డ నామ్కే వాస్తే ట్రబుల్ షూటర్ డీకే తెలంగాణ కుర్చీలాటను తేల్చాలని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కొన ఊపిరితో ఉన్న నూటొక్క సీఎంల కాంగ్రెస్ జనాల ఆయువు తీస్తుందని చర్చించుకుంటున్నారు.
మాలోతు