హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం తమిళనాడులోని శ్రీరంగానికి వెళ్లనున్నారు. అక్కడ శ్రీరంగనాథస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించ నున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో తిరుచ్చి ఎయిర్పోర్టుకు వెళ్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు రంగనాథస్వామి ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకోనున్నారు.