హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ) : బ్యాంకు, ఫైనాన్స్, ప్రైవేట్ ఇన్వెస్టర్లను మోసం చేసిన కేసులో దంపతులను 11 ఏండ్ల తర్వాత సీఐడీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. సీఐడీ డీజీ శిఖాగోయెల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదర్శ్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ మణికొండ ఆంజనేయులు, అతడి భార్య రీటా 2013లో బాలానగర్ ఎస్బీఐ నుంచి రూ.27 కోట్ల రుణాన్ని తీసుకుని పరారయ్యారు.
బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టి, కేసును సీఐడీకి బదిలీ చేశారు. వారి విచారణలో ఆంజనేయులు దంపతులపై హైదరాబాద్ సిటీలో 4 కేసులు, సైబరాబాద్ కమిషనరేట్లో ఓ కేసులో ఫైనాన్స్ కంపెనీలు, ప్రైవేట్ ఇన్వెస్టర్లను రూ.60 కోట్లకు మోసం చేసినట్లు తేలింది. 2013 నుంచి వీరు పరారీలో ఉండగా.. సీఐడీ డీజీ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఆంజనేయులు దంపతులను బెంగళూరులో అరెస్టు చేసి, కూకట్పల్లిలోని 13వ అదనపు మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు.