IND vs ENG 3rd Test : ఇంగ్లండ్తో రాజ్కోట్లో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు(Team India) నల్ల బ్యాడ్జిలతో ఆడుతోంది. టీమిండియా క్రికెటర్లంతా మూడో రోజు చేతికి నల్ల రిబ్బన్ కట్టుకొని మైదానంలోకి దిగారు. ఇటీవలే కన్నుమూసిన మాజీ కెప్టెన్ దత్తాజీరవు గైక్వాడ్(Dattajir Rao Gaekwad) గౌరవార్థం రోహిత్ సేన బ్లాక్ బ్యాడ్జీలు ధరించింది. వృద్యాప్య సమస్యలతో బాధపడుతున్న దత్తాజీరావు ఫిబ్రవరి 13న మరణించాడు. అప్పటికీ అతడికి 95 ఏండ్లు.
1959 ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా దత్తాజీరావు కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే.. దత్తాజీరావు కేవలం 11 టెస్టులు ఆడాడంతే. రంజీల్లో అతడికి గొప్ప రికార్డు ఉంది. 1957-58 సీజన్లో బరోడాను చాంపియన్గా నిలిపాడు. దాంతో, అతడికి టీమిండియా కెప్టెన్ చాన్స్ దక్కింది.
రోహిత్ శర్మ(132), రవీంద్ర జడేజా(112)
ఐదు టెస్టుల సిరీస్ను ఓటమితో ప్రారంభించిన భారత్.. వైజాగ్ టెస్టులో స్టోక్స్ సేనను చిత్తు చేసింది. కీలకమైన రాజ్కోట్ టెస్టులోనూ భారీ స్కోర్ చేసి ఇంగ్లండ్ను ఒత్తిడిలోకి నెట్టింది. కెప్టెన్ రోహిత్ శర్మ(132), ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(112)లు శతకాలతో కదం తొక్కగా.. అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్(62), ధ్రువ్ జురెల్(46)లు అద్భుతంగా ఆడారు. దాంతో, తొలి ఇన్నింగ్స్లో 445 రన్స్ కొట్టింది. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(153) విధ్వంసక సెంచరీతో దీటుగా బదులిస్తోంది.