న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal) ఇవాళ వర్చువల్ రీతిలో ఢిల్లీ కోర్టుకు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన రోజ్ అవెన్యూ కోర్టు విచారణలో పాల్గన్నారు. లిక్కర స్కామ్తో లింకున్న మనీ ల్యాండరింగ్ కేసులో ఆయన ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు.
ఇప్పటికే అయిదు సార్లు కేజ్రీవాల్కు ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదు. అయితే ఈ కేసులో వర్చువల్గా కోర్టుకు హాజరయ్యే అవకాశాన్ని కల్పించారు. లిక్కర్ స్కామ్లో తదుపరి విచారణ మార్చి 16వ తేదీన నిర్వహించనున్నారు.
మరో వైపు ఇవాళ అసెంబ్లీలో కేజ్రీవాల్ బలపరీక్ష ఎదుర్కోనున్నారు. శుక్రవారం ఆయన బలనిరూపణపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.