ఢిల్లీ, జూలై : దేశంలో మరికొన్ని చోట్ల ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటుచేసేందుకు టాటా పవర్ సంస్థ ముందుకొచ్చింది. అందులోభాగంగా టాటా పవర్ ,హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) తో భాగస్వామ్యం చేసుకున్నది. భారతదేశంలోని నగరాలు ,ప్రధాన రహదారులలోని హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్లలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఉపయోగకరంగా ఉండేదుకు మరిన్నిచార్జింగ్ స్టేషన్లను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
టాటా పవర్ ఇప్పటివరకు 100 నగరాల్లో 500లకు పైగా చార్జింగ్ స్టేషన్లను ప్రారంభించింది. టాటా పవర్, మెట్రో స్టేషన్, షాపింగ్ మాల్, సినిమా హాల్,హైవే వంటి ప్రాంతాల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచడానికి మౌలిక సదుపాయాలు చాలా అవసరం, కాబట్టి చార్జింగ్ స్టేషన్లను పెంచాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్నిపెంచడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక చర్యలు తీసుకుంటున్నాయి. టాటా పవర్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ వంటి వాటికీ ప్రభుత్వాలు సహకరిస్తాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచడానికి ప్రభుత్వాలు భారీ రాయితీలు ప్రకటిస్తున్నాయి.