నల్లగొండ, నవంబర్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ హక్కుల కోసం సీఎం కేసీఆర్ కేంద్రంతో చేసే పోరాటానికి కలిసొస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈ పోరాటంలో అందరినీ కలుపుకొని పోవాలని సూచించారు. బుధవారం నల్లగొండలో సీపీఎం మహాసభలను తమ్మినేని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రం విధానా లు, రైతు చట్టాలకు వ్యతిరేకంగా కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేయడం అత్యవసరమని, ఆ పోరాటంలో పాల్గొనేందుకు తాము సిద్ధమేనని ప్రకటించారు. ఢిల్లీకి తీసుకుపోయేలా కేసీఆర్ చొరవ తీసుకోవాలని సూచించారు.