చెన్నై: తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ఎం అప్పావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రైస్తవ మిషనరీల వల్లే తమిళనాడు రాష్ట్రం అభివృద్ధి చెందినట్లు ఆయన అన్నారు. క్యాథలిక్ సంఘాలు లేకుంటే తమిళనాడు మరో బీహార్లా మారేదని విమర్శించారు. తన కెరీర్ను క్యాథలిక్ మిషనరీలే రూపుదిద్దామయన్నారు. ఉపవాసం చేసి దేవుణ్ని ప్రార్థించే ప్రజలకే ఈ రాష్ట్రం చెందుతోందన్నారు. మీ అందరి వల్లే ప్రభుత్వం ఏర్పడిన విషయం సీఎం స్టాలిన్కు తెలుసు అని, క్యాథలిక్ సంఘాలు సీఎంను కలిసి మాట్లాడవచ్చు అని, మిమ్మల్ని పట్టించుకోకుంటే, తమిళనాడులో ప్రగతి ఉండదన్నారు. ఒకవేళ తమిళనాడులో మిషనరీలు లేకుంటే అప్పుడు ఈ రాష్ట్రం బీహార్లా మారేదని స్పీకర్ అన్నారు. రాష్ట్ర ప్రగతికి క్యాథలిక్ సంస్థలే ప్రధాన కారణమని, తమిళనాడు స్థాపన మీతోనే జరిగిందని పేర్కొన్నారు.