చెన్నై: తమిళనాడులో కరోనా తీవ్రత కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా పది వేలకుపైగా కరోనా కేసులు, వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 14,016 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మరో 267 మంది కరోనాతో మరణించారు. దీంతో తమిళనాడులో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,53,721కు, మొత్తం మరణాల సంఖ్య 29,547కు చేరింది. ప్రస్తుతం 1,49,927 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. గత 24 గంటల్లో 25,895 మంది కోరోనా రోగులు కోలుకున్నారని, కోలుకున్న వారి మొత్తం సంఖ్య 21,74,247కు చేరినట్లు వెల్లడించింది.