కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్లోని జల్రేజ్ జిల్లాను తాలిబాన్లు ఆక్రమించుకున్నారు. వారి చేతుల్లో నుంచి జిల్లాను విడిపించేందుకు సైన్యం పెద్ద ఎత్తున వైమానిక దాడులకు పాల్పడింది. ఈ ఘర్షణలో దాదాపు 40 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ హింసాత్మక ఘర్షణలో ఐదుగురు పోలీసులు కూడా కన్నుమూశారు. త్వరలోనే ఈ జిల్లా విముక్తి పొందుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చింది.
స్థానిక మీడియా ప్రకారం, ఈ ఘర్షణ అనంతరం వార్డాక్ ప్రావిన్స్లోని జల్రేజ్ జిల్లాను తాలిబాన్ ఉగ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడి ప్రభుత్వ భవనాలను స్వాధీనం చేసుకున్న తర్వాత పలువురు సైనికులను తమ బందీలుగా చేసుకున్నారు. వీరిని విడిపించేందుకు సైన్యం వైమానిక దాడులు చేపట్టడంతో దాదాపు 10 మంది ఉగ్రవాదులు చనిపోయారు.
అదేవిధంగా, జాబుల్ ప్రావిన్స్లోని పోలీస్ స్టేషన్పై గురువారం రాత్రి జరిగిన దాడిలో ఐదుగురు పోలీసులు, ఏడుగురు ఉగ్రవాదులు మరణించారు. హెల్మండ్ ప్రావిన్స్లో వైమానిక దళ దాడుల్లో 14 మంది ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. ఇలాంటి మరో చర్యలో మరో ఎనిమిది మంది ఉగ్రవాదులు మరణించారు.
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా, నాటో సంయుక్త దళాల ఉపసంహరణ మొదలైన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఘర్షణ జరుగడంతో స్థానికుల్లో మరోసారి ఆందోళన కనిపిస్తున్నది. అమెరికా తన సైన్యాన్ని వెనక్కి తీసుకెళ్తున్నప్పటి నుంచి తాలిబాన్లు మరింత రెచ్చిపోతున్నారు. రానున్న రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్లో మారోసారి పాత రోజులు వచ్చేట్లుగా ఉన్నాయని స్థానికులు భయం వ్యక్తం చేస్తున్నారు. తన సైనిక దళాలను ఉపసంహరించుకున్న తర్వాత కూడా.. అక్కడి పరిస్థితులను అమెరికా పర్యవేక్షిస్తూనే ఉండనున్నది.
మార్స్పై పని మొదలుపెట్టిన చైనా రోవర్
సూకీ ఆరోగ్యంగానే ఉన్నారు : జుంటా నేత హ్లింగ్
కరోనా వేళ మోదీ, సోనియా, ఇతర యూపీ ఎంపీలు ఎక్కడున్నారు.. ఏంచేస్తున్నారు..?
సువేందు అధికారి తండ్రి, సోదరుడికి వై ప్లస్ భద్రత
సంగీత దర్శకుడు రామ్లక్ష్మణ్ కన్నుమూత
వ్యాక్సిన్ల కొరత ప్రభుత్వ అలక్ష్యం వల్లే: ఎస్ఐఐ ఈడీ సురేశ్ జాదవ్
ఎగిరే యంత్రానికి రైట్ బ్రదర్స్కు పేటెంట్.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..