హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీకి తమ ప్రయాణాలతో ఆర్థిక చేయూతనివ్వాలని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమ రోజువారీ పనులు, ఇతర అవసరాల నిమిత్తం చేసే ప్రయాణాల్లో కనీసం వారంలో ఒక్క రోజైనా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని కోరుతూ శుక్రవారం ట్వీట్ చేశారు. ప్రజల కోసమే ఈ ప్రజా రవాణా వ్యవస్థ ఉన్నదని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించేలా ప్రతిఒక్కరూ ఎవరికివారు ప్రతిజ్ఞ తీసుకోవాలని ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.