హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్న ఉద్యోగ నోటిఫికేషన్లలో ప్లేయర్లందరూ క్రీడాకోటాను సద్వినియోగం చేసుకోవాలని సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ)తో పాటు పోలీస్ శాఖ భర్తీచేయబోయే ప్రభుత్వ ఉద్యోగాల్లో జీవో నంబర్ 74కు అనుగుణంగా రెండు శాతం కోటా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో గురువారం టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్రెడ్డి, డీజీపీ మహేందర్రెడ్డిని సాట్స్ చైర్మన్ కలిసి వినతిపత్రాలు అందజేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన ప్లేయర్లు రెండు శాతం కోటాను సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్లో రాష్ర్టానికి, దేశానికి మరింత పేరు, ప్రతిష్టలు తీసుకురావాలని అకాంక్షించారు.