కోల్కతా : పశ్చిమ బెంగాల్లోని హౌరా జిల్లాలో బుధవారం రాత్రి స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన రామనవమి (Ram Navami) ర్యాలీలో పలువురు యువకులు కత్తులు, హాకీ స్టిక్స్తో ప్రదర్శనలో పాల్గొనడం కలకలం రేపింది. సంక్రెల్ ప్రాంతంలో రామనవమి ప్రదర్శనలో పలువురు యువకులు ఆయుధాలతో ఊరేగింపులో పాల్గొన్నారు.
రామనవమి ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాజ్గంజ్ రథ్ తల్ మేలా గ్రౌండ్ నుంచి మాణిక్పూర్ బెల్లాల వరకూ దాదాపు రెండు కిలోమీటర్ల మేర రామనవమి ర్యాలీ సాగింది.
రామనవమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 500 ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహించేందుకు హిందూ సంస్ధలు ప్రణాళికలు రూపొందించాయి. మరోవైపు హిందూ జాగరణ్ మంచ్ బెంగాల్లోని 600 ప్రాంతాల్లో రామనవమి ఉత్సవాలను జరిపేందుకు నిర్ణయించింది.
Read More :
Adani Janata party | ప్రధాని మోదీకి అదానీనే జనతా, అదానీనే శ్రీరాముడు