న్యూఢిల్లీ: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సీబీఐ విచారణ చేపట్టాలని కేరళకు చెందిన స్వప్నా సురేశ్ ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రధానికి ఓ లేఖ రాశారు. కేరళ సీఎం విజయన్తో పాటు ఆయన ఫ్యామిలీ సభ్యులపై బంగారం స్మగ్లింగ్ కేసులో సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఆమె కోరింది. ప్రభుత్వ జోక్యం వల్లే ఈ కేసును కస్టమ్స్, ఎన్ఐఏకు అప్పగించినట్లు ఆమె తెలిపారు. అయితే ఆ రెండు ఏజెన్సీలు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో విచారణనను తప్పుదోవ పట్టిస్తున్నట్లు ప్రధానికి రాసిన లేఖలో ఆమె ఫిర్యాదు చేసింది. మెజిస్ట్రేట్కు వాంగ్మూలం ఇచ్చిన తర్వాత తనతో పాటు తన బంధువులపై వేధింపులు ఎక్కువ అయినట్లు స్వప్నా సురేశ్ ఫిర్యాదు చేశారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కేరళ ప్రభుత్వం తమను ఇరికించిందని, తమ స్వార్థం కోసం బలి పశువును చేసిందని ఆమె ఆరోపించారు. వ్యక్తిగతంగా ప్రధానిని కలిసి తన పరిస్థితిని వివరించాలనుకుంటున్నట్లు లేఖలో స్వప్న తెలిపింది.