న్యూఢిల్లీ, నవంబర్ 18:దేశీయ స్కూటర్ సెగ్మెంట్లో పోటీని తీవ్రతరం చేయడానికి మరో మోడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది సుజుకీ మోటర్సైకిల్. 125 సీసీ సామర్థ్యం కలిగిన ‘అవెనిస్’ ధరను రూ.86,700గా నిర్ణయించింది. గురువారం మార్కెట్లోకి విడుదల చేసినప్పటికీ, వచ్చే నెల నుంచి రిటైల్ మార్కెట్లో అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. యువత కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని ఈ స్కూటర్ను తీర్చిదిద్దినట్లు కంపెనీ ఎండీ సతోషి ఉచిడా తెలిపారు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఆపరేటింగ్ కలిగిన స్మార్ట్ఫోన్లు ఈ స్కూటర్తో కనెక్ట్ చేసుకునేవిధంగా టెక్నాలజీని ప్రవేశపెట్టింది.