సూర్యాపేట : సూర్యాపేటలో కరోనా కలకలం సృష్టించింది. జిల్లా వైద్యాధికారి కోటా చలంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఐదుగురు సైతం వైరస్ బారినపడ్డారు. చలం కుమారుడు గత నెల 19న కిందట జర్మనీ నుంచి వచ్చాడు. ఈ క్రమంలో జర్మనీ, హైదరాబాద్ ఎయిర్ పోర్ట్లో కొవిడ్ పరీక్షలు నెగెటివ్గా తేలింది.
రెండు రోజుల కిందట చలం కుటుంబం తిరుపతి వెళ్లి వచ్చింది. జ్వరం రావడంతో పరీక్ష చేసుకున్న జిల్లా వైద్యాధికారికి పాజిటివ్ వచ్చింది. మిగిలిన ఐదుగురు కుటుంబీకులకు సైతం పరీక్షలు చేయగా.. వైరస్ సోకినట్లు తేలింది. భార్య, కుమారుడు, కోడలికు పాజిటివ్గా నిర్ధారణ అయింది. బుధవారం ఎయిడ్స్ డేలో డీఎంహెచ్వో కోటా చలం పాల్గొన్నారు.