బొడ్రాయిబజార్, మార్చి 10 : మహిళా లోకానికి సావిత్రీబాయిపూలే స్ఫూర్తిదాయకమని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మాజీ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వసంత సత్యనారాయణపిైళ్లె అన్నారు. సావిత్రీబాయిపూలే వర్ధంతిని పురస్కరించుకుని గురువారం స్థానిక మహాత్మా జ్యోతిరావుపూలే విగ్రహం వద్ద ఆమె ఫ్లెక్సీకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దిన ఘనత సావిత్రిదని కొనియాడారు. సావిత్రీబాయిపూలే జయంతిని జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించి జయంతి, వర్ధంతిని కేంద్రం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చలమల్ల నర్సింహ, జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి నారాయణగౌడ్, అక్కినపల్లి జానయ్య, నిద్ర సంపత్, మట్ట రమేశ్, కుంచం అంజయ్య పాల్గొన్నారు.
తుంగతుర్తి : మహిళా హక్కుల కోసం పోరాటం చేసిన సంఘ సంస్కర్త సావిత్రీబాయి పూలే అని డీసీసీబీ డైరెక్టర్, పీఏసీఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు. మండల కేంద్రంలోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజానికి ఆమె పూలే చేసిన సేవలు మరువలేనివన్నారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య, ఎంపీటీసీ చెరుకు సృజన పరమేశ్, గుండగాని రాములుగౌడ్, కటకం వెంకటేశ్వర్లు, దీప్లానాయక్ పాల్గొన్నారు.
తిరుమలగిరి : మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వర్ధంతిని నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు తన్నీరు రాంప్రభు, కొత్తగట్టు మల్లయ్య, పోరెళ్ల లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు, బత్తుల శ్రీను, లింగయ్య పాల్గొన్నారు.