నల్లగొండ : జిల్లాలోని నిడమనూరు మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న లారీ ప్రమాదంలో సర్పంచ్ కుటుంబం దుర్మరణం పాలైంది. పెద్దవూరు మండలం తెప్పలమడుగు గ్రామ సర్పంచ్ తరి శ్రీను, ఈయన భార్య విజయ, ఇరువురు పిల్లలు(కుమార్తె, కుమారుడు) చనిపోయారు.
గ్రామంలోని ప్రధాన రహదారిపై అదుపుతప్పిన లారీ.. పుచ్చకాయల లోడ్తో వెళ్తున్న ట్రాలీ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో ముందు వెళ్తున్న బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న సర్పంచ్ కుటుంబం అదుపుతప్పి లారీ కిందపడి దుర్మరణం పాలైంది. ఆటో డ్రైవర్కు గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
శుక్రవారం ఉదయం సైతం నల్లగొండ జిల్లాలోని చింతగూడెం స్టేజీ వద్ద టిప్పర్ లారీ ఢీకొనడంతో బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. జిల్లాలో చోటుచేసుకున్న వరుస రోడ్డు ప్రమాదాలతో సర్వత్రా విషాదం నెలకొంది.