హైదరాబాద్ : పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైన సురభి వాణీదేవి ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. శాసన మండలిలోని చాంబర్లో ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి.. ఆమెతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఆమె గత మార్చిలో హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన గెలుపొందిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాంచందర్రావుపై విజయం సాధించారు. ఎన్నికల్లో వాణీదేవి 1,89,339 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థికి 1,37,566 ఓట్లు వచ్చాయి.