న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: తన అరెస్టును సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఈనెల 9న ఇచ్చిన ఉత్తర్వులను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. దీనిపై ఏప్రిల్ 15న న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనున్నది. మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేయటాన్ని హైకోర్టు సమర్థించింది.
అతను పదే పదే ఈడీ పంపిన సమన్లను పట్టించుకోకపోవడంతో పాటు దర్యాప్తుకు సహకరించనందుకు ఈడీ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. 15వ తేదీ వరకు ఆయనకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు.