న్యూఢిల్లీ: చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (ఉపా)లోని కొన్ని నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై బదులివ్వాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. మాజీ ఐఏఎస్ అధికారి అమితాబ పాండే, మరికొందరు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. అసమ్మతివాదులను అణచివేయడానికి ‘ఉపా’ను వాడుతున్నారని పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సీయూ సింగ్ తెలిపారు. సెక్షన్ 43డీ(5) (బెయిల్ మంజూరుపై ఆంక్షలు)లో నిబంధన ఏకపక్షమని, ఆర్టికల్ 21 (స్వేచ్ఛా హక్కు)కు విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు.