న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త తీస్తా సెత్లవాదికి సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ను మంజూరీ చేసింది. జూన్ నెలలో గుజరాత్ పోలీసులు ఆమెను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జూన్ 25వ తేదీ నుంచి ఆమె పోలీసు కస్టడీలో ఉంది. 2002 గుజరాత్ అల్లర్ల ఘటనపై ఫేక్ డాక్యుమెంట్లతో కేసులు బుక్ చేసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. అప్పటి గుజరాత్ సీఎం మోదీతో పాటు అనేక మంది ఉన్నత అధికారులపై ఆమె కేసు ఫైల్ చేశారు. దాని కోసం ఆమె ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇవాళ సీజేఐ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆ కేసును విచారించింది. సుప్రీం బెంచ్లో రవీంద్ర భట్, సుధాన్షు దులియా ఆ ధర్మాసనంలో ఉన్నారు. కస్టడీ విచారణ ముగిసింది కాబట్టి గుజరాత్ ప్రభుత్వం తాత్కాలిక బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించినట్లు కోర్టు తెలిపింది.