ముంబై: బౌలింగ్నే బలంగా నమ్ముకున్న సన్రైజర్స్ హైదరాబాద్ గురువారం ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. రెండు పరాజయాలతో సీజన్ ఆరంభించిన సన్రైజర్స్ అనంతరం గొప్పగా పుంజుకుని వరుసగా ఐదు మ్యాచ్లు నెగ్గి ఔరా అనిపించింది. ప్రత్యర్థులకు షాకిస్తూ ప్లేఆఫ్స్ వైపు అడుగులు వేస్తున్న హైదరాబాద్ మరో కీలక్ మ్యాచ్కు సిద్ధమైంది. 9 మ్యాచ్లు ఆడి ఐదు విజయాలతో 10 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న విలియమ్సన్ సేన ఢిల్లీతో అమీతుమీ తేల్చుకోనుంది.
రన్ రేట్ మెరుగ్గా ఉన్న రైజర్స్ గురువారం సమిష్టిగా రాణిస్తే ప్లేఆఫ్స్లో బెర్త్ అవకాశాన్ని మరింత మెరుగు చేసుకోనుంది. వరుసగా రెండు ఓటముల నుంచి తేరుకుని కొత్త శక్తితో హైదరాబాద్ బరిలోకి దిగాల్సి ఉంది. యువ సంచలనం ఉమ్రాన్ మాలిక్ గత మ్యాచ్లో భారీ స్కోర్ సమర్పించుకున్నా అతడిపైనే ఆరెంజ్ ఆర్మీ ఆశలు ఉంచింది. అతడికి మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్ తోడైతే హైదరాబాద్కు తిరుగుండదు. బ్యాటింగ్ పరంగా కెప్టెన్ కేన్ విలియమ్సన్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, మార్క్మ్,్ర పూరన్ సమిష్టిగా రాణిస్తే రైజర్స్ మరో విజయాన్ని నమోదు చేయడం పక్కా. తదుపరి దశకు చేరాలంటే ఇకపై ప్రతీ మ్యాచ్ నెగ్గాల్సిన అవసరం ఉండడంతో ఢిల్లీ సర్వశక్తులు ఒడ్డనుంది. తొమ్మిది మ్యాచ్ల్లో నాలుగు నెగ్గిన పంత్ సేన పుంజుకోవాల్సిన అవసరం ఉంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, అభిషేక్ శర్మ శుభారంభం చేస్తే పంత్, పృథ్వీ షా, రోవ్మన్ పావెల్ రాణిస్తే ఢిల్లీకి తిరుగుండదు.