హైదరాబాద్ , జూన్ 6: సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా(ఎస్టీపీఐ)30వ ఫౌండేషన్ డే పురస్కరించుకుని12 సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్(సీఓఈ)లను అదనంగా యాడ్ చేయడానికి ఇటీవలనే అనుమతులు పొందామని, త్వరలోనే వీటిని పలు నగరాలలో ప్రారంభించనున్నామని ఎస్టీపీఐ డైరెక్టర్జనరల్డా.ఓంకార్రాయ్అన్నారు.వైజాగ్లోఇండస్ట్రీ4.0టెక్నాలజీసీఓఈనుప్రారంభించనున్నామని,హెల్త్టెక్, బిగ్ డాటా, ఏఐకు సంబంధించిన సీఓఈ ఏఐసీ ఎస్టీపీఐ నెక్ట్స్ ను బెంగళూరులో; వ్యవసాయ సీఓఈలో ఐఓటీని అకోలా ,ఈశాన్య రాష్ట్రాల రాజధాని నగరాలు గ్యాంగ్టక్ (హెల్త్కేర్, అగ్రిటెక్లో ఐటీ అప్లికేషన్స్), ఈటానగర్(డ్రోన్ టెక్ సహా జీఐఎస్ అప్లికేషన్స్), కోహిమా (గ్రాఫిక్ డిజైన్ లో ఐటీ అప్లికేషన్), ఐజ్వాల్ (గేమింగ్), అగర్తలా(డాటా ఎనలిటిక్స్) వీటిలో కూడా ఈ సీఓఈలలో ఉన్నాయని ఆయన వెల్లడించారు.
తమ 30వ ఫౌండేషన్ డే పురస్కరించుకుని డాక్టర్ ఓంకార్ రాయ్ మాట్లాడుతూ భారతీయ ఐటీ పరిశ్రమ అవసరాలను తీర్చేందుకు తాము నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నామన్నారు. సంస్థ వర్క్ కల్చర్ లోనే పోటీతత్త్వం జొప్పించామంటూ పలు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు 13 సీఓఈల ఏర్పాటుకు తోడ్పాటునందించాయని, నిర్ధేశించుకున్న కాలంలో ఈ 12సీఓఈలను ప్రారంభించేందుకు ప్రణాళిక చేస్తున్నామన్నారు.