న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టిన సంస్థలు..వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.1.11 లక్షల కోట్ల మేర ఖర్చు చేయబోతున్నాయి. ఈ నిధులను తమ వ్యాపారాన్ని విస్తరించడానికి, ఇతర అవసరాలకు వినియోగించనున్నాయి. వీటిలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ), గెయిల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఆయిల్ ఇండియా లిమిటెడ్లు ఉన్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసిన రూ.1.04 లక్షల కోట్లతో పోలిస్తే ఏడు శాతం అధికం.