హైదరాబాద్ : తెలంగాణలో లాక్డౌన్ విధించిన క్రమంలో బుధవారం రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ అత్యవసర సమావేశమైంది. జూమ్ యాప్ ద్వారా ఎస్ఎల్బీసీ చైర్మన్ ఓపీ మిశ్రా నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లాక్డౌన్ రోజుల్లో బ్యాంకుల పని వేళలు, సిబ్బంది పని గంటలు, ఉద్యోగులకు వ్యాక్సినేషన్పై చర్చించారు. ఈ సందర్భంగా బ్యాంకుల వేళలు మార్చాలని బ్యాంకర్ల కమిటీ బ్యాంకుల వేళలు మార్చాలని కోరిన బ్యాంకర్ల కమిటీ సభ్యులు కోరారు. ఉదయం8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే ఉండాలని నాబార్డు, గ్రామీణ బ్యాంకులు సిఫారసు చేశాయి. తొలి రెండు గంటలు మాత్రమే ఖాతాదారులకు సేవలు ఉండాలని, ఆ తర్వాత రెండు గంటలు బ్యాంకు అంతర్గత విధులు కేటాయించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే బ్యాంకు ఉద్యోగులందరికీ త్వరగా టీకా వేయించాలని ఎస్ఎల్బీసీ సభ్యులు కోరారు.