హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): మనం ఏది అడిగినా నో డాటా అవైలేబుల్ అని సమాధానం ఇచ్చే కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు.. ఇప్పుడు మీడియాను చూసి పరుగులు పెడుతున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. రెజ్లర్ల అంశంపై స్పందించాలని ఓ విలేకరి కేంద్రమంత్రి మీనాక్షి లేఖిని ప్రశ్నించగా ఆమె పరుగు తీశారు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ స్పందిస్తూ తాను ఇప్పటి వరకు ‘భాగ్ మిల్కా భాగ్’ గురించి విన్నానని.. ఇప్పుడు ‘భాగ్ మంత్రి భాగ్’ చూస్తున్నానని చెప్పారు. ‘మీ దగ్గర (బీజేపీ నేతలు, మంత్రులు) సరైన సమాధానం లేకుంటే ఇలాగే ఉంటుంది. ప్రజలను, మీడియానుఎదుర్కోలేరు’ అని పేర్కొన్నారు.