భువనగిరి అర్బన్, మార్చి 6 : భువనగిరి మండలం యెర్రంబెల్లి గ్రామానికి చెందిన పడమటి అన్విత అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రం ప్రభుత్వ పురస్కారానికి ఎంపికయ్యారు. అన్విత పర్వతారోహకురాలిగా ఇప్పటికే నాలుగు అత్యంత ఎత్తయిన శిఖరాలను అధిరోహించారు. 18 నెలల్లో యూరప్లోని ఎల్బ్రస్, ఆఫ్రికాలోని కిలిమంజారో, ఆసియాలోని ఎవరెస్ట్, అంటారిటికాలోని మౌంట్ విన్సన్ పర్వతాలను ఎక్కి దేశ ఖ్యాతిని చాటారు. మరో 3 పర్వతాలను ఎక్కే లక్ష్యంతో ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మహిళాలోకానికి ఆదర్శంగా నిలుస్తున్న ఆమె ప్రతిభకు గుర్తింపుగా సర్కారు అవార్డు అందజేయనున్నది. ఈ సందర్భంగా అన్విత సంతోషం వ్యక్తం చేస్తూ తనను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన మహిళలకు పురస్కారాల్లో భువనగిరి మండలం యర్రంబెల్లి గ్రామానికి చెందిన పడమటి అనిత్వకు చోటు దక్కింది. ప్రపంచంలోని ఏడు ఖండాల్లోని అత్యంత ఎత్తైన పర్వతాలను 18నెలల్లో అధిరోహించాలని లక్ష్యం పెట్టుకుని నాలుగు అధిరోహించింది. మరో మూడు అధిరోహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఆమె ప్రతిభకు ప్రభుత్వం మహిళా పురస్కారం ప్రకటించింది.భువనగిరి మండలం ఎర్రంబెల్లి గ్రామానికి చెందిన పడమటి మధుసూదన్రెడ్డి, చంద్రకళ దంపతుల కూతురు అన్విత. తండ్రి రైతు కాగా తల్లి అంగన్వాడీ టీచర్. ఎంబీఏ చదివిన అన్విత 17ఏండ్ల వయసు నుంచి కొండలు ఎకడం నేర్చుకుంది. అనంతరం భువనగిరి రాక్ ైక్లెబింగ్ సూల్లో శిక్షణ పొందింది. పర్వతా రోహణపై పట్టు సాధించి చిన్న చిన్న కొండలను అధిగమిస్తూ భూమిపై అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ను అధిరోహించిన తెలంగాణకు చెందిన రెండో మహిళగా గుర్తింపు పొందింది. అంతకుముందు సికింలోని రీనాక్, బీసీ రాయ్ తదితర గిరులను అధిరోహించింది. ప్రస్తుతం భువనగిరి రాక్ ైక్లెబింగ్ సూల్లో శిక్షకురాలిగా పనిచేస్తున్న ఆమె పర్వతారోహణ రంగంలో తన పేరు సుస్థిరంగా నిలిచిపోవాలనే లక్ష్యాన్ని ఎంచుకుని ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఉన్న ఏడు అత్యంత ఎత్తైన పర్వతాలను 18నెలల వ్యవధిలో అధిరోహించడం లక్ష్యంగా పెట్టుకుంది.