హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): భూ రికార్డుల నిర్వహణ, లావాదేవీల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ‘ధరణి’ పోర్టల్ను త్వరలో ఢిల్లీ బృందం పరిశీలించనున్నట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే ప్రధానమంత్రి అవార్డు కోసం ఇటీవలే రాష్ట్ర అధికారులు ధరణిని ప్రతిపాదించారు. సుపరిపాలనలో భాగంగా ప్రజల సౌలభ్యం కోసం అమలు చేస్తున్న ఉత్తమ కార్యక్రమాలను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అవార్డు కోసం దరఖాస్తు చేస్తుంటాయి. తెలంగాణ నుంచి ధరణిని ప్రతిపాదించగా.. ప్రాథమిక పరిశీలన పూర్తయినట్టు తెలిసింది. క్షేత్రస్థాయి పరిశీలన కోసం ఢిల్లీ నుంచి జాతీయ బృందం తెలంగాణకు రానున్నట్టు తెలిసింది.