హైదరాబాద్, ఆట ప్రతినిధి: అంతర్జిల్లాల ఫెన్సింగ్ టోర్నమెంట్ను ఈనెల 12 నుంచి నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఫెన్సింగ్ సంఘం అధ్యక్షుడు మర్రి రాజశేఖర్రెడ్డి తెలిపారు. కరీంనగర్లోని అక్షర ఇంటర్నేషనల్ పాఠశాలలో జరిగే టోర్నీలో సబ్ జూనియర్ అండర్-14, క్యాడెట్ అండర్-17, జూనియర్ అండర్-20 విభాగాల్లో బాలబాలికలకు పోటీలు ఉంటాయని ఆయన వెల్లడించారు. ఈ పోటీల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులు ఈనెల 27 నుంచి హర్యానాలో జరుగనున్న జాతీయ జూనియర్ ఫెన్సింగ్ టోర్నీకి ఎంపికవుతారని పేర్కొన్నారు.