‘చుట్టూ ఉన్నవారంతా అతన్ని లక్కీ ఫెలో అంటున్నా..తాను మాత్రం ఎప్పటికీ దురదృష్టవంతున్ని అని ఫీలయ్యే ఓ యువకుడి కథతో ‘లక్కీ లక్ష్మణ్’ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’ అని చెప్పారు ఏఆర్బీ. ఆయన దర్శకత్వంలో బిగ్బాస్ ఫేమ్ సోహైల్, మోక్ష జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దత్తాత్రేయ మీడియా పతాకంపై హరిత గోగినేని నిర్మించారు. ఈ సినిమాలోని ‘ఓ మేరీ జాన్ మనసే నువ్వే కావాలన్నదే..’ అనే సాంగ్ను దర్శకుడు చందు మొండేటి విడుదల చేశారు.
భాస్కరభట్ల రాసిన ఈ గీతాన్ని అనురాగ్ కులకర్ణి ఆలపించారు. చక్కటి రొమాంటిక్ గీతంగా అలరిస్తుందని చిత్రబృందం పేర్కొంది. రాజా రవీంద్ర, సమీర్, కాదంబరి కిరణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, సంగీతం: అనూప్రూబెన్స్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయానంద్, కథ, స్క్రీన్ప్లే, సంభాషణలు, దర్శకత్వం: ఏఆర్బి.