పాట్నా: బీహార్లోని శశస్త్ర సీమాబల్లో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన జవాను చీమల విష్ణు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఎస్బీ 45 బెటాలియన్కు చెందిన అతను సుపౌల్లోని వీర్పూర్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. తన వద్ద ఉన్న గన్తో కాల్చుకుని విష్ణు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన అతని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.