తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కొవిడ్ నిబంధనల మధ్య భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. నిన్న 35,333 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 12,252 మంది తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. భక్తులు సమర్పించిన కానుకల వల్ల టీటీడీకి రూ.2. 52 కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని తెలిపాయి.