తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.2.45 కోట్లు హుండీ రూపేణా ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్కరోజే 31,523 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 14,692 మంది తలనీలాలు సమర్పించుకున్నారని వివరించారు. కరోనా ఉద్ధృతి పెరుగుతున్న సందర్భంగా భక్తుల రాక కూడా తగ్గుముఖం పడుతుంది.
జనవరి 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు తిరుమలకు వచ్చిన భక్తుల సంఖ్య ఈ విధంగా ఉన్నాయి. 1న 36,560 మంది భక్తులు రాగా, 2న 38,894 మంది, 3న 31,776 మంది, 4న 31,523 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు.