శ్రీశైలం : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మళ్లీ పెరుగుతుంది. సోమవారం ఉదయం జూరాల ప్రాజెక్టు ద్వారా 1,10,660 క్యూసెక్కులు, విద్యుదోత్పత్తి ద్వారా 29,769 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 12,831 క్యూసెక్కులు మొత్తం 1,53,260 క్యూసెక్కుల నీరు విడుదలైంది. సాయంత్రం ఆరు గంటల వరకు రిజర్వాయర్కు 47,069 క్యుసెక్కుల ఇన్ఫ్లో వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎడమగట్టులో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని, దీంతో 25,427 క్యుసెక్కుల వరద దిగువకు వెళ్తోందని పేర్కొన్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 873.70 అడుగుల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.