తిరుమల: ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచారం చేయడంలో భాగంగా అక్టోబరు 15 నుంచి నవంబరు 13వ తేదీ వరకు యూకె,యూరప్ దేశాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు . అన్నయ్య భవన్లో ఆయన ఇందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు .
ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దగ్గర చేయాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి టీటీడీని ఆదేశించారన్నారు . ఈ మేరకు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇప్పటికే శ్రీనివాస కల్యాణాలు , వైభవోత్సవాలు నిర్వహించామని తెలిపారు . ఈ ఏడాది జూన్ జులై లో అక్కడి తెలుగు సంఘాలు , ఏపీ ఎన్నార్, టీఎస్ సహకారంతో అమెరికా లోని 9 నగరాల్లో స్వామి వారి కల్యాణాలు నిర్వహించామన్నారు.
యూకె , యూరప్ తెలుగు సంఘాల సహకారం తో అక్కడి భక్తుల కోరిక మేరకు స్వామివారి కళ్యాణోత్సవాలు నిర్వహించబోతున్నామని చైర్మన్ వెల్లడించారు. అక్టోబరు 15న యూకె లోని బాసింగ్ స్టేక్ ( basing stoke ), 16న మాంచెస్టర్ ( manchester ), 22న నార్తన్ ఐర్లాండ్ లోని బెల్ఫాస్ట్ ( belfast , northern ireland ), 23న డబ్లిన్ ( dublin , ఐర్లాండ్ )లో కల్యాణాలు జరుగుతాయన్నారు .
అక్టోబరు 29న ఈయూ లోని జురిచ్ స్విట్జర్లాండ్ ( zurich switzerland EU ), 30వ తేదీ నెదర్లాండ్స్ లోని ఆమ్స్టార్డమ్ ( Amsterdam Netherlands EU ), నవంబరు 5న జెర్మనీ లోని ఫ్రాంక్ఫర్ట్ ( Frankfurt , Germany ), 6న పారిస్ ఫ్రాన్స్ ( Paris ,frans ) 12న లండన్ ( London )13న స్కాట్లాండ్ లోని ఎడిన్బర్గ్ ( Edinburgh , Scotland UK )లో స్వామివారి కల్యాణాలు నిర్వహించనున్నామని తెలిపారు .