Srilanka : కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన రెండో వన్డేలో ఓడిపోయిన శ్రీలంక అనుకోని రికార్డు సాధించింది. వన్డే ఓటముల పరంగా ఆ జట్టు భారత్ను దాటేసింది. వన్డేల్లో శ్రీలంకకు ఇది 437వ ఓటమి. భారత్ 436 పరాజయాలతో రెండో స్థానంలో ఉంది. టీ20ల్లో కూడా అత్యధిక సార్లు ఓడిపోయిన జట్టుగా లంక నిలిచింది. ఆ జట్టు ఇప్పటివరకూ 94 టీ20ల్లో ఓటమి పాలైంది. అంతేకాదు టీమిండియా చేతిలో ఆ జట్టు అత్యధిక మ్యాచ్లు ఓడిపోయింది. ఇప్పటి వరకూ భారత్ వన్డేల్లో 95 సార్లు, టీ20ల్లో 19 సార్లు లంకను మట్టి కరిపించింది.
భారత పర్యటనలో ఇప్పటికే శ్రీలంక మూడు టీ20 సిరీస్ కోల్పోయింది. రెండో వన్డేలో గెలిచిన ఇండియా వన్డే సిరీస్ కూడా సొంతం చేసుకుంది. 216 టార్గెట్ ఛేదనలో భారత్ 86 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అయితే.. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో (64) జట్టును గెలిపించాడు. హార్ధిక్ పాండ్యా(32), అక్షర్ పటేల్ (21)తో కలిసి విలువైన పరుగులు జోడించాడు. నామమాత్రమైన మూడో వన్డే జనవరి 15న తిరువనంతపురంలో జరగనుంది.