Mantralayam : స్వధర్మ వాహిని ప్రచార యాత్రలో భాగంగా శ్రీ విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానదేంద్ర సరస్వతి మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు. ఆయనకు మఠం అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని, శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి స్వాత్మానదేంద్ర ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్థ స్వామిజీ ఫల. పుష్ప మంత్రాక్చతలు ఇచ్చి ఆశీర్వాదించారు.
స్వాత్మానదేంద్ర సరస్వతి మాట్లాడుతూ.. మంత్రాలయం పీఠానికి, విశాఖ శారదా పీఠానికి ఆవినాభ సంబంధం ఉందని అన్నారు. శ్రీకృష్ణడు, అర్జునుడికి మధ్య ఉన్న సంబంధం ఎటువంటిదో, మంత్రాలయం పీఠం. శారదా పీఠం మధ్య సంబంధం అటువంటిదని ఆయన తెలిపారు. ఈ రోజు శ్రీ సుభుదేంద్ర స్వామిని కలవడం తనకు చాలా ఆనందంగా ఉందని, శారదా పీఠం మాదిరిగానే మంత్రాలయం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు హైందవ ధర్మాన్ని ముందుకు తీసుకోపోతున్నారని స్వాత్మానదేంద్ర అన్నారు. అంతేకాదు హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడమే శ్రీ రాఘవేంద్రస్వామి పీఠం, విశాఖ శారదా పీఠం లక్ష్యం అని స్వాత్మానదేంద్ర తెలిపారు.