ఝరాసంగం : శ్రీరాముడు ( Sri Ram ) ధర్మానికి ప్రతిరూపమని ప్రజలందరికీ న్యాయం అందించిన ఆదర్శ పురుషుడని బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతి డాక్టర్ సిద్ధేశ్వరానందగిరి మహారాజ్ ( Siddheswaranandagiri Maharaj ) అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఝరాసంగం పరిధిలోని బర్దిపూర్, కుప్పా నగర్, ఏడాకులపల్లి తదితర ప్రాంతాల్లో నిర్వహించిన రామనవమి వేడుకల్లో ఆయన పాల్గొని భక్తులకు ప్రవచనాలు అందించారు.
రాజ్య పాలనలోనూ, వనవాసంలోనూ, యుద్ధాల్లోనూ సత్యం, ధర్మం, న్యాయం మార్గాన్నే అనుసరించినవాడే శ్రీరాముడు అని తెలిపారు. రామనామ స్మరణతో మనసుకు ప్రశాంతత కలుగుతుందని, ధర్మ మార్గంలో నడిచే శక్తి లభిస్తుందని అన్నారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన శ్రీరామనవ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.