తిరుపతి,జూన్ 26: అప్పలాయగుంట శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన శనివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారు సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాహనసేవలు ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 7గంటల వరకు అశ్వవాహనంపై శ్రీప్రసన్నవేంకటేశ్వరస్వామివారు దర్శనమిచ్చారు. ప్రజలను రంజింపజేసేవారే రాజులు. అనంతవిశ్వానికి సర్వభూపాలుడు అయిన శ్రీనివాసుడు కలియుగంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సర్వభూపాల వాహనాన్ని అధిరోహిస్తాడు. అంతేగాక పాలకులు భగవత్సేవాపరులు కావాలని సర్వభూపాల వాహనసేవ ద్వారా స్వామివారు దివ్యమైన సందేశాన్నిచ్చారు.