ఫొటొరైటఫ్: 30వైడీడీ10ఏ: యాదాద్రి బాలాలయంలో సుదర్శన నారసింహహోమం నిర్వహిస్తున్న అర్చకులు
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లకు నిజాభిషేకం నిర్వహించారు. తులసీ దళాలతో అర్చించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. ఆలయ మండపంలో సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణ మహోత్సవం జరిపించారు.
కొండపైన ఉన్న పర్వతవర్ధనీ రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యే క పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. కొండ కింద భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి సంకల్పంలో పాల్గొన్నారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్ఠమూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి. యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే సత్యనారాయణ స్వామి వారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.
నేడు యాదాద్రికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు నేడు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం స్వామి వారిని దర్శించుకున్ని ప్రత్యేక పూజలు చేపట్టనున్నారు.